ETV Bharat / bharat

'భర్త వీర్యంపై హక్కు భార్యదే... తండ్రిది కాదు' - 'ఆ హక్కు భార్యకు మాత్రమే హక్కు ఉంటుంది'

మృతి చెందిన వ్యక్తి వీర్యాన్ని తీసుకునే అధికారం.. అతడి భార్యకు మాత్రమే ఉంటుందని స్పష్టం చేసింది కోల్​కతా హైకోర్టు. మరణించిన వ్యక్తి తండ్రికి ఈ విషయంలో ఎలాంటి హక్కులు ఉండబోవని తేల్చి చెప్పింది.

culcutta high court
'ఆ హక్కు భార్యకు మాత్రమే హక్కు ఉంటుంది'
author img

By

Published : Jan 22, 2021, 2:04 PM IST

Updated : Jan 22, 2021, 2:14 PM IST

మరణించిన వ్యక్తి వీర్యంపై అధికారం అతడి భార్యకు మాత్రమే ఉంటుందని కలకత్తా హైకోర్టు స్పష్టం చేసింది.

ఆస్పత్రిలో భద్రపరిచిన తన కుమారుడి వీర్యాన్ని తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఓ వ్యక్తి న్యాయస్థానంలో వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై వాదనలు విన్న న్యాయస్థానం పిటిషన్​ను కొట్టివేసింది. ఈ విషయంలో పిటిషనర్​కు ఎలాంటి ప్రాథమిక హక్కులు లేవని జస్టిస్​ సవ్యసాచి భట్టాచార్య స్పష్టం చేశారు.

ఎన్​ఓసీ అయినా...

అంతకుముందు పిటిషనర్ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాదులు.. మృతుడు తలసేమియా వ్యాధిగ్రస్థుడని తెలిపారు. ఆస్పత్రిలో భద్రపరిచిన వీర్యాన్ని పిటిషనర్ తీసుకునేందుకు మృతుడి భార్యను 'నో అబ్జెక్షన్​ సర్టిఫికెట్​' ఇవ్వాల్సిందిగా ఆదేశించాలని కోరారు. ఇందుకు న్యాయస్థానం నిరాకరించింది. ప్రాథమిక హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లనందున... తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది.

దిల్లీలోని ఓ ఆసుపత్రిలో మృతుడి వీర్యాన్ని భద్రపరిచారు. దాన్ని సేకరించేందుకు అతడి తండ్రి ప్రయత్నించగా.. మృతుడి భార్య అనుమతి తీసుకోవాలని ఆసుపత్రి యాజమాన్యం సూచించింది. దాంతో కోర్టును ఆశ్రయించారు సదరు తండ్రి.

ఇదీ చూడండి:యూపీఎస్​సీ ఆశావహులకు కేంద్రం షాక్​!

మరణించిన వ్యక్తి వీర్యంపై అధికారం అతడి భార్యకు మాత్రమే ఉంటుందని కలకత్తా హైకోర్టు స్పష్టం చేసింది.

ఆస్పత్రిలో భద్రపరిచిన తన కుమారుడి వీర్యాన్ని తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఓ వ్యక్తి న్యాయస్థానంలో వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై వాదనలు విన్న న్యాయస్థానం పిటిషన్​ను కొట్టివేసింది. ఈ విషయంలో పిటిషనర్​కు ఎలాంటి ప్రాథమిక హక్కులు లేవని జస్టిస్​ సవ్యసాచి భట్టాచార్య స్పష్టం చేశారు.

ఎన్​ఓసీ అయినా...

అంతకుముందు పిటిషనర్ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాదులు.. మృతుడు తలసేమియా వ్యాధిగ్రస్థుడని తెలిపారు. ఆస్పత్రిలో భద్రపరిచిన వీర్యాన్ని పిటిషనర్ తీసుకునేందుకు మృతుడి భార్యను 'నో అబ్జెక్షన్​ సర్టిఫికెట్​' ఇవ్వాల్సిందిగా ఆదేశించాలని కోరారు. ఇందుకు న్యాయస్థానం నిరాకరించింది. ప్రాథమిక హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లనందున... తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది.

దిల్లీలోని ఓ ఆసుపత్రిలో మృతుడి వీర్యాన్ని భద్రపరిచారు. దాన్ని సేకరించేందుకు అతడి తండ్రి ప్రయత్నించగా.. మృతుడి భార్య అనుమతి తీసుకోవాలని ఆసుపత్రి యాజమాన్యం సూచించింది. దాంతో కోర్టును ఆశ్రయించారు సదరు తండ్రి.

ఇదీ చూడండి:యూపీఎస్​సీ ఆశావహులకు కేంద్రం షాక్​!

Last Updated : Jan 22, 2021, 2:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.