ETV Bharat / bharat

బ్లాక్ ఫంగస్​తో భార్య మృతి- నలుగురు పిల్లలతో కలిసి భర్త ఆత్మహత్య

author img

By

Published : Oct 23, 2021, 5:02 PM IST

కర్ణాటకలో అత్యంత విషాద ఘటన జరిగింది. బ్లాక్ ఫంగస్​తో భార్య మరణించిన కొద్ది రోజులకు నలుగురు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఓ భర్త. కుటుంబమంతా మరణించడం చూసి బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Wife dead by Black Fungus.. Husband committed suicide with four children
బ్లాక్ ఫంగస్​తో భార్య మృతి- నలుగురు పిల్లలతో కలిసి భర్త ఆత్మహత్య

బ్లాక్​ ఫంగస్​తో​ భార్య మరణించడాన్ని తట్టుకోలేక నలుగురు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఓ భర్త. పిల్లలకు విషమిచ్చి ఆపై తాను కూడా తాగి చనిపోయాడు. కర్ణాటక బెల్గాంలోని బోరగల్ గ్రామంలో ఈ విషాద ఘటన జరిగింది.

మృతుడి పేరు గోపాల్​ హాదిమణి. పిల్లల పేర్లు సౌమ్య(19), శ్వేత(16), సాక్షి(16), సృజన్​(8).

గోపాల్​ భార్య జయ జులై 6న బ్లాక్​ ఫంగస్​తో మరణించింది. అప్పటి నుంచి అతడు మానసికంగా కుంగిపోయాడు​. తన భార్య లేకుండా కుటుంబం బతకలేదని విషం తీసుకుని పిల్లలతో కలిసి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

Wife dead by Black Fungus.. Husband committed suicide with four children
బ్లాక్ ఫంగస్​తో భార్య మృతి- నలుగురు పిల్లలతో కలిసి భర్త ఆత్మహత్య

గోపాల్ కుటుంబం మృతితో అతని బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. ముగ్గురు ఆడపిల్లలను విగతజీవులుగా చూసి తల్లడిల్లారు. కన్నీరుమున్నీరుగా విలపించారు. గ్రామస్థులు కూడా పెద్ద సంఖ్యలో గోపాల్ ఇంటికి చేరుకున్నారు.

ఇదీ చదవండి: సిటీ బస్సు ఎక్కిన సీఎం- అవాక్కైన ప్రయాణికులు

బ్లాక్​ ఫంగస్​తో​ భార్య మరణించడాన్ని తట్టుకోలేక నలుగురు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఓ భర్త. పిల్లలకు విషమిచ్చి ఆపై తాను కూడా తాగి చనిపోయాడు. కర్ణాటక బెల్గాంలోని బోరగల్ గ్రామంలో ఈ విషాద ఘటన జరిగింది.

మృతుడి పేరు గోపాల్​ హాదిమణి. పిల్లల పేర్లు సౌమ్య(19), శ్వేత(16), సాక్షి(16), సృజన్​(8).

గోపాల్​ భార్య జయ జులై 6న బ్లాక్​ ఫంగస్​తో మరణించింది. అప్పటి నుంచి అతడు మానసికంగా కుంగిపోయాడు​. తన భార్య లేకుండా కుటుంబం బతకలేదని విషం తీసుకుని పిల్లలతో కలిసి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

Wife dead by Black Fungus.. Husband committed suicide with four children
బ్లాక్ ఫంగస్​తో భార్య మృతి- నలుగురు పిల్లలతో కలిసి భర్త ఆత్మహత్య

గోపాల్ కుటుంబం మృతితో అతని బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. ముగ్గురు ఆడపిల్లలను విగతజీవులుగా చూసి తల్లడిల్లారు. కన్నీరుమున్నీరుగా విలపించారు. గ్రామస్థులు కూడా పెద్ద సంఖ్యలో గోపాల్ ఇంటికి చేరుకున్నారు.

ఇదీ చదవండి: సిటీ బస్సు ఎక్కిన సీఎం- అవాక్కైన ప్రయాణికులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.