ETV Bharat / bharat

పెరుగుతున్న కేసులు.. బంగాల్​లో పాక్షిక లాక్​డౌన్​

author img

By

Published : May 1, 2021, 7:27 AM IST

బంగాల్​లో కొవిడ్​ మహమ్మారి విజృంభిస్తున్న వేళ.. పాక్షిక లాక్​డౌన్​ విధిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మార్కెట్లను రోజుకు 5 గంటలపాటు మాత్రమే తెరిచి ఉంచాలని పేర్కొంది. నిత్యవసర సరకుల విక్రయాలకు ఆంక్షల నుంచి మినహాయింపునిచ్చింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.

Lockdown
లాక్​డౌన్​

కరోనా కేసులు భారీగా పెరుగుతున్న వేళ రాష్ట్రంలో పాక్షిక లాక్‌డౌన్‌ విధిస్తున్నట్టు బంగాల్‌ ప్రభుత్వం వెల్లడించింది. షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, బ్యూటీ పార్లర్లు, సినిమా థియేటర్లు, క్రీడా సంబంధిత ప్రదేశాలు, స్పాలు మూసివేస్తున్నట్టు తెలిపింది. మార్కెట్లు 5 గంటల పాటు(ఉదయం 7 నుంచి 10 గంటల వరకు; మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు) మాత్రమే తెరిచి ఉంచాలని నిర్ణయించింది. రెస్టారెంట్లు, బార్‌లు, జిమ్‌లు, స్విమ్మింగ్‌ పూల్స్‌ను మూసివేయాలని ఆదేశించింది. హోం డెలివరీ, ఆన్‌లైన్‌ సేవలను అనుమతించింది. ఈ ఆదేశాలు తక్షణమే అమలులోకి వస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. తదుపరి ఉత్తర్వులు జారీచేసే వరకూ ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని స్పష్టంచేసింది.

అన్ని సామాజిక, సాంస్కృతిక, వినోద, విద్యా సంబంధమైన సమావేశాలను నిషేధించింది ప్రభుత్వం. ఔషధ దుకాణాలు, వైద్య సంబంధిత పరికరాలు, నిత్యావసర సరకుల విక్రయాలకు ఈ పాక్షిక లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపు ఇచ్చింది.

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మే 2న వెల్లడి కానున్నందున.. కౌంటింగ్ కేంద్రాల వద్ద కొవిడ్‌ నిబంధనలు పాటించాలని ఆదేశించింది. రాష్ట్రంలో రోజువారీ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గురువారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 17,403 కొత్త కేసులు.. 89 మరణాలు నమోదయ్యాయి.

ఇదీ చదవండి: కొవిడ్ సంరక్షణ కేంద్రంలో మంటలు-14 మంది మృతి

కరోనా కేసులు భారీగా పెరుగుతున్న వేళ రాష్ట్రంలో పాక్షిక లాక్‌డౌన్‌ విధిస్తున్నట్టు బంగాల్‌ ప్రభుత్వం వెల్లడించింది. షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, బ్యూటీ పార్లర్లు, సినిమా థియేటర్లు, క్రీడా సంబంధిత ప్రదేశాలు, స్పాలు మూసివేస్తున్నట్టు తెలిపింది. మార్కెట్లు 5 గంటల పాటు(ఉదయం 7 నుంచి 10 గంటల వరకు; మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు) మాత్రమే తెరిచి ఉంచాలని నిర్ణయించింది. రెస్టారెంట్లు, బార్‌లు, జిమ్‌లు, స్విమ్మింగ్‌ పూల్స్‌ను మూసివేయాలని ఆదేశించింది. హోం డెలివరీ, ఆన్‌లైన్‌ సేవలను అనుమతించింది. ఈ ఆదేశాలు తక్షణమే అమలులోకి వస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. తదుపరి ఉత్తర్వులు జారీచేసే వరకూ ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని స్పష్టంచేసింది.

అన్ని సామాజిక, సాంస్కృతిక, వినోద, విద్యా సంబంధమైన సమావేశాలను నిషేధించింది ప్రభుత్వం. ఔషధ దుకాణాలు, వైద్య సంబంధిత పరికరాలు, నిత్యావసర సరకుల విక్రయాలకు ఈ పాక్షిక లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపు ఇచ్చింది.

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మే 2న వెల్లడి కానున్నందున.. కౌంటింగ్ కేంద్రాల వద్ద కొవిడ్‌ నిబంధనలు పాటించాలని ఆదేశించింది. రాష్ట్రంలో రోజువారీ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గురువారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 17,403 కొత్త కేసులు.. 89 మరణాలు నమోదయ్యాయి.

ఇదీ చదవండి: కొవిడ్ సంరక్షణ కేంద్రంలో మంటలు-14 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.