ETV Bharat / bharat

'అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం'

author img

By

Published : Mar 20, 2021, 7:49 PM IST

భారత పర్యటనలో ఉన్న అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్​​తో విదేశాంగ మంత్రి డా.ఎస్​ జైశంకర్ సమావేశమయ్యారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఇరు దేశాలూ కలిసి పనిచేయాలని నిర్ణయించినట్లు ​ తెలిపారు.

Welcomed US Defence Secretary Lloyd J. Austin III at Ministry of External Affairs. A wide-ranging conversation on the global strategic situation. Look forward to working with him on enhancing our Strategic Partnership: EAM Dr S Jaishankar
అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యం పదిలం

అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ జె.ఆస్టిన్​.. భారత విదేశాంగ మంత్రి డాక్టర్​ ఎస్​.జై శంకర్​ సమావేశమయ్యారు. ప్రపంచ వ్యూహాత్మక పరిస్థితులపై విస్తృత చర్చలు జరిగినట్లు విదేశాంగ మంత్రి వెల్లడించారు. ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలపరిచేందుకు భారత్​తో కలిసి పనిచేస్తామని​ ఆస్టిన్​ తెలిపారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య బలమైన సంబంధం ఇరు దేశాలకే కాక.. ప్రపంచంలోని ఇతర దేశాలకూ కీలకమని జైశంకర్​ ఉద్ఘాటించారు.

Welcomed US Defence Secretary Lloyd J. Austin III at Ministry of External Affairs. A wide-ranging conversation on the global strategic situation. Look forward to working with him on enhancing our Strategic Partnership: EAM Dr S Jaishankar
అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్​​తో భారత విదేశాంగ మంత్రి డా. ఎస్​ జైశంకర్ సమావేశ చిత్రం

ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో వ్యూహాత్మక పరిస్థితులపైనా చర్చ జరిగినట్లు దౌత్య వర్గాలు వెల్లడించాయి. ప్రజాస్వామ్య వ్యవస్థ, మానవ హక్కులు ఎంతో ముఖ్యమైనవని.. వీటిని కాపాడేందుకు ఉన్నత విలువలతో ముందుకు వెళ్తామని అమెరికా రక్షణ మంత్రి చెప్పారు.

మూడు రోజుల భారత పర్యటనలో ఉన్న ఆస్టిన్​.. శుక్రవారం ఇక్కడికి​ చేరుకున్నారు.

ఇదీ చదవండి: 'ఇండోపసిఫిక్​ సుస్థిరతకు అమెరికా-భారత్​ బంధం కీలకం'

అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ జె.ఆస్టిన్​.. భారత విదేశాంగ మంత్రి డాక్టర్​ ఎస్​.జై శంకర్​ సమావేశమయ్యారు. ప్రపంచ వ్యూహాత్మక పరిస్థితులపై విస్తృత చర్చలు జరిగినట్లు విదేశాంగ మంత్రి వెల్లడించారు. ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలపరిచేందుకు భారత్​తో కలిసి పనిచేస్తామని​ ఆస్టిన్​ తెలిపారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య బలమైన సంబంధం ఇరు దేశాలకే కాక.. ప్రపంచంలోని ఇతర దేశాలకూ కీలకమని జైశంకర్​ ఉద్ఘాటించారు.

Welcomed US Defence Secretary Lloyd J. Austin III at Ministry of External Affairs. A wide-ranging conversation on the global strategic situation. Look forward to working with him on enhancing our Strategic Partnership: EAM Dr S Jaishankar
అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్​​తో భారత విదేశాంగ మంత్రి డా. ఎస్​ జైశంకర్ సమావేశ చిత్రం

ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో వ్యూహాత్మక పరిస్థితులపైనా చర్చ జరిగినట్లు దౌత్య వర్గాలు వెల్లడించాయి. ప్రజాస్వామ్య వ్యవస్థ, మానవ హక్కులు ఎంతో ముఖ్యమైనవని.. వీటిని కాపాడేందుకు ఉన్నత విలువలతో ముందుకు వెళ్తామని అమెరికా రక్షణ మంత్రి చెప్పారు.

మూడు రోజుల భారత పర్యటనలో ఉన్న ఆస్టిన్​.. శుక్రవారం ఇక్కడికి​ చేరుకున్నారు.

ఇదీ చదవండి: 'ఇండోపసిఫిక్​ సుస్థిరతకు అమెరికా-భారత్​ బంధం కీలకం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.