ETV Bharat / bharat

కళ్లు కనిపించకపోయినా గోల్డ్ మెడల్​.. 75 ఏళ్ల వయసులో పీహెచ్​డీ

author img

By

Published : Apr 24, 2022, 2:24 PM IST

Updated : May 6, 2022, 10:14 AM IST

అన్ని రకాల సదుపాయాలు, అవయవాలు ఉండికూడా విద్యను నిర్లక్ష్యం చేస్తున్న ఈ రోజుల్లో.. కళ్లు కనపడకున్నా కష్టపడి చదువుకొని బంగారు పతకాన్ని సాధించాడు కర్ణాటకకు చెందిన అన్విత్​ కుమార్​. విశ్వవిద్యాలయ చరిత్రలోనే అత్యధిక మార్కులు సంపాదించిన విద్యార్థిగా నిలిచి ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు​. మరోవైపు.. 75 ఏళ్ల వయసులో పీహెచ్​డీ పూర్తి చేశారు ఓ మహిళ.

75 years old woman done phd
Visually Impaired student got a gold medal

కళ్లు కనిపించకపోయినా గోల్డ్ మెడల్​.. 75 ఏళ్ల వయసులో పీహెచ్​డీ

Visually Impaired Student Got A Gold Medal: చదువుకోవాలనే దృఢ సంకల్పం ఉంటే ఎలాంటి అవరోధాలు ఎదురైనా లక్ష్యాన్ని చేరుకోగలమని నిరూపించాడు ఓ అంధ విద్యార్థి. కర్ణాటక మంగళూరు కుంబాలకు చెందిన అన్విత్​ కుమార్​ దృష్టి లోపంతో బాధపడుతున్నాడు. అయినా నిరాశ పడకుండా చదివి​ పోస్ట్​ గ్రాడ్యుయేషన్​లో గోల్డ్ మెడల్ సాధించాడు. మంగళూరు విశ్వవిద్యాలయం నుంచి రాజకీయ శాస్త్రంలో అత్యధిక స్కోరు సంపాదించిన విద్యార్థిగా నిలిచాడు.

Visually Impaired student  got a gold medal
గోల్డ్​ మెడల్​ సాధించిన అన్విత్​ కుమార్

అన్విత్ ఆరో తరగతిలో ఉండగా.. తన రెండు కళ్లను పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత అతడి తల్లి చదువుకోవాలని ఎంతగానో ప్రోత్సహించింది. ఫలితంగా ప్రతి తరగతిలోనూ మెరుగైన మార్కులు సాధించాడు. పదో తరగతి వరకు బ్రెయిలీ లిపి​లో చదువుకున్న అన్విత్​.. తర్వాత సాధారణంగానే విద్యను అభ్యసించాడు. అతడికి తల్లితోపాటు సహచర విద్యార్థులు, అధ్యాపకులు అండగా నిలిచారు. సహాయకులతో పరీక్షలకు హాజరైన అన్విత్​.. పదో తరగతిలో 87శాతం, పీయూసీలో 88 శాతం, బీఏలో 89 శాతం, ఎంఏలో 82 శాతం మార్కులు పొందాడు. బీఏ, ఎంఏలో బంగారు పతకాలు సాధించిన అన్విత్.. ప్రొఫెసర్ కావడమే తన లక్ష్యం అంటున్నాడు.

"నేను బీఏలో ఈ ఘనత సాధించడానికి అధ్యాపకులు, మిత్రులు చాలా సహాయం చేశారు. ఎంఏలో కూడా అదే సహకారం అందించారు. నాకు మెటీరియల్​ అవసరమైనపుడు ప్రొఫెసర్లు ఇచ్చేవారు. పరీక్షల సమయంలో ఇది ఎంతో సహాయం చేసింది."

-అన్విత్​ కుమార్, గోల్డ్​ మెడలిస్ట్​

75 years old woman done phd
పీహెచ్​డీ పట్టాను అందుకుంటున్న ఉషా

75 Years Old Woman Done PHD: చదువుకు వయసు అడ్డు కాదని నిరూపించారు మంగళూరుకు చెందిన ఓ వృద్ధురాలు. ఉడుపికి చెందిన ఉషా చడగ 75 ఏళ్ల వయసులో మంగళూరు విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్​డీ పట్టా పొందారు. 'శ్రీ మధ్వాచార్యుల అద్వితీయమైన జీవస్వభావ వాదం, సర్వశబ్ద వాచ్యత్వానికి సంబంధించిన శ్రీ మధ్వాచార్యుల విశిష్ట సిద్ధాంతాల విమర్శనాత్మక విశ్లేషణ' అన్న అంశంపై ఆమె చేసిన పరిశోధనకు గాను డాక్టరేట్​ వరించింది.

75 years old woman done phd
పట్టాతో ఉషా

ఉషా చడగ అంతకుముందు త్రివేండ్రంలోని సంతాన పబ్లిక్​ స్కూల్​లో ప్రిన్సిపాల్​గా పనిచేశారు. పదవీ విరమణ అనంతరం సంస్కృత కళాశాలలో చేరారు. సంస్కృత విద్వత్​ నేర్చుకున్న ఆమె.. పీహెచ్​డీ చేయాలని నిర్ణయించుకుని ఐదేళ్లలో పూర్తి చేశారు. మంగళూరు విశ్వవిద్యాలయంలో శనివారం జరిగిన 40వ స్నాతకోత్సవంలో ఉషా పట్టాను అందుకున్నారు.

ఇదీ చదవండి: ఛాయ్​ కోసం ట్రైన్​నే ఆపేసిన డ్రైవర్​

కళ్లు కనిపించకపోయినా గోల్డ్ మెడల్​.. 75 ఏళ్ల వయసులో పీహెచ్​డీ

Visually Impaired Student Got A Gold Medal: చదువుకోవాలనే దృఢ సంకల్పం ఉంటే ఎలాంటి అవరోధాలు ఎదురైనా లక్ష్యాన్ని చేరుకోగలమని నిరూపించాడు ఓ అంధ విద్యార్థి. కర్ణాటక మంగళూరు కుంబాలకు చెందిన అన్విత్​ కుమార్​ దృష్టి లోపంతో బాధపడుతున్నాడు. అయినా నిరాశ పడకుండా చదివి​ పోస్ట్​ గ్రాడ్యుయేషన్​లో గోల్డ్ మెడల్ సాధించాడు. మంగళూరు విశ్వవిద్యాలయం నుంచి రాజకీయ శాస్త్రంలో అత్యధిక స్కోరు సంపాదించిన విద్యార్థిగా నిలిచాడు.

Visually Impaired student  got a gold medal
గోల్డ్​ మెడల్​ సాధించిన అన్విత్​ కుమార్

అన్విత్ ఆరో తరగతిలో ఉండగా.. తన రెండు కళ్లను పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత అతడి తల్లి చదువుకోవాలని ఎంతగానో ప్రోత్సహించింది. ఫలితంగా ప్రతి తరగతిలోనూ మెరుగైన మార్కులు సాధించాడు. పదో తరగతి వరకు బ్రెయిలీ లిపి​లో చదువుకున్న అన్విత్​.. తర్వాత సాధారణంగానే విద్యను అభ్యసించాడు. అతడికి తల్లితోపాటు సహచర విద్యార్థులు, అధ్యాపకులు అండగా నిలిచారు. సహాయకులతో పరీక్షలకు హాజరైన అన్విత్​.. పదో తరగతిలో 87శాతం, పీయూసీలో 88 శాతం, బీఏలో 89 శాతం, ఎంఏలో 82 శాతం మార్కులు పొందాడు. బీఏ, ఎంఏలో బంగారు పతకాలు సాధించిన అన్విత్.. ప్రొఫెసర్ కావడమే తన లక్ష్యం అంటున్నాడు.

"నేను బీఏలో ఈ ఘనత సాధించడానికి అధ్యాపకులు, మిత్రులు చాలా సహాయం చేశారు. ఎంఏలో కూడా అదే సహకారం అందించారు. నాకు మెటీరియల్​ అవసరమైనపుడు ప్రొఫెసర్లు ఇచ్చేవారు. పరీక్షల సమయంలో ఇది ఎంతో సహాయం చేసింది."

-అన్విత్​ కుమార్, గోల్డ్​ మెడలిస్ట్​

75 years old woman done phd
పీహెచ్​డీ పట్టాను అందుకుంటున్న ఉషా

75 Years Old Woman Done PHD: చదువుకు వయసు అడ్డు కాదని నిరూపించారు మంగళూరుకు చెందిన ఓ వృద్ధురాలు. ఉడుపికి చెందిన ఉషా చడగ 75 ఏళ్ల వయసులో మంగళూరు విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్​డీ పట్టా పొందారు. 'శ్రీ మధ్వాచార్యుల అద్వితీయమైన జీవస్వభావ వాదం, సర్వశబ్ద వాచ్యత్వానికి సంబంధించిన శ్రీ మధ్వాచార్యుల విశిష్ట సిద్ధాంతాల విమర్శనాత్మక విశ్లేషణ' అన్న అంశంపై ఆమె చేసిన పరిశోధనకు గాను డాక్టరేట్​ వరించింది.

75 years old woman done phd
పట్టాతో ఉషా

ఉషా చడగ అంతకుముందు త్రివేండ్రంలోని సంతాన పబ్లిక్​ స్కూల్​లో ప్రిన్సిపాల్​గా పనిచేశారు. పదవీ విరమణ అనంతరం సంస్కృత కళాశాలలో చేరారు. సంస్కృత విద్వత్​ నేర్చుకున్న ఆమె.. పీహెచ్​డీ చేయాలని నిర్ణయించుకుని ఐదేళ్లలో పూర్తి చేశారు. మంగళూరు విశ్వవిద్యాలయంలో శనివారం జరిగిన 40వ స్నాతకోత్సవంలో ఉషా పట్టాను అందుకున్నారు.

ఇదీ చదవండి: ఛాయ్​ కోసం ట్రైన్​నే ఆపేసిన డ్రైవర్​

Last Updated : May 6, 2022, 10:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.