ETV Bharat / bharat

స్వాతంత్ర్యం తర్వాత ఆ గ్రామంలో తొలిసారిగా.. - స్వాతంత్ర్యానంతరం తొలిసారి గ్రామానికి అధికారులు

స్వాంతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఆ గ్రామానికి ఏ ఒక్క ఉన్నతాధికారీ వెళ్లలేదు. దీంతో తమ ఆహ్వానం మేరకు వారి ఊరికి విచ్చేసిన కలెక్టర్​, ఎస్పీలకు ఘన స్వాగతం పలికారు ప్రజలు. ఈ సంఘటన రాజస్థాన్​ పాలీలోని సత్రుంగియా గ్రామంలో జరిగింది.

Administration Welcomed with flowers
పాలీలో అధికారులపై పూల వర్షం
author img

By

Published : May 29, 2021, 4:38 PM IST

సత్రుంగియాలో అధికారులకు ఘన స్వాగతం పలికిన గ్రామస్థులు

స్వాతంత్ర్యం తర్వాత తొలిసారి గ్రామంలోకి అడుగుపెట్టిన జిల్లా పరిపాలన ఉన్నతాధికారులకు గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. ఈ సంఘటన రాజస్థాన్​ పాలీ జిల్లాలో జరిగింది. రాయ్‌పుర్‌ సబ్‌డివిజన్‌ ప్రాంతంలోని పలు గ్రామాలను స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ ఏ ఉన్నతాధికారి సందర్శించ లేదు. ఇందులో సత్రుంగియా అనే గ్రామం కూడా ఉంది.

కరోనా మహమ్మారిపై అవగాహన కల్పించేందుకు డివిజన్ల వారీగా అధికారులను ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ క్రమంలోనే రాయ్​పుర్​ సబ్​ డివిజన్​లో పర్యటిస్తున్నారు కలెక్టర్​, ఎస్పీ. తమ గ్రామానికి ఓసారి రావాలని జిల్లా కలెక్టర్‌ అన్షదీప్‌, ఎస్పీ కల్‌రామ్‌ రావత్‌ను.. సంత్రుంగియా గ్రామస్థులు కోరారు. అందుకు అంగీకరించిన అధికారులు.. పెద్దఎత్తున సిబ్బందిని వెంటబెట్టుకొని గ్రామానికి వెళ్లారు. తొలిసారి.. తమ ప్రాంతానికి తరలివస్తున్న అధికారులను చూసిన గ్రామస్థులు.. వారికి గుర్తుండేలా విభిన్నంగా స్వాగతం పలికారు.

Administration Welcomed with flowers
కరోనాపై అహగాహన కల్పిస్తోన్న అధికారులు

పూల వర్షం..

ఒంటెలపై అధికారులను కూర్చోబెట్టిన గ్రామస్థులు.. వారిపై పూల వర్షం కురిపిస్తూ గ్రామంలోకి ఆహ్వానించారు. గ్రామంలోని వీధి వీధి తిప్పుతూ ఊరేగించారు. అనంతరం ప్రజలకు కరోనాపై అవగాహన కల్పించారు అధికారులు. వారి సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి హామీ ఇచ్చారు.

ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

ఇదీ చూడండి: సైన్యంలోకి పుల్వామా అమర జవాను భార్య

సత్రుంగియాలో అధికారులకు ఘన స్వాగతం పలికిన గ్రామస్థులు

స్వాతంత్ర్యం తర్వాత తొలిసారి గ్రామంలోకి అడుగుపెట్టిన జిల్లా పరిపాలన ఉన్నతాధికారులకు గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. ఈ సంఘటన రాజస్థాన్​ పాలీ జిల్లాలో జరిగింది. రాయ్‌పుర్‌ సబ్‌డివిజన్‌ ప్రాంతంలోని పలు గ్రామాలను స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ ఏ ఉన్నతాధికారి సందర్శించ లేదు. ఇందులో సత్రుంగియా అనే గ్రామం కూడా ఉంది.

కరోనా మహమ్మారిపై అవగాహన కల్పించేందుకు డివిజన్ల వారీగా అధికారులను ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ క్రమంలోనే రాయ్​పుర్​ సబ్​ డివిజన్​లో పర్యటిస్తున్నారు కలెక్టర్​, ఎస్పీ. తమ గ్రామానికి ఓసారి రావాలని జిల్లా కలెక్టర్‌ అన్షదీప్‌, ఎస్పీ కల్‌రామ్‌ రావత్‌ను.. సంత్రుంగియా గ్రామస్థులు కోరారు. అందుకు అంగీకరించిన అధికారులు.. పెద్దఎత్తున సిబ్బందిని వెంటబెట్టుకొని గ్రామానికి వెళ్లారు. తొలిసారి.. తమ ప్రాంతానికి తరలివస్తున్న అధికారులను చూసిన గ్రామస్థులు.. వారికి గుర్తుండేలా విభిన్నంగా స్వాగతం పలికారు.

Administration Welcomed with flowers
కరోనాపై అహగాహన కల్పిస్తోన్న అధికారులు

పూల వర్షం..

ఒంటెలపై అధికారులను కూర్చోబెట్టిన గ్రామస్థులు.. వారిపై పూల వర్షం కురిపిస్తూ గ్రామంలోకి ఆహ్వానించారు. గ్రామంలోని వీధి వీధి తిప్పుతూ ఊరేగించారు. అనంతరం ప్రజలకు కరోనాపై అవగాహన కల్పించారు అధికారులు. వారి సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి హామీ ఇచ్చారు.

ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

ఇదీ చూడండి: సైన్యంలోకి పుల్వామా అమర జవాను భార్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.