ETV Bharat / bharat

అభిమాన నాయకులే దేవుళ్లు- పెళ్లి కార్డు​లపై ఫొటోలు

author img

By

Published : Nov 27, 2021, 8:44 PM IST

ఎవరైనా వివాహ ఆహ్వాన పత్రికలపై శుభసూచకంగా దేవుళ్ల చిత్రాలను ముద్రిస్తారు. కానీ ఉత్తర్​ప్రదేశ్ మేరఠ్ జిల్లా వాసి మాత్రం భిన్నంగా ఆలోచించారు. తన అభిమాన నాయకుల ఫొటోలతో వెడ్డింగ్ కార్డ్స్​ను తయారు చేయించారు. పార్టీపై, నాయకులపై తనకు ఉన్న అభిమానాన్ని ఈ విధంగా చాటుకున్నారు.

picture of fourite political leaders on wedding card
రాజకీయ నాయకుల ఫొటోలతో ఉత్తర్​ప్రదేశ్​లో పెళ్లి పత్రికలు
అభిమాన రాజకీయ నాయకుల ఫొటోలతో మేరఠ్​లో పెళ్లి పత్రికలు తయారు చేయించిన శ్రవణ్​ కుమార్​

పెళ్లిలో పత్రికలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. అలాంటి వెడ్డింగ్​ కార్డ్స్​పై ఎవరైనా దేవుడి చిత్రాలను ముద్రిస్తారు. కానీ ఉత్తర్​ప్రదేశ్​లో మేరఠ్​ జిల్లాకు చెందిన శ్రవణ్​ కుమార్ భిన్నంగా ఆలోచించారు. తన కుమారుడి వివాహానికి ఆహ్వాన పత్రికలపై అభిమాన నాయకుల ఫొటోలను ముద్రించారు. వారిని దేవుడితో సమానంగా భావిస్తానని అంటున్నారు.

రాజ్​పుర గ్రామానికి చెందిన శ్రవణ్​ కుమార్ వృత్తి రీత్యా ఓ వ్యాపారి. కుమారుడి వివాహం సందర్భంగా.. సమాజ్​వాదీ పార్టీ, ఇష్టమైన నాయకులపై అభిమానాన్ని చాటాలనుకున్నారు. ఇందుకు పెళ్లి పత్రికలను తన అభిరుచికి తగ్గట్లుగా తయారు చేయించారు శ్రవణ్​. వెడ్డింగ్ కార్డ్స్​పై దేవుడి చిత్రాలు ముద్రించాల్సిన స్థానంలో మాజీ ప్రధాని చౌదరీ చరణ్​ సింగ్​, అఖిలేశ్​ యాదవ్​, మాజీ మంత్రి షాహిద్ మంజూర్​ ఫొటోలను ఉంచి తయారు చేయించారు. ఆహ్వాన పత్రికల రంగును సైతం సమాజ్​వాదీ పార్టీ జెండాను ప్రతిబింబించేలా ఎంపిక చేశారు. పార్టీ గుర్తు ప్రత్యేకంగా కనిపించేలా పత్రికను రూపొందించారు.

"చరణ్​ సింగ్ అంటే నాకు చాలా గౌరవం. ఆయన నిరాడంబరంగా జీవించారు. అఖిలేశ్​, షాహిద్ మంజూర్​​ అంటే నాకు చాలా అభిమానం. పేదలకు ఎంతో సహాయం చేస్తున్నారు. అందుకే ఈ ముగ్గురి ఫొటోలను వెడ్డింగ్ కార్డ్స్​పై ఉంచి తయారు చేయించాను."

- శ్రవణ్​ కుమార్​

దీనిపై స్పందించిన షాహీద్​ మంజూర్​​.. శ్రవణ్​కు ఎస్పీతో విడదీయరాని సంబంధం ఉందని అన్నారు. అఖిలేశ్​​ యాదవ్​కు ప్రజాదరణ పెరిగిందనడానికి ఇదో ఉదాహరణ అని చెప్పారు.

అయితే.. పెళ్లి పత్రికలను ఇలా తయారు చేయడంపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ ప్రచారం ఇలా కూడా చెయ్యొచ్చని అంటున్నారు.

ఇదీ చదవండి:పేదలకు ఉచితంగా ఖరీదైన పెళ్లి వస్త్రాలు.. ఎక్కడంటే?

అభిమాన రాజకీయ నాయకుల ఫొటోలతో మేరఠ్​లో పెళ్లి పత్రికలు తయారు చేయించిన శ్రవణ్​ కుమార్​

పెళ్లిలో పత్రికలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. అలాంటి వెడ్డింగ్​ కార్డ్స్​పై ఎవరైనా దేవుడి చిత్రాలను ముద్రిస్తారు. కానీ ఉత్తర్​ప్రదేశ్​లో మేరఠ్​ జిల్లాకు చెందిన శ్రవణ్​ కుమార్ భిన్నంగా ఆలోచించారు. తన కుమారుడి వివాహానికి ఆహ్వాన పత్రికలపై అభిమాన నాయకుల ఫొటోలను ముద్రించారు. వారిని దేవుడితో సమానంగా భావిస్తానని అంటున్నారు.

రాజ్​పుర గ్రామానికి చెందిన శ్రవణ్​ కుమార్ వృత్తి రీత్యా ఓ వ్యాపారి. కుమారుడి వివాహం సందర్భంగా.. సమాజ్​వాదీ పార్టీ, ఇష్టమైన నాయకులపై అభిమానాన్ని చాటాలనుకున్నారు. ఇందుకు పెళ్లి పత్రికలను తన అభిరుచికి తగ్గట్లుగా తయారు చేయించారు శ్రవణ్​. వెడ్డింగ్ కార్డ్స్​పై దేవుడి చిత్రాలు ముద్రించాల్సిన స్థానంలో మాజీ ప్రధాని చౌదరీ చరణ్​ సింగ్​, అఖిలేశ్​ యాదవ్​, మాజీ మంత్రి షాహిద్ మంజూర్​ ఫొటోలను ఉంచి తయారు చేయించారు. ఆహ్వాన పత్రికల రంగును సైతం సమాజ్​వాదీ పార్టీ జెండాను ప్రతిబింబించేలా ఎంపిక చేశారు. పార్టీ గుర్తు ప్రత్యేకంగా కనిపించేలా పత్రికను రూపొందించారు.

"చరణ్​ సింగ్ అంటే నాకు చాలా గౌరవం. ఆయన నిరాడంబరంగా జీవించారు. అఖిలేశ్​, షాహిద్ మంజూర్​​ అంటే నాకు చాలా అభిమానం. పేదలకు ఎంతో సహాయం చేస్తున్నారు. అందుకే ఈ ముగ్గురి ఫొటోలను వెడ్డింగ్ కార్డ్స్​పై ఉంచి తయారు చేయించాను."

- శ్రవణ్​ కుమార్​

దీనిపై స్పందించిన షాహీద్​ మంజూర్​​.. శ్రవణ్​కు ఎస్పీతో విడదీయరాని సంబంధం ఉందని అన్నారు. అఖిలేశ్​​ యాదవ్​కు ప్రజాదరణ పెరిగిందనడానికి ఇదో ఉదాహరణ అని చెప్పారు.

అయితే.. పెళ్లి పత్రికలను ఇలా తయారు చేయడంపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ ప్రచారం ఇలా కూడా చెయ్యొచ్చని అంటున్నారు.

ఇదీ చదవండి:పేదలకు ఉచితంగా ఖరీదైన పెళ్లి వస్త్రాలు.. ఎక్కడంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.