ETV Bharat / bharat

భాజపాకు ఉత్పల్​​ పారికర్​ గుడ్​ బై.. స్వతంత్రంగా బరిలోకి..

author img

By

Published : Jan 21, 2022, 7:35 PM IST

Utpal Parrikar quits BJP: భాజపాకు రాజీనామా చేశారు గోవా దివంగత ముఖ్యమంత్రి మనోహర్​ పారికర్​ కుమారుడు ఉత్పల్​ పారికర్​. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్రంగానే పోటీ చేస్తానని ప్రకటించారు. పనాజీ స్థానంలో బరిలో నిలుస్తున్నట్లు చెప్పారు.

Utpal Parrikar quits BJP
భాజపాకు ఉత్పల్​​ పారికర్​ గుడ్​ బై

Utpal Parrikar quits BJP: గోవా దివంగత ముఖ్యమంత్రి మనోహర్​ పారికర్​ కుమారుడు ఉత్పల్​ పారికర్.. భారతీయ జనతా పార్టీని వీడారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పనాజీ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలవనున్నట్లు ప్రకటించారు. భాజపా గురువారం విడుదల చేసిన తొలి జాబితాలో ఉత్పల్​ పారికర్​కు చోటు కల్పించలేదు. ఈ క్రమంలోనే పార్టీ మారతారనే ఊహాగానాలు మొదలయ్యాయి. వాటిని నిజం చేస్తూ.. తాజాగా ప్రకటన చేశారు ఉత్పల్​. మనోహర్​ పారికర్​ సుదీర్ఘ కాలం ప్రాతినిధ్యం వహించిన పనాజీ స్థానంలో సిట్టింగ్​ ఎమ్మెల్యే అటనాసియో మొన్సెరేట్​కే మళ్లీ అవకాశం ఇచ్చింది భాజపా.

" మరో అవకాశం లేకపోవటం వల్ల భాజపాను వీడుతున్నా. పార్టీకి రాజీనామా చేశాను. పనాజీ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తాను. రాజీనామా అనేది కేవలం ఫార్మాలిటీ మాత్రమే. భాజపా ఎప్పటికీ నా హృదయంలో ఉంటుంది. ఈ నిర్ణయం తీసుకోవటం చాలా క్లిష్టమైనదే అయినా.. గోవా ప్రజల కోసం చేయాల్సి వచ్చింది. నా రాజకీయ భవిష్యత్తుపై ఎవరూ బెంగపడొద్దు. గోవా ప్రజలు చూసుకుంటారు. "

- ఉత్పల్​ పారికర్​

తాను నమ్మే విలువల కోసం పోరాడుతున్నానని, పనాజీ ప్రజలకే నిర్ణయాధికారాన్ని వదిలేస్తున్నట్లు తెలిపారు ఉత్పల్​. పార్టీతో చర్చలు చేపట్టలేనన్నారు. ఇతర పార్టీల మద్దతు తీసుకుంటారా? అని విలేకరులు అడగగా.. తనకు భాజపా ఒక్కటే వేదిక అని సమాధానమిచ్చారు. ' భాజపాను కాదనుకుంటే.. ఎన్నికలకు స్వతంత్రంగానే వెళతాను. ఏ రాజకీయ పార్టీలోకి వెళ్లను. ' అని స్పష్టం చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి: పారికర్​ కుమారుడికి భాజపా షాక్​.. పార్టీ మారతారా?

Utpal Parrikar quits BJP: గోవా దివంగత ముఖ్యమంత్రి మనోహర్​ పారికర్​ కుమారుడు ఉత్పల్​ పారికర్.. భారతీయ జనతా పార్టీని వీడారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పనాజీ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలవనున్నట్లు ప్రకటించారు. భాజపా గురువారం విడుదల చేసిన తొలి జాబితాలో ఉత్పల్​ పారికర్​కు చోటు కల్పించలేదు. ఈ క్రమంలోనే పార్టీ మారతారనే ఊహాగానాలు మొదలయ్యాయి. వాటిని నిజం చేస్తూ.. తాజాగా ప్రకటన చేశారు ఉత్పల్​. మనోహర్​ పారికర్​ సుదీర్ఘ కాలం ప్రాతినిధ్యం వహించిన పనాజీ స్థానంలో సిట్టింగ్​ ఎమ్మెల్యే అటనాసియో మొన్సెరేట్​కే మళ్లీ అవకాశం ఇచ్చింది భాజపా.

" మరో అవకాశం లేకపోవటం వల్ల భాజపాను వీడుతున్నా. పార్టీకి రాజీనామా చేశాను. పనాజీ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తాను. రాజీనామా అనేది కేవలం ఫార్మాలిటీ మాత్రమే. భాజపా ఎప్పటికీ నా హృదయంలో ఉంటుంది. ఈ నిర్ణయం తీసుకోవటం చాలా క్లిష్టమైనదే అయినా.. గోవా ప్రజల కోసం చేయాల్సి వచ్చింది. నా రాజకీయ భవిష్యత్తుపై ఎవరూ బెంగపడొద్దు. గోవా ప్రజలు చూసుకుంటారు. "

- ఉత్పల్​ పారికర్​

తాను నమ్మే విలువల కోసం పోరాడుతున్నానని, పనాజీ ప్రజలకే నిర్ణయాధికారాన్ని వదిలేస్తున్నట్లు తెలిపారు ఉత్పల్​. పార్టీతో చర్చలు చేపట్టలేనన్నారు. ఇతర పార్టీల మద్దతు తీసుకుంటారా? అని విలేకరులు అడగగా.. తనకు భాజపా ఒక్కటే వేదిక అని సమాధానమిచ్చారు. ' భాజపాను కాదనుకుంటే.. ఎన్నికలకు స్వతంత్రంగానే వెళతాను. ఏ రాజకీయ పార్టీలోకి వెళ్లను. ' అని స్పష్టం చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి: పారికర్​ కుమారుడికి భాజపా షాక్​.. పార్టీ మారతారా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.