లోక్సభ కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ ఉత్పల్ కుమార్ సింగ్ నియమితులయ్యారు. ఈ మేరకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఉత్తర్వులు జారీ చేశారు. డిసెంబరు 1న కేబినెట్ సెక్రటరీ హోదాలో బాధ్యతలు చేపట్టనున్నారు ఉత్పల్.
1986లో ఉత్తరాఖండ్ క్యాడర్కు ఎంపికైన ఉత్పల్కు... కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో వివిధ హోదాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రెండున్నరేళ్లు పని చేసిన ఆయన... వివిధ రంగాల్లో సంస్కరణలు చేపట్టి, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి పాటుపడ్డారన్న పేరుంది.
కేంద్ర వ్యవసాయశాఖ అదనపు కార్యదర్శిగానూ విధులు నిర్వహించారు ఉత్పల్.
ఇదీ చూడండి: నూతన సాగు చట్టాలతో రైతులకు మేలే: మోదీ