ETV Bharat / bharat

Unique Children Library : పనికిరాని వస్తువులతో లైబ్రరీ.. మురికివాడ పిల్లలకు పుస్తకాలను పరిచయం చేసిన బాలిక

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 28, 2023, 7:33 PM IST

Updated : Oct 29, 2023, 11:17 AM IST

Unique Children Library Built With Waste Material : పుస్తకాల మీద ఇష్టంతో తొమ్మిదేళ్ల వయసులో తన తోటి పిల్లల కోసం గ్రంథాలయం ఏర్పాటు చేసింది ఓ బాలిక. తన ఇంటి ముందు తాళ్లు కట్టి పుస్తకాలను వేళాడదీసింది. క్రమంగా అందరి దృష్టిని ఆకర్షించి.. పలువురు విద్యార్థుల సహాయంతో చిన్నారుల లైబ్రరీ ఏర్పాటైంది. ప్రస్తుతం పనికిరాని వస్తువులతోనే ఆ లైబ్రరీ శాశ్వతంగా రెనోవేట్ చేశారు. మరి మధ్యప్రదేశ్​.. భోపాల్​లో ఉన్న ఆ పిల్లల గ్రంథాలయాన్ని మీరూ చూసేయండి.

Unique Children Library Built With Waste Material
Unique Children Library Built With Waste Material
పనికిరాని వస్తువులతో లైబ్రరీ.. మురికివాడ పిల్లలకు పుస్తకాలను పరిచయం చేసిన బాలిక

Unique Children Library Built With Waste Material : పుస్తకాలపై అభిమానం పెంచుకున్న ఓ బాలిక.. 9 ఏళ్ల వయసులోనే మురికివాడలో ఉండే చిన్నారులకు లైబ్రరీని పరిచయం చేసింది. గణేశ్​, దుర్గామాత నవరాత్రుల తర్వాత ఖాళీగా ఉండే ఓ వేదికనే లైబ్రరీగా మార్చేసింది. ఆ వేదికలో తాళ్లకు పుస్తకాలు వేళాడదీసి లైబ్రరీ ఏర్పాటు చేసింది మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్​కు చెందిన ముస్కాన్ అహిర్వార్ అనే బాలిక. మరికొంతమంది విద్యార్థుల అందించిన సహకారంతో.. పనికిరాని వస్తువులతోనే ఆ లైబ్రరీ సరికొత్తగా రూపుదిద్దుకుంది.

ప్రస్తుతం ఇంటర్ చదువుతున్న 16 ఏళ్ల ముస్కాన్​కు పుస్తకాలంటే ఎంతో ఇష్టం. పుస్తకాల ద్వారా తాను పొందిన అనుభూతిని తన వీధిలో ఉండే పిల్లలకు కూడా అందించాలని కోరుకుంది. అలా పుస్తకాలను తన ఇంటి తాళ్లకు వేలాడదీసేది. ఆసక్తి ఉన్న పిల్లలు వచ్చి పుస్తకాలను చదివేవారు. క్రమంగా ముస్కాన్ ఇంటికి వచ్చే పిల్లల సంఖ్య పెరిగింది. అయితే అప్పుడే ముస్కాన్​కు ఓ ఆలోచన వచ్చింది. గణేశ్​ చతుర్థి, నవరాత్రుల సందర్భంగా విగ్రహాలు పెట్టే స్థలాన్నే.. లైబ్రరీగా మార్చాలనుకుంది. అలా 2016లో 9 ఏళ్ల వయసున్నప్పుడు ముస్కాన్​ ఆ వేదికలో తాళ్లు కట్టి చిన్న లైబ్రరీని ఏర్పాటు చేసింది.

Unique Children Library Built With Waste Material
పనికిరాని వస్తువులతో తయారుచేసిన లైబ్రరీ

"నాపేరు ముస్కాన్ అహిర్వార్. నేను దుర్గానగర్ బస్తీలో ఉంటాను. ఇది నా చిన్న లైబ్రరీ. దీన్ని 2016 జనవరి 26న ప్రారంభించాను. అప్పుడు నాకు 9 ఏళ్లు. ఇప్పుడు ఈ లైబ్రరీని రెనోవేట్ చేశారు. మొదటి ఈ లైబ్రరీని మా ఇంటి వద్ద ఏర్పాటు చేశాను. ఎక్కువ మంది పిల్లలు రావడం, మా ఇంటి వద్ద స్థలం తక్కువగా ఉండటం వల్ల ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో గణేశ్​, దుర్గామాత వేదికలో ఏర్పాటు చేశాము."
--ముస్కాన్ అహిర్వార్, విద్యార్థిని

ముస్కాన్​ చేసిన ప్రయత్నం పాఠశాల విద్యాశాఖ అధికారుల దృష్టికి వెళ్లింది. దీనిపై స్పందించిన అధికారులు ఈ లైబ్రరీకి పుస్తకాలను కానుకగా అందించారు. అలా ఈ చిన్నారుల గ్రంథాలయం... ఆర్కిటెక్చర్ విద్యార్థుల కంట్లో పడింది. అనంతరం వారు 'నేషనల్ అసోషియేషన్ ఆఫ్​ స్టుడెంట్స్​ ఆఫ్​ ఆర్కిటెక్చర్' నిర్వహించిన పోటీలో భాగంగా.. ఈ లైబ్రరీని రెనోవేట్​ చేసేందుకు ముందుకొచ్చారు. 60 మంది ఆర్కిటెక్చర్ విద్యార్థుల బృందం.. విరిగిపోయిన చెక్క గేట్లు, నూనె టిన్​లు, ప్లాస్టిక్ షీట్​లు వంట పనికిరాని వస్తువులతో నెల రోజులు శ్రమించి ఈ లైబ్రరీకి కొత్తంరూపం ఇచ్చారు. వెదురు బొంగులు, టెర్రాకోటతో టైల్స్​తో​​ పైకప్పు నిర్మించారు. లైబ్రరీకి 'కితాబీ మస్తీ' అని పేరు పెట్టారు.

Unique Children Library Built With Waste Material
పిల్లలకు పాఠాలు చెబుతున్న ముస్కాన్​ అహిర్వార్

"పిల్లలమంతా కలిసి ఈ లైబ్రరీకి కితాబీ మస్తీ అని పేరు పెట్టాము. నేషనల్ అసోషియేషన్ ఆఫ్​ స్టుడెంట్స్​ ఆఫ్​ ఆర్కిటెక్చర్ విద్యార్థులు ప్రాజెక్టులో భాగంగా ఈ లైబ్రరీని నిర్మించారు. పనికిరాని వస్తువలతో దీన్ని రూపొందించారు. పుస్తకాలు పెట్టుకునే ర్యాక్​లను టిన్​ డబ్బాలతో ఏర్పాటు చేశారు. టెర్రాకోట టైల్స్​తో పైకప్పు, గోడలను పాత చెక్క గేట్లతో నిర్మించారు."
--పంకజ్ ఠాకూర్, లైబ్రరీ వాలంటీర్

ప్రస్తుతం మూడు వేల పుస్తకాలతో ఉన్న ఈ చిన్నారుల గ్రంథాలయానికి ప్రతిరోజు దాదాపు 30 మంది పిల్లలు వస్తారని ముస్కాన్​ చెబుతోంది. తనతో పాటు పంకజ్​ ఠాకూర్ అనే వాలంటీర్​ కూడా రోజు పిల్లలకు హోం వర్క్​ చేయించడంలో సహాయం చేస్తాడని తెలిపింది. పాఠ్య పుస్తకాల వల్ల పిల్లలు అలసిపోతారని.. అందుకే హోం వర్క్​ చేశాక చదువుకోడానికి పుస్తకాలు ఇస్తామని చెబుతోంది ముస్కాన్. చిన్న వయసులోనే వినూత్నంగా ఆలోచించి పది మందికి సహాయపడే పనులు చేస్తున్న ముస్కాన్​ అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.

Unique Children Library Built With Waste Material
చిన్నారుల లైబ్రరీ

స్కూల్​ బ్యాగ్​లో కుర్చీ.. లాక్కెళ్లేందుకు చక్రాలు కూడా.. విద్యార్థిని వినూత్న ఆవిష్కరణ

innovative thought: తోపుడు బండికి సరికొత్త 'కీర్తి'!

పనికిరాని వస్తువులతో లైబ్రరీ.. మురికివాడ పిల్లలకు పుస్తకాలను పరిచయం చేసిన బాలిక

Unique Children Library Built With Waste Material : పుస్తకాలపై అభిమానం పెంచుకున్న ఓ బాలిక.. 9 ఏళ్ల వయసులోనే మురికివాడలో ఉండే చిన్నారులకు లైబ్రరీని పరిచయం చేసింది. గణేశ్​, దుర్గామాత నవరాత్రుల తర్వాత ఖాళీగా ఉండే ఓ వేదికనే లైబ్రరీగా మార్చేసింది. ఆ వేదికలో తాళ్లకు పుస్తకాలు వేళాడదీసి లైబ్రరీ ఏర్పాటు చేసింది మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్​కు చెందిన ముస్కాన్ అహిర్వార్ అనే బాలిక. మరికొంతమంది విద్యార్థుల అందించిన సహకారంతో.. పనికిరాని వస్తువులతోనే ఆ లైబ్రరీ సరికొత్తగా రూపుదిద్దుకుంది.

ప్రస్తుతం ఇంటర్ చదువుతున్న 16 ఏళ్ల ముస్కాన్​కు పుస్తకాలంటే ఎంతో ఇష్టం. పుస్తకాల ద్వారా తాను పొందిన అనుభూతిని తన వీధిలో ఉండే పిల్లలకు కూడా అందించాలని కోరుకుంది. అలా పుస్తకాలను తన ఇంటి తాళ్లకు వేలాడదీసేది. ఆసక్తి ఉన్న పిల్లలు వచ్చి పుస్తకాలను చదివేవారు. క్రమంగా ముస్కాన్ ఇంటికి వచ్చే పిల్లల సంఖ్య పెరిగింది. అయితే అప్పుడే ముస్కాన్​కు ఓ ఆలోచన వచ్చింది. గణేశ్​ చతుర్థి, నవరాత్రుల సందర్భంగా విగ్రహాలు పెట్టే స్థలాన్నే.. లైబ్రరీగా మార్చాలనుకుంది. అలా 2016లో 9 ఏళ్ల వయసున్నప్పుడు ముస్కాన్​ ఆ వేదికలో తాళ్లు కట్టి చిన్న లైబ్రరీని ఏర్పాటు చేసింది.

Unique Children Library Built With Waste Material
పనికిరాని వస్తువులతో తయారుచేసిన లైబ్రరీ

"నాపేరు ముస్కాన్ అహిర్వార్. నేను దుర్గానగర్ బస్తీలో ఉంటాను. ఇది నా చిన్న లైబ్రరీ. దీన్ని 2016 జనవరి 26న ప్రారంభించాను. అప్పుడు నాకు 9 ఏళ్లు. ఇప్పుడు ఈ లైబ్రరీని రెనోవేట్ చేశారు. మొదటి ఈ లైబ్రరీని మా ఇంటి వద్ద ఏర్పాటు చేశాను. ఎక్కువ మంది పిల్లలు రావడం, మా ఇంటి వద్ద స్థలం తక్కువగా ఉండటం వల్ల ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో గణేశ్​, దుర్గామాత వేదికలో ఏర్పాటు చేశాము."
--ముస్కాన్ అహిర్వార్, విద్యార్థిని

ముస్కాన్​ చేసిన ప్రయత్నం పాఠశాల విద్యాశాఖ అధికారుల దృష్టికి వెళ్లింది. దీనిపై స్పందించిన అధికారులు ఈ లైబ్రరీకి పుస్తకాలను కానుకగా అందించారు. అలా ఈ చిన్నారుల గ్రంథాలయం... ఆర్కిటెక్చర్ విద్యార్థుల కంట్లో పడింది. అనంతరం వారు 'నేషనల్ అసోషియేషన్ ఆఫ్​ స్టుడెంట్స్​ ఆఫ్​ ఆర్కిటెక్చర్' నిర్వహించిన పోటీలో భాగంగా.. ఈ లైబ్రరీని రెనోవేట్​ చేసేందుకు ముందుకొచ్చారు. 60 మంది ఆర్కిటెక్చర్ విద్యార్థుల బృందం.. విరిగిపోయిన చెక్క గేట్లు, నూనె టిన్​లు, ప్లాస్టిక్ షీట్​లు వంట పనికిరాని వస్తువులతో నెల రోజులు శ్రమించి ఈ లైబ్రరీకి కొత్తంరూపం ఇచ్చారు. వెదురు బొంగులు, టెర్రాకోటతో టైల్స్​తో​​ పైకప్పు నిర్మించారు. లైబ్రరీకి 'కితాబీ మస్తీ' అని పేరు పెట్టారు.

Unique Children Library Built With Waste Material
పిల్లలకు పాఠాలు చెబుతున్న ముస్కాన్​ అహిర్వార్

"పిల్లలమంతా కలిసి ఈ లైబ్రరీకి కితాబీ మస్తీ అని పేరు పెట్టాము. నేషనల్ అసోషియేషన్ ఆఫ్​ స్టుడెంట్స్​ ఆఫ్​ ఆర్కిటెక్చర్ విద్యార్థులు ప్రాజెక్టులో భాగంగా ఈ లైబ్రరీని నిర్మించారు. పనికిరాని వస్తువలతో దీన్ని రూపొందించారు. పుస్తకాలు పెట్టుకునే ర్యాక్​లను టిన్​ డబ్బాలతో ఏర్పాటు చేశారు. టెర్రాకోట టైల్స్​తో పైకప్పు, గోడలను పాత చెక్క గేట్లతో నిర్మించారు."
--పంకజ్ ఠాకూర్, లైబ్రరీ వాలంటీర్

ప్రస్తుతం మూడు వేల పుస్తకాలతో ఉన్న ఈ చిన్నారుల గ్రంథాలయానికి ప్రతిరోజు దాదాపు 30 మంది పిల్లలు వస్తారని ముస్కాన్​ చెబుతోంది. తనతో పాటు పంకజ్​ ఠాకూర్ అనే వాలంటీర్​ కూడా రోజు పిల్లలకు హోం వర్క్​ చేయించడంలో సహాయం చేస్తాడని తెలిపింది. పాఠ్య పుస్తకాల వల్ల పిల్లలు అలసిపోతారని.. అందుకే హోం వర్క్​ చేశాక చదువుకోడానికి పుస్తకాలు ఇస్తామని చెబుతోంది ముస్కాన్. చిన్న వయసులోనే వినూత్నంగా ఆలోచించి పది మందికి సహాయపడే పనులు చేస్తున్న ముస్కాన్​ అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.

Unique Children Library Built With Waste Material
చిన్నారుల లైబ్రరీ

స్కూల్​ బ్యాగ్​లో కుర్చీ.. లాక్కెళ్లేందుకు చక్రాలు కూడా.. విద్యార్థిని వినూత్న ఆవిష్కరణ

innovative thought: తోపుడు బండికి సరికొత్త 'కీర్తి'!

Last Updated : Oct 29, 2023, 11:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.