ETV Bharat / bharat

కశ్మీర్​లో గ్రెనేడ్​ దాడి- పోలీసులకు గాయాలు

జమ్ముకశ్మీర్​ బారాముల్లా జిల్లాలో భద్రతాబలగాలే లక్ష్యంగా ఉగ్రవాదులు గ్రెనేడ్ దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి.

author img

By

Published : Mar 13, 2021, 5:46 PM IST

Two cops injured in grenade attack by militants in J-K's Baramulla
భద్రతా దళాలే లక్ష్యంగా గ్రెనేడ్​ దాడి... పోలీసులకు గాయాలు

జమ్ముకశ్మీర్​ బారాముల్లా జిల్లాలో ఉగ్రవాదలు జరిపిన గ్రెనేడ్​ దాడిలో ఇద్దరు పోలీసులకు గాయాలైనట్లు అధికారులు తెలిపారు. సోపోర్ బస్ స్టాండ్ దగ్గర ఉండే పోలీస్​ చెక్​ పోస్టుపై అల్ట్రాస్ గ్రెనేడ్ విసిరినట్లు పేర్కొన్నారు.

ఈ పేలుడులో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆర్మీ ఆసుపత్రికి తరలించారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. కానిస్టేబుల్ ఆజాద్ అహ్మద్, స్పెషల్ పోలీస్ ఆఫీసర్ (ఎస్పీఓ) మహ్మద్ అఫ్జల్​ ఈ దాడిలో గాయపడినట్లు చెప్పారు.

జమ్ముకశ్మీర్​ బారాముల్లా జిల్లాలో ఉగ్రవాదలు జరిపిన గ్రెనేడ్​ దాడిలో ఇద్దరు పోలీసులకు గాయాలైనట్లు అధికారులు తెలిపారు. సోపోర్ బస్ స్టాండ్ దగ్గర ఉండే పోలీస్​ చెక్​ పోస్టుపై అల్ట్రాస్ గ్రెనేడ్ విసిరినట్లు పేర్కొన్నారు.

ఈ పేలుడులో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆర్మీ ఆసుపత్రికి తరలించారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. కానిస్టేబుల్ ఆజాద్ అహ్మద్, స్పెషల్ పోలీస్ ఆఫీసర్ (ఎస్పీఓ) మహ్మద్ అఫ్జల్​ ఈ దాడిలో గాయపడినట్లు చెప్పారు.

ఇదీ చూడండి: మంచు దారిలో.. గర్భిణీకి సైనికుల సాయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.