ఏటీఎం యంత్రానికి చిప్ అమర్చి హ్యాక్ చేయబోయిన నిందితుల్ని స్థానికులు అడ్డుకున్నారు. కర్ణాటకలోని మంగుళూరులో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
మంగళూరులోని మంగళదేవి ప్రాంతంలో ఉన్న ఏటీఎంని హ్యక్ చేయడానికి ముగ్గురు వ్యక్తుల వెళ్లారు. ఏటీఎంకు ఏదో చిప్ను అమర్చుతుండగా అక్కడున్న స్థానికులు వారిని అడ్డుకున్నారు. దాంతో నిందితులు పారిపోవడానికి ప్రయత్నించారు. స్థానికులు వారిని వెంబడించి..ఇద్దరిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మరో వ్యక్తి తప్పించుకున్నాడు.
అయితే ఐదు లేదా ఆరుగురు సభ్యుల ముఠా ఏటీఎం హ్యాకింగ్కు యత్నించారని పోలీసులు తెలిపారు. దాదాపు 40 ఏటీఎం హ్యాకింగ్ కేసుల్లో వారు నిందితులుగా ఉన్నట్లు వెల్లడించారు.
ఏటీఎం దొంగతనానికి సంబంధించి జనవరి నుంచి ఇప్పటి వరకు మంగళూరు పోలీసు స్టేషన్లో చాలా కేసులు నమోదయ్యాయి. హ్యాకింగ్ ద్వారా తమ ఖాతాలో డబ్బు చోరీకి గురైందని చాలా మంది ఫిర్యాదు చేశారు.
ఇదీ చూడండి: కాలిన గాయాలతో.. రోడ్డు పక్కన నగ్నంగా..