ETV Bharat / bharat

టీకాపై అసత్య ప్రచారానికి ట్విట్టర్​ బ్రేకులు! - కరోనా వాక్సిన్​ పై తప్పుదోవ పట్టించే ఖాతాలను తొలిగించనున్న ట్విట్టర్​

కరోనా వ్యాక్సిన్​ గురించి తప్పుడు సమాచారం ఉన్న పోస్టులను గుర్తిస్తున్నట్లు ట్విట్టర్​ తెలిపింది. సదరు ఖాతాలకు హెచ్చరికలు పంపిస్తున్నట్లు పేర్కొంది. ఐదు లేదా అంతకన్నా ఎక్కువ హెచ్చరికల తర్వాత కూడా ఖాతాదారుడు నిబంధనలను ఉల్లంఘిస్తే ఖాతాను పూర్తిగా తొలగిస్తామని స్పష్టం చేసింది.

Twitter cracks down on COVID vaccine misinformation
వాక్సిన్​పై అసత్య ప్రచారం చేసే ఖాతాలకు ట్విట్టర్​ షాక్​
author img

By

Published : Mar 2, 2021, 12:56 PM IST

కొవిడ్​-19 వ్యాక్సిన్​పై తప్పుదోవ పట్టించే ట్వీట్లను గుర్తిస్తున్నామని ట్విట్టర్​ సంస్థ తెలిపింది. హెచ్చరించిన తర్వాత కూడా వినియోగదారుడు ట్విట్టర్​ నిబంధనలను ఉల్లంఘిస్తే ఆ ఖాతాను తొలగించనున్నట్లు పేర్కొంది. సదరు ట్వీట్లలో వ్యాక్సిన్​ గురించి తప్పుడు సమాచారం ఉందా? లేదా? సమీక్షించడానికి మనుషులనే ఉపయోగిస్తున్నట్లు స్పష్టం చేసింది.

"ట్విట్టర్​ నిబంధనలను ఉల్లంఘించేవారికి ముందు హెచ్చరికలు పంపిస్తాము. సదరు ట్వీట్లు ఏ విధంగా నియమాలను ఉల్లంఘిస్తున్నాయో వివరిస్తాము. సమాజానికి ఆ ట్వీట్లు ఏ విధంగా హాని కలిగిస్తాయో స్పష్టంగా చెబుతాము. ఈ విధమైన అవగాహన వల్ల ఖాతాదారురు జాగ్రత్తలు పాటించగలరు. ఒక హెచ్చరికకు ఎలాంటి చర్యలు ఉండవు. కానీ రెండుసార్లు హెచ్చరికలు వస్తే 12 గంటలపాటు సదరు ఖాతాను నిలిపివేస్తాము. ఐదు లేదా అంతకన్నా ఎక్కువ అయితే ఖాతాను పూర్తిగా తొలగిస్తాము." అని ట్విట్టర్​ తన బ్లాగ్​లో పోస్ట్​ చేసింది.

కరోనా గురించి తప్పుడు సమాచారం పోస్ట్​ చేసిన కొన్ని ఖాతాలను గత డిసెంబర్​లోనే ట్విట్టర్​ తొలగించింది.

కొవిడ్​-19 వ్యాక్సిన్​పై తప్పుదోవ పట్టించే ట్వీట్లను గుర్తిస్తున్నామని ట్విట్టర్​ సంస్థ తెలిపింది. హెచ్చరించిన తర్వాత కూడా వినియోగదారుడు ట్విట్టర్​ నిబంధనలను ఉల్లంఘిస్తే ఆ ఖాతాను తొలగించనున్నట్లు పేర్కొంది. సదరు ట్వీట్లలో వ్యాక్సిన్​ గురించి తప్పుడు సమాచారం ఉందా? లేదా? సమీక్షించడానికి మనుషులనే ఉపయోగిస్తున్నట్లు స్పష్టం చేసింది.

"ట్విట్టర్​ నిబంధనలను ఉల్లంఘించేవారికి ముందు హెచ్చరికలు పంపిస్తాము. సదరు ట్వీట్లు ఏ విధంగా నియమాలను ఉల్లంఘిస్తున్నాయో వివరిస్తాము. సమాజానికి ఆ ట్వీట్లు ఏ విధంగా హాని కలిగిస్తాయో స్పష్టంగా చెబుతాము. ఈ విధమైన అవగాహన వల్ల ఖాతాదారురు జాగ్రత్తలు పాటించగలరు. ఒక హెచ్చరికకు ఎలాంటి చర్యలు ఉండవు. కానీ రెండుసార్లు హెచ్చరికలు వస్తే 12 గంటలపాటు సదరు ఖాతాను నిలిపివేస్తాము. ఐదు లేదా అంతకన్నా ఎక్కువ అయితే ఖాతాను పూర్తిగా తొలగిస్తాము." అని ట్విట్టర్​ తన బ్లాగ్​లో పోస్ట్​ చేసింది.

కరోనా గురించి తప్పుడు సమాచారం పోస్ట్​ చేసిన కొన్ని ఖాతాలను గత డిసెంబర్​లోనే ట్విట్టర్​ తొలగించింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.