ETV Bharat / bharat

రైతు సంఘాల నేతలపై తోమర్​ ఫైర్​!

author img

By

Published : Jan 22, 2021, 3:12 PM IST

Updated : Jan 22, 2021, 3:35 PM IST

11వ దఫా చర్చల్లో భాగంగా.. రైతులపై కేంద్ర వ్యవసాయ మంత్రి తోమర్​ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించే విషయం ముందుగా తమకు చెప్పకుండా.. మీడియాకు చెప్పడమేంటని ప్రశ్నించినట్టు సమాచారం.

Tomar expresses dissatisfaction against Farmer unions leaders
రైతు సంఘాల నేతలపై తోమర్​ ఫైర్​!

రైతు సంఘాల నేతలపై కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్​ తోమర్​ తీవ్రస్థాయిలో మండిపడినట్టు తెలుస్తోంది. ప్రభుత్వ ప్రతిపాదన తిరస్కరిస్తూ రైతులు పత్రికా ప్రకటన విడుదల చేయడంపై మంత్రి అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం.

దిల్లీ విజ్ఞాన్​ భవన్​ వేదికగా రైతులు, కేంద్ర మంత్రులు 11వసారి భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో.. తమ ప్రతిపాదనను తిరస్కరిస్తే.. ఆ విషయం సమావేశానికి వచ్చి చెప్పాలి కానీ ముందుగా మీడియాకు చెప్పడమేంటని తోమర్​ రైతులను ప్రశ్నించినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇది ప్రజలను తప్పుదారి పట్టించడమేనని తోమర్​ మండిపడినట్టు పేర్కొన్నాయి.

దిల్లీ సరిహద్దుల్లో రైతుల నిరసనకు కారణమైన వివాదాస్పద సాగు చట్టాలను 1.5ఏళ్లు పాటు నిలిపివేస్తామని.. 10వ దఫా చర్చల్లో కేంద్రం ప్రతిపాదించింది. దీనిపై ఆలోచించి చెబుతామని చెప్పి రైతులు భేటీని ముగించారు. అయితే ఈ ప్రదిపాదనను రైతులు తిరస్కరించారంటూ గురువారం మీడియాలో వార్తలొచ్చాయి.

మరో వైపు.. ప్రభుత్వం, రైతుల మధ్య జరుగుతున్న చర్చల సంభాషణలు బయటకు ఎలా వెళుతున్నాయని తోమర్​ ప్రశ్నించారు. దీని వెనకున్న ఆంతర్యం ఏంటని అడిగినట్టు తెలుస్తోంది.

ఇదీ చూడండి:- 'రైతుల పట్ల కేంద్రానికి ఇంత అహంకారమా?'

రైతు సంఘాల నేతలపై కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్​ తోమర్​ తీవ్రస్థాయిలో మండిపడినట్టు తెలుస్తోంది. ప్రభుత్వ ప్రతిపాదన తిరస్కరిస్తూ రైతులు పత్రికా ప్రకటన విడుదల చేయడంపై మంత్రి అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం.

దిల్లీ విజ్ఞాన్​ భవన్​ వేదికగా రైతులు, కేంద్ర మంత్రులు 11వసారి భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో.. తమ ప్రతిపాదనను తిరస్కరిస్తే.. ఆ విషయం సమావేశానికి వచ్చి చెప్పాలి కానీ ముందుగా మీడియాకు చెప్పడమేంటని తోమర్​ రైతులను ప్రశ్నించినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇది ప్రజలను తప్పుదారి పట్టించడమేనని తోమర్​ మండిపడినట్టు పేర్కొన్నాయి.

దిల్లీ సరిహద్దుల్లో రైతుల నిరసనకు కారణమైన వివాదాస్పద సాగు చట్టాలను 1.5ఏళ్లు పాటు నిలిపివేస్తామని.. 10వ దఫా చర్చల్లో కేంద్రం ప్రతిపాదించింది. దీనిపై ఆలోచించి చెబుతామని చెప్పి రైతులు భేటీని ముగించారు. అయితే ఈ ప్రదిపాదనను రైతులు తిరస్కరించారంటూ గురువారం మీడియాలో వార్తలొచ్చాయి.

మరో వైపు.. ప్రభుత్వం, రైతుల మధ్య జరుగుతున్న చర్చల సంభాషణలు బయటకు ఎలా వెళుతున్నాయని తోమర్​ ప్రశ్నించారు. దీని వెనకున్న ఆంతర్యం ఏంటని అడిగినట్టు తెలుస్తోంది.

ఇదీ చూడండి:- 'రైతుల పట్ల కేంద్రానికి ఇంత అహంకారమా?'

Last Updated : Jan 22, 2021, 3:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.