ETV Bharat / bharat

గవర్నర్​ను అంకుల్​ అంటూ ఎంపీ కామెంట్​!

author img

By

Published : Jun 6, 2021, 10:24 PM IST

బంగాల్ గవర్నర్ జగదీప్ ధన్‌ఖర్‌- తృణమూల్​ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రాజ్​భవన్ మొత్తం ఆయన పరిచయస్తులతో నింపేశారని టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రీ మండిపడ్డారు. ఈ మేరకు గవర్నర్​ను 'మామ-జీ' అని సంబోధిస్తూ ట్వీట్ చేశారు.

TMC MP calls Bengal guv 'uncle-ji', says his kin appointed as officer on special duty
బంగాల్ గవర్నర్ జగదీప్ ధన్‌ఖర్‌

బంగాల్ గవర్నర్ జగదీప్ ధన్‌ఖర్‌ను టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రి అంకుల్​ అంటూ సంబోధించారు. తన కుటుంబ సభ్యులు, ఇతర పరిచయస్తులను రాజ్ భవన్‌లో ప్రత్యేక విధుల్లో (ఓఎస్‌డీ) అధికారులుగా నియమించారని ఆరోపించారు. ఈ మేరకు పలు పేర్లతో కూడిన జాబితాను ఆమె ట్విట్టర్​లో పంచుకున్నారు.

అబ్బుదోయ్ సింగ్ సేఖావత్ (ఓఎస్​డీ-గవర్నర్), అఖిల్ చౌదరి(కో-ఆర్డినేషన్), రుచి దుబే(పరిపాలన), ప్రశాంత్ దీక్షిత్(ప్రోటోకాల్), కౌస్తవ్ ఎస్ వాలికర్(ఐటీ), కిషన్ ధంకర్ వంటి అధికారులు రాజ్​భవన్​లో ఓఎస్​డీలుగా నియమితులయ్యారని.. వీరిలో షెఖావత్ జగ్​దీప్ ధన్​ఖర్ బావ కుమారుడని, రుచి దూబే, ప్రశాంత్ దీక్షిత్ అతని మాజీ సహాయకుడు మేజర్ గోరాంగ్ దీక్షిత్ భార్య సోదరుడని మహువా మొయిత్రీ తెలిపారు. వాలికర్ జనార్ధన్ రావుకు బావ అని.. కిషన్ ధన్​కర్ గవర్నర్​కు దగ్గరి బంధువు అని మొయిత్రా ఆరోపించారు.

  • Uncleji only way WB’s “grim situation” will improve is if you move your sorry self back to Delhi & find another job.

    Some suggestions:

    1. Advisor to Ajay Bisht YogiCM on how best to Thok Do opposition
    2. Advisor to Home Min on how best to hide during a pandemic https://t.co/oWLW0Ciupg

    — Mahua Moitra (@MahuaMoitra) June 6, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

గవర్నర్​ను ప్రశ్నించేందుకు ప్రజాస్వామ్యంలో అందరికీ హక్కు ఉందని మొయిత్రీ తెలిపారు.

"గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రశ్నలు సంధిస్తూనే ఉన్నారు. అయితే.. తమను తాము అద్దంలో చూసుకోమని వారిని కోరుతున్నాను. ఆయన తన గ్రామం మొత్తాన్ని రాజ్ భవన్​లోకి తీసుకువచ్చారు."

-మహువా మొయిత్రీ, టీఎంసీ ఎంపీ

గవర్నర్​ వరుస ట్వీట్లు..

బంగాల్‌లో ఎన్నికల అనంతరం చెలరేగిన హింసతో శాంతిభద్రతలు ఆందోళనకరంగా మారాయాని రాష్ట్ర గవర్నర్‌ జగదీప్‌ ధన్‌కర్‌ పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన వరుస ట్వీట్లు చేశారు. రాష్ట్రంలో ప్రతీకార దాడుల గురించి ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుందో తనకు వివరించేందుకు రావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హెచ్​కే ద్వివేదిని ఆదేశించినట్లు గవర్నర్‌ పేర్కొన్నారు. విపక్షాలపై దాడుల అంశంలో అధికారపక్షం పోలీసులతో రాజీపడిందని ఆరోపించారు.

తృణమూల్‌కు వ్యతిరేకంగా ఓటేసిన వారే లక్ష్యంగా ఈ దాడులు జరుగుతున్నాయన్న గవర్నర్‌.. ఫలితంగా లక్షలాది మంది తరలిపోతున్నట్లు చెప్పారు. హత్యలు, అత్యాచారాలు, సామాజిక బహిష్కరణలు సైతం రాష్ట్రంలో జరుగుతున్నట్లు జగదీప్‌ ధన్‌కర్‌ ఆరోపించారు.

ఇవీ చదవండి: 'భాజపా కార్యకర్తలైనందుకే చెట్లకు కట్టేసి కొట్టారు'

దీదీ మేనల్లుడికి పార్టీలో​ కీలక బాధ్యతలు!

బంగాల్ గవర్నర్ జగదీప్ ధన్‌ఖర్‌ను టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రి అంకుల్​ అంటూ సంబోధించారు. తన కుటుంబ సభ్యులు, ఇతర పరిచయస్తులను రాజ్ భవన్‌లో ప్రత్యేక విధుల్లో (ఓఎస్‌డీ) అధికారులుగా నియమించారని ఆరోపించారు. ఈ మేరకు పలు పేర్లతో కూడిన జాబితాను ఆమె ట్విట్టర్​లో పంచుకున్నారు.

అబ్బుదోయ్ సింగ్ సేఖావత్ (ఓఎస్​డీ-గవర్నర్), అఖిల్ చౌదరి(కో-ఆర్డినేషన్), రుచి దుబే(పరిపాలన), ప్రశాంత్ దీక్షిత్(ప్రోటోకాల్), కౌస్తవ్ ఎస్ వాలికర్(ఐటీ), కిషన్ ధంకర్ వంటి అధికారులు రాజ్​భవన్​లో ఓఎస్​డీలుగా నియమితులయ్యారని.. వీరిలో షెఖావత్ జగ్​దీప్ ధన్​ఖర్ బావ కుమారుడని, రుచి దూబే, ప్రశాంత్ దీక్షిత్ అతని మాజీ సహాయకుడు మేజర్ గోరాంగ్ దీక్షిత్ భార్య సోదరుడని మహువా మొయిత్రీ తెలిపారు. వాలికర్ జనార్ధన్ రావుకు బావ అని.. కిషన్ ధన్​కర్ గవర్నర్​కు దగ్గరి బంధువు అని మొయిత్రా ఆరోపించారు.

  • Uncleji only way WB’s “grim situation” will improve is if you move your sorry self back to Delhi & find another job.

    Some suggestions:

    1. Advisor to Ajay Bisht YogiCM on how best to Thok Do opposition
    2. Advisor to Home Min on how best to hide during a pandemic https://t.co/oWLW0Ciupg

    — Mahua Moitra (@MahuaMoitra) June 6, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

గవర్నర్​ను ప్రశ్నించేందుకు ప్రజాస్వామ్యంలో అందరికీ హక్కు ఉందని మొయిత్రీ తెలిపారు.

"గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రశ్నలు సంధిస్తూనే ఉన్నారు. అయితే.. తమను తాము అద్దంలో చూసుకోమని వారిని కోరుతున్నాను. ఆయన తన గ్రామం మొత్తాన్ని రాజ్ భవన్​లోకి తీసుకువచ్చారు."

-మహువా మొయిత్రీ, టీఎంసీ ఎంపీ

గవర్నర్​ వరుస ట్వీట్లు..

బంగాల్‌లో ఎన్నికల అనంతరం చెలరేగిన హింసతో శాంతిభద్రతలు ఆందోళనకరంగా మారాయాని రాష్ట్ర గవర్నర్‌ జగదీప్‌ ధన్‌కర్‌ పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన వరుస ట్వీట్లు చేశారు. రాష్ట్రంలో ప్రతీకార దాడుల గురించి ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుందో తనకు వివరించేందుకు రావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హెచ్​కే ద్వివేదిని ఆదేశించినట్లు గవర్నర్‌ పేర్కొన్నారు. విపక్షాలపై దాడుల అంశంలో అధికారపక్షం పోలీసులతో రాజీపడిందని ఆరోపించారు.

తృణమూల్‌కు వ్యతిరేకంగా ఓటేసిన వారే లక్ష్యంగా ఈ దాడులు జరుగుతున్నాయన్న గవర్నర్‌.. ఫలితంగా లక్షలాది మంది తరలిపోతున్నట్లు చెప్పారు. హత్యలు, అత్యాచారాలు, సామాజిక బహిష్కరణలు సైతం రాష్ట్రంలో జరుగుతున్నట్లు జగదీప్‌ ధన్‌కర్‌ ఆరోపించారు.

ఇవీ చదవండి: 'భాజపా కార్యకర్తలైనందుకే చెట్లకు కట్టేసి కొట్టారు'

దీదీ మేనల్లుడికి పార్టీలో​ కీలక బాధ్యతలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.