ETV Bharat / bharat

టిక్రీ సరిహద్దులో అత్యాచారం- సిట్​ ఏర్పాటు!

author img

By

Published : May 10, 2021, 10:59 PM IST

రైతులు ఆందోళన చేస్తున్న దిల్లీలోని టిక్రీ సరిహద్దులో అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహిళపై కొందరు దుండగులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి ఆరుగురు నిందితులపై ఎఫ్​ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. దీనిపై స్పందించిన హరియాణా హోం మంత్రి అనిల్ విజ్​.. నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు.

rape
అత్యాచారం

గత కొన్ని నెలలుగా సాగుచట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న దిల్లీలోని టిక్రీ సరిహద్దుల్లో ఓ మహిళపై అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు ఆరుగురు నిందితులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వారంతా కిసాన్​ సోషల్​ ఆర్మీతో సంబంధమున్న వ్యక్తులుగా తెలుస్తోంది.

టిక్రీ సరిహద్దులో రైతులకు మద్దతుగా ఆందోళన చేసేందుకు ఏప్రిల్​ 10న బంగాల్​ నుంచి ఓ మహిళ దిల్లీ బయలుదేరింది. ఆమెతో ఉన్న వ్యక్తి రైలులోనే ఆమెను వేధించాడు. ఆ తర్వాత టిక్రీ సరిహద్దుకు చేరుకోగా సామూహిక అత్యాచారం జరిగింది. ఏప్రిల్​ 25న బాధితురాలు ఆసుపత్రిలో చేరినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఏప్రిల్​ 30న కరోనా లక్షణాతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆమె చనిపోయిందని ఆమె తండ్రి తెలిపారు.

ఈ అత్యాచార ఘనటపై హరియాణా హోంమంత్రి అనిల్​ విజ్​ స్పందించారు. బాధితురాలకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. నిందితులెవరైనా వదిలి పెట్టేదే లేదని.. పట్టుకుని న్యాయస్థానం ముందు హాజరపరుస్తామన్నారు. బహదూర్​ఘడ్​ డీసీపీ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్​) ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

మరోవైపు దీనిపై స్పందించిన రైతు సంఘం సంయుక్త కిసాన్ మోర్చా.. బాధితురాలికి మద్దతుగా నిలుస్తామని ప్రకటించారు నేతలు. కిసామ్​ సోషల్​ ఆర్మీ నుంచి వారిని బహిష్కరించి, టెంట్లు, బ్యానర్లు తొలగించినట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి: వైరల్​: పోలీసులపై వ్యాపారుల రాళ్ల దాడి

గత కొన్ని నెలలుగా సాగుచట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న దిల్లీలోని టిక్రీ సరిహద్దుల్లో ఓ మహిళపై అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు ఆరుగురు నిందితులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వారంతా కిసాన్​ సోషల్​ ఆర్మీతో సంబంధమున్న వ్యక్తులుగా తెలుస్తోంది.

టిక్రీ సరిహద్దులో రైతులకు మద్దతుగా ఆందోళన చేసేందుకు ఏప్రిల్​ 10న బంగాల్​ నుంచి ఓ మహిళ దిల్లీ బయలుదేరింది. ఆమెతో ఉన్న వ్యక్తి రైలులోనే ఆమెను వేధించాడు. ఆ తర్వాత టిక్రీ సరిహద్దుకు చేరుకోగా సామూహిక అత్యాచారం జరిగింది. ఏప్రిల్​ 25న బాధితురాలు ఆసుపత్రిలో చేరినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఏప్రిల్​ 30న కరోనా లక్షణాతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆమె చనిపోయిందని ఆమె తండ్రి తెలిపారు.

ఈ అత్యాచార ఘనటపై హరియాణా హోంమంత్రి అనిల్​ విజ్​ స్పందించారు. బాధితురాలకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. నిందితులెవరైనా వదిలి పెట్టేదే లేదని.. పట్టుకుని న్యాయస్థానం ముందు హాజరపరుస్తామన్నారు. బహదూర్​ఘడ్​ డీసీపీ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్​) ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

మరోవైపు దీనిపై స్పందించిన రైతు సంఘం సంయుక్త కిసాన్ మోర్చా.. బాధితురాలికి మద్దతుగా నిలుస్తామని ప్రకటించారు నేతలు. కిసామ్​ సోషల్​ ఆర్మీ నుంచి వారిని బహిష్కరించి, టెంట్లు, బ్యానర్లు తొలగించినట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి: వైరల్​: పోలీసులపై వ్యాపారుల రాళ్ల దాడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.