కర్ణాటకలో.. గెషే ఫుంట్సోక్ అనే సన్యాసి 10రోజుల ముందు శివైక్యం పొందారు. ఆయన పార్థివదేశాన్ని భిక్కులు(బౌద్ధ సన్యాసులు) ఇప్పటికీ ప్రార్థనలు చేస్తున్నారు. సన్యాసి ఆత్మ దేహాన్ని ఇంకా విడిచిపెట్టలేదని.. అందుకే పూజలు చేస్తున్నామని అంటున్నారు.
![Tibetan monk died 10 days back.. Still his body worshipped by Bhikkhus](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13124131_631_13124131_1632196279769.png)
ఉత్తర కన్నడ జిల్లా ముందగొడు తాలూకాలోని టిబెటన్ కాలనీలో నివాసముంటున్న గెషే సన్యాసి.. ఈ నెల 9న పరమపదించారు. అనంతరం ఆయన పార్థివదేహాన్ని భద్రపరిచిన భిక్కులు.. రోజు ప్రార్థనలు చేస్తున్నారు. ఆయన ఆత్మ.. దేహాన్ని విడిచిపెట్టిందా? లేదా? అన్న విషయాన్ని తెలుసుకునేందుకు.. సన్యాసుల్లో ఒకరు ఎప్పటికప్పుడు ఆ గదిలోకి వెళ్లి చూసి వస్తున్నారు. నోరు, ముక్కులో నుంచి ద్రవం బయటకు వచ్చినా, వాసన వచ్చినా ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టినట్టు వారు విశ్వసిస్తారు.
![tibetan-monk-died-10-days-back-dot-still-his-body-worshipped-by-bhikkhus](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13124131_2.jpg)
![tibetan-monk-died-10-days-back-dot-still-his-body-worshipped-by-bhikkhus](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13124131_1.jpg)
టిబెటన్ కాలనీలో గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. నలుగురు సన్యాసులు.. దేహాన్ని విడిచిపెట్టగా.. ఆ తర్వాత వారికి పూజలు చేశారు. 7-15 రోజుల మధ్య వారి అంత్రక్రియలు జరిగాయి.
ఇదీ చూడండి:- మహంత్ నరేంద్ర గిరి అనుమానాస్పద మృతి- మోదీ విచారం