Sanitation Workers Died in Mumbai: సెప్టిక్ ట్యాంకులో పడి ఊపిరాడక ముగ్గురు పారిశుద్ధ్య కార్మికులు మృతి చెందిన విషాద ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబయిలో జరిగింది.

నగరు శివారు కందివాలి వెస్ట్లోని ఏక్తానగర్లో ఆరునెలల క్రితం ప్రజా మరుగుదొడ్లు (పబ్లిక్ టాయిలెట్) నిర్మించింది మున్సిపల్ కార్పొరేషన్. ఈ మరుగుదొడ్ల ట్యాంక్ నిండిపోవడం వల్ల దానిని శుభ్రం చేయడానికి ముగ్గురు వ్యక్తులను కాంట్రాక్టర్ పిలింపిచాడు. శుభ్రం చేసేందుకు ముగ్గురు పారిశుద్ధ్య కార్మికులు.. పొరపాటున సెప్టిక్ ట్యాంకులో పడిపోయారు. దీంతో ఊపిరాడక పోవటం వల్ల ప్రాణాలు కోల్పోయారు.
సమాచారం అందుకున్న పోలీసులు, మున్సిపల్ కార్పొరేషన్, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను వెలికి తీసి.. శతాబ్ది ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: దేశంలో మరో 4వేల కరోనా కేసులు.. పెరిగిన మరణాలు