Maoist attack in Odisha: మావోయిస్టుల దాడిలో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించారు. ఈ ఘటన ఒడిశాలోని నువాపాడా జిల్లాలో జరిగింది. జవాన్లు గస్తీ విధులు నిర్వహిస్తుండగా మావోయిస్టులు దాడి చేశారు. శిశుపాల్ సింగ్, శివలాల్, ధర్మేంద్ర సింగ్ను మృతులుగా అధికారులు గుర్తించారు.
శిశుపాల్ సింగ్ స్వస్థలం ఉత్తర్ప్రదేశ్ కాగా, శివలాల్, ధర్మేంద్రసింగ్ స్వస్థలం హరియాణా అని అధికారులు తెలిపారు. శిశుపాల్ సింగ్, శివలాల్.. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తుండగా, ధర్మేంద్ర సింగ్ సీఆర్పీఎఫ్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు.
ఇవీ చదవండి: 'అగ్నిపథ్పై తగ్గేదే లేదు.. ఆ విషయంలో మోదీకి సాటిలేరు'
ఏకే-47 కేసులో ఎమ్మెల్యేకు పదేళ్లు జైలు శిక్ష- పదవి పోవడం ఖాయం!