ETV Bharat / bharat

జేఈఈ మెయిన్స్​: తెలంగాణలో ముగ్గురికి 100 పర్సంటైల్​

author img

By

Published : Mar 24, 2021, 11:07 PM IST

Updated : Mar 25, 2021, 2:47 AM IST

జేఈఈ మెయిన్స్​ మార్చి విడత పరీక్షల ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. 13 మంది అభ్యర్థులు 100 పర్సంటైల్​ సాధించారు. వారిలో ముగ్గురు తెలంగాణ అభ్యర్థులు ఉన్నారు.

Thirteen candidates score perfect 100 in March session of JEE-Mains
జేఈఈ మెయిన్స్​ ఫలితాలు: 13 మందికి 100%

జేఈఈ మెయిన్స్​ మార్చి విడత పరీక్ష ఫలితాలను నేషనల్​ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. 13 మంది అభ్యర్థులు.. 100 పర్సంటైల్ సాధించారని తెలిపింది. వారిలో తెలంగాణ నుంచి బన్నూరు రోహిత్​ కుమార్​ రెడ్డి, మదుర్​ ఆదర్శ్​ రెడ్డి, జోస్యుల వెంకట ఆదిత్య ఉన్నారు.

దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్ రెండో విడత ఆన్​లైన్ పరీక్షలు మార్చి 16 నుంచి మార్చి 18 వరకు జరిగాయి. 6,19,368 మంది అభ్యర్థులు.. పరీక్షకు హాజరయ్యారు. విదేశాల్లోని 12 నగరాలు సహా మొత్తం 334 నగరాల్లోని 792 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరిగాయి.

ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్​, మే సెషన్స్​లో జేఈఈ పరీక్షలు జరిగిన తర్వాత.. వాటిల్లో బెస్ట్​ ఆఫ్​ ఫోర్​ను పరిగణనలోకి తీసుకుంటామని ఓ అధికారి తెలిపారు.

జేఈఈ మెయిన్స్​ మార్చి విడత పరీక్ష ఫలితాలను నేషనల్​ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. 13 మంది అభ్యర్థులు.. 100 పర్సంటైల్ సాధించారని తెలిపింది. వారిలో తెలంగాణ నుంచి బన్నూరు రోహిత్​ కుమార్​ రెడ్డి, మదుర్​ ఆదర్శ్​ రెడ్డి, జోస్యుల వెంకట ఆదిత్య ఉన్నారు.

దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్ రెండో విడత ఆన్​లైన్ పరీక్షలు మార్చి 16 నుంచి మార్చి 18 వరకు జరిగాయి. 6,19,368 మంది అభ్యర్థులు.. పరీక్షకు హాజరయ్యారు. విదేశాల్లోని 12 నగరాలు సహా మొత్తం 334 నగరాల్లోని 792 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరిగాయి.

ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్​, మే సెషన్స్​లో జేఈఈ పరీక్షలు జరిగిన తర్వాత.. వాటిల్లో బెస్ట్​ ఆఫ్​ ఫోర్​ను పరిగణనలోకి తీసుకుంటామని ఓ అధికారి తెలిపారు.

Last Updated : Mar 25, 2021, 2:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.