ETV Bharat / bharat

తాళాలు పగలగొట్టి మాంసం దుకాణంలో చోరీ.. 55 కోళ్లు​ మాయం..

author img

By

Published : Jan 5, 2023, 10:28 AM IST

చికెన్​ షాపులో 55 కోళ్లను దొంగలు ఎత్తుకెళ్లారు. వాటి విలువ రూ.55 వేలకుపైగా ఉంటుందని యజమాని తెలిపాడు. బిహార్ జరిగిందీ ఘటన.

http://10.10.50.75:6060///finalout2/bihar-nle/finalout/04-January-2023/17396140_motihari.mp4
బిహార్​లో కోళ్లను ఎత్తుకెళ్లిన దొంగలు

బిహార్​లోని మోతిహరి జిల్లాలో ఓ చికెన్​ షాపులో దొంగలు బీభత్సం సృష్టించారు. దుకాణం తాళాలు పగలగొట్టి 55 కోళ్లను ఎత్తుకెళ్లారు. జనవరి 2న రాత్రి ఈ ఘటన జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పటాహి పోలీస్ స్టేషన్​ పరిధిలోని బక్రీ బజార్​లో దొంగలు ఈ చోరీకి పాల్పడ్డారు. మొహమ్మద్ ఇజ్రాయెల్​కు చెందిన చికెన్​ షాపులో గుర్తుతెలియని వ్యక్తులు 55 కోళ్లను చోరీ చేశారు. వాటి విలువ దాదాపు రూ.55వేల వరకు ఉంటుంది. దొంగలు టెంపోలో వచ్చి చోరీకి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

"కొత్త సంవత్సరంలో గిరాకీ బాగా ఉంటుందని చాలా కోళ్లు కొనుక్కొని వచ్చాను. వాటన్నింటిని దొంగలు ఎత్తుకెళ్లారు. జనవరి 2న దుకాణానికి తాళం వేసి ఇంటికెళ్లాను. ఉదయాన్నే వచ్చి చూసే సరికి కోళ్లు లేవు. తాళం మాత్రం పగులగొట్టి ఉంది. అంతకు ముందు 2021 డిసెంబర్​ 26న నా షాపులో చోరీ జరిగింది. అప్పుడు రూ.10వేల విలువగల గుడ్లను దొంగలు ఎత్తుకెళ్లారు." అని బాధితుడు తెలిపాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల కోసం వెతుకున్నట్లు వారు వెల్లడించారు.

బిహార్​లోని మోతిహరి జిల్లాలో ఓ చికెన్​ షాపులో దొంగలు బీభత్సం సృష్టించారు. దుకాణం తాళాలు పగలగొట్టి 55 కోళ్లను ఎత్తుకెళ్లారు. జనవరి 2న రాత్రి ఈ ఘటన జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పటాహి పోలీస్ స్టేషన్​ పరిధిలోని బక్రీ బజార్​లో దొంగలు ఈ చోరీకి పాల్పడ్డారు. మొహమ్మద్ ఇజ్రాయెల్​కు చెందిన చికెన్​ షాపులో గుర్తుతెలియని వ్యక్తులు 55 కోళ్లను చోరీ చేశారు. వాటి విలువ దాదాపు రూ.55వేల వరకు ఉంటుంది. దొంగలు టెంపోలో వచ్చి చోరీకి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

"కొత్త సంవత్సరంలో గిరాకీ బాగా ఉంటుందని చాలా కోళ్లు కొనుక్కొని వచ్చాను. వాటన్నింటిని దొంగలు ఎత్తుకెళ్లారు. జనవరి 2న దుకాణానికి తాళం వేసి ఇంటికెళ్లాను. ఉదయాన్నే వచ్చి చూసే సరికి కోళ్లు లేవు. తాళం మాత్రం పగులగొట్టి ఉంది. అంతకు ముందు 2021 డిసెంబర్​ 26న నా షాపులో చోరీ జరిగింది. అప్పుడు రూ.10వేల విలువగల గుడ్లను దొంగలు ఎత్తుకెళ్లారు." అని బాధితుడు తెలిపాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల కోసం వెతుకున్నట్లు వారు వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.