థియేటర్లు, మల్టీప్లెక్స్లలో సీటింగ్ సామర్థ్యాన్ని 50 శాతం నుంచి 100 శాతానికి పెంచేందుకు అనుమతి ఇస్తానని చెప్పారు పశ్చిమ్ బంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ . 26వ కోల్కతా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్కు హాజరైన మమత ఈ వ్యాఖ్యలు చేశారు.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో సినిమా హాళ్లలో కేవలం 50 శాతం మందికే అనుమతి ఉండేది. ఈ తరుణంలో బంగాల్ ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. మాస్కులు, శానిటైజర్ల వినియోగం తప్పనిసరి చేయాలని కోరారు. ప్రతి షో అనంతరం హాల్ను శానిటైజ్ చేయాలని మమత తెలిపారు.
ఈ ఫిల్మ్ ఫెస్టివల్కు బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ వర్చువల్గా హాజరయ్యారు.
ఇదీ చదవండి:థియేటర్ల విషయంలో తమిళనాడుకు కేంద్రం షాక్