ETV Bharat / bharat

తెలంగాణలో ముగిసిన ఎన్నికల ప్రచారపర్వం - రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్‌ అమల్లోకి

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 28, 2023, 5:00 PM IST

Updated : Nov 28, 2023, 5:08 PM IST

Telangana Assembly Election Campaign Ended : రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల ప్రచారం ముగిసింది. కొన్నాళ్లుగా హోరెత్తించిన మైకులు మూగబోయాయి. ప్రచారం పరిసమాప్తితో ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. మద్యం దుకాణాలు మూతపడ్డాయి. ఎన్నికల ప్రచారానికి వచ్చిన స్థానికేతరులు ఆయా నియోజకవర్గాల నుంచి వెళ్లిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ అమలు కానుంది.

Telangana Election Campaign Concluded
Telangana Assembly Election Campaign Ended

Telangana Assembly Election Campaign Ended : తెలంగాణలో ప్రచార పర్వానికి తెరపడింది. కొన్నాళ్లుగా హోరెత్తించిన మైకులు బంద్‌ అయ్యాయి. శాసనసభ ఎన్నికలకు అక్టోబర్ తొమ్మిదో తేదీన ప్రకటన వెలువడగా.. ఈ నెల మూడో తేదీన నోటిఫికేషన్ విడుదలైంది. ప్రకటన కంటే ముందే రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. నామినేషన్ల ఘట్టం పూర్తయ్యాక ప్రచార పర్వం మరింత ఉద్ధృతంగా సాగింది.

Telangana Election Campaign Concluded : అధికార భారత్ రాష్ట్ర సమితి(BRS)తో పాటు ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, బీజేపీ విస్తృతంగా అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాయి. మజ్లిస్, బీఎస్పీ, వామపక్షాలు సహా ఇతర పార్టీలు, స్వతంత్రులు ఎన్నికల ప్రచారాన్ని చేపట్టాయి. ఆయా పార్టీల తరపున అగ్రనేతలు రాష్ట్రవ్యాప్తంగా ప్రచార సభలు, సమావేశాలు, ర్యాలీలు, రోడ్ షో(Road Shows)లలో పాల్గొన్నారు. తమ పార్టీ విధానాలను వివరిస్తూ, వైరి పక్షాల వైఖరిని ఎండగడుతూ ప్రచారాన్ని వేడెక్కించారు. విమర్శలు, ప్రతివిమర్శలతో ఎన్నికల ప్రచారం కదనరంగాన్ని తలపించింది. ఆయా పార్టీల తరపున ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో(Election Manifestos)లను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. గత కొన్నాళ్లుగా హోరెత్తించిన ఎన్నికల ప్రచారం.. సాయంత్రం 5 గంటలతో ముగిసింది.

TS Election Polling on November 30 : పోలింగ్‌కు 48 గంటల ముందు సైలెన్స్ పీరియడ్ ప్రారంభమైంది. మొత్తం 119 నియోజకవర్గాలకు గానూ.. 13 నియోజకవర్గాల్లో పోలింగ్(Election Polling) 30వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకే ముగియనుంది. దీంతో ఆ 13 నియోజకవర్గాల్లో ఇవాళ సాయంత్రం నాలుగు గంటలతో ఎన్నికల ప్రచారం ముగిసింది. సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం నియోజకవర్గాలు ఈ జాబితాలో ఉన్నాయి. మిగతా 106 నియోజకవర్గాల్లో సాయంత్రం ఐదు గంటలతో ఎన్నికల ప్రచారం ముగిసింది. సైలెన్స్ పీరియడ్ ప్రారంభంతో ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. దీంతో ఎలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు, రోడ్ షోలు నిర్వహించడానికి వీలు లేదు.

అమల్లోకి 144 సెక్షన్..: రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్(144 Section) అమల్లోకి వచ్చింది. ప్రలోభాల కట్టడిపై ప్రధానంగా పోలీసులు దృష్టి సారించారు. ఎక్కడికక్కడ ముమ్మరంగా తనిఖీలు నిర్వహించడంతో పాటు నిఘా మరింత పటిష్ఠం చేశారు. రాష్ట్ర సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల వద్ద తనిఖీలు కట్టుదిట్టం చేశారు. ఇందులో భాగంగానే మద్యం దుకాణాలు, బార్లు, కల్లు దుకాణాలను సాయంత్రం 5 గంటల నుంచి మూసివేయించారు. మరోవైపు.. ఎన్నికల ప్రచారానికి వచ్చిన స్థానికేతరులు ఆయా నియోజకవర్గాల నుంచి ఇప్పటికే వెళ్లిపోయారు.

Telangana Assembly Election Campaign Ended : తెలంగాణలో ప్రచార పర్వానికి తెరపడింది. కొన్నాళ్లుగా హోరెత్తించిన మైకులు బంద్‌ అయ్యాయి. శాసనసభ ఎన్నికలకు అక్టోబర్ తొమ్మిదో తేదీన ప్రకటన వెలువడగా.. ఈ నెల మూడో తేదీన నోటిఫికేషన్ విడుదలైంది. ప్రకటన కంటే ముందే రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. నామినేషన్ల ఘట్టం పూర్తయ్యాక ప్రచార పర్వం మరింత ఉద్ధృతంగా సాగింది.

Telangana Election Campaign Concluded : అధికార భారత్ రాష్ట్ర సమితి(BRS)తో పాటు ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, బీజేపీ విస్తృతంగా అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాయి. మజ్లిస్, బీఎస్పీ, వామపక్షాలు సహా ఇతర పార్టీలు, స్వతంత్రులు ఎన్నికల ప్రచారాన్ని చేపట్టాయి. ఆయా పార్టీల తరపున అగ్రనేతలు రాష్ట్రవ్యాప్తంగా ప్రచార సభలు, సమావేశాలు, ర్యాలీలు, రోడ్ షో(Road Shows)లలో పాల్గొన్నారు. తమ పార్టీ విధానాలను వివరిస్తూ, వైరి పక్షాల వైఖరిని ఎండగడుతూ ప్రచారాన్ని వేడెక్కించారు. విమర్శలు, ప్రతివిమర్శలతో ఎన్నికల ప్రచారం కదనరంగాన్ని తలపించింది. ఆయా పార్టీల తరపున ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో(Election Manifestos)లను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. గత కొన్నాళ్లుగా హోరెత్తించిన ఎన్నికల ప్రచారం.. సాయంత్రం 5 గంటలతో ముగిసింది.

TS Election Polling on November 30 : పోలింగ్‌కు 48 గంటల ముందు సైలెన్స్ పీరియడ్ ప్రారంభమైంది. మొత్తం 119 నియోజకవర్గాలకు గానూ.. 13 నియోజకవర్గాల్లో పోలింగ్(Election Polling) 30వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకే ముగియనుంది. దీంతో ఆ 13 నియోజకవర్గాల్లో ఇవాళ సాయంత్రం నాలుగు గంటలతో ఎన్నికల ప్రచారం ముగిసింది. సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం నియోజకవర్గాలు ఈ జాబితాలో ఉన్నాయి. మిగతా 106 నియోజకవర్గాల్లో సాయంత్రం ఐదు గంటలతో ఎన్నికల ప్రచారం ముగిసింది. సైలెన్స్ పీరియడ్ ప్రారంభంతో ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. దీంతో ఎలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు, రోడ్ షోలు నిర్వహించడానికి వీలు లేదు.

అమల్లోకి 144 సెక్షన్..: రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్(144 Section) అమల్లోకి వచ్చింది. ప్రలోభాల కట్టడిపై ప్రధానంగా పోలీసులు దృష్టి సారించారు. ఎక్కడికక్కడ ముమ్మరంగా తనిఖీలు నిర్వహించడంతో పాటు నిఘా మరింత పటిష్ఠం చేశారు. రాష్ట్ర సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల వద్ద తనిఖీలు కట్టుదిట్టం చేశారు. ఇందులో భాగంగానే మద్యం దుకాణాలు, బార్లు, కల్లు దుకాణాలను సాయంత్రం 5 గంటల నుంచి మూసివేయించారు. మరోవైపు.. ఎన్నికల ప్రచారానికి వచ్చిన స్థానికేతరులు ఆయా నియోజకవర్గాల నుంచి ఇప్పటికే వెళ్లిపోయారు.

Last Updated : Nov 28, 2023, 5:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.