రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ను మానవతా దృక్పథంతో విడుదల చేయాలని కోరుతూ రాష్ట్రపతికి 50 వేల పోస్టుకార్డులు పంపారు లాలూ కుమారుడు, ఎమ్మెల్యే తేజ్ ప్రతాప్ యాదవ్. వాటిని స్వేచ్ఛా లేఖలుగా పేర్కొన్నారు తేజ్. తన తండ్రి విడుదలయ్యే వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు.
" బిహార్తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న లాలూ జీ అభిమానుల నుంచి ఈ లేఖలను సేకరించాం. ఆయన విడుదలయ్యే వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. అధ్యక్షుడిని కలిసేందుకు నాకు సమయం ఇవ్వాలని కోరుతున్నా. ప్రతి ఒక్కరు లేఖలు రాసి నాకు ఇవ్వండి.. వాటిని నేను రాష్ట్రపతికి పంపిస్తా. "
- తేజ్ ప్రతాప్ యాదవ్, ఆర్జేడీ నేత
దాణా కుంభకోణంలో జైలు శిక్ష అనుభవిస్తున్న లాలూ ప్రసాద్ యాదవ్ కొద్ది రోజుల క్రితం అనారోగ్యానికి గురయ్యారు. రాష్ట్ర మెడికల్ బోర్డు సూచనల మేరకు ఇటీవలే దిల్లీలోని అఖిల భారత వైద్య మండలి (ఎయిమ్స్)కు తరలించారు అధికారులు.
ఇదీ చూడండి: క్షీణించిన లాలూ ఆరోగ్యం-ఎయిమ్స్కు తరలింపు