ETV Bharat / bharat

వసూళ్ల పర్వంలో మరో ఇద్దరు 'మహా' మంత్రులు!

author img

By

Published : Apr 8, 2021, 5:17 AM IST

వసూళ్ల పర్వంలో మరో ఇద్దరు మంత్రులు ఉన్నారని ముకేశ్ అంబానీ ఇంటి ముందు పేలుడు పదార్థాల వాహనం కేసులో అరెస్టై ఎన్​ఐఏ కస్టడీలో ఉన్న పోలీసు అధికారి సచిన్​ వాజే ఆరోపించారు. ఈమేరకు ఎన్​ఐఏకు రాసిన లేఖ సంచలనంగా మారింది.

sachin waze
వసూళ్ల పర్వంలో మరో ఇద్దరు మంత్రులు

ముకేశ్ అంబానీ ఇంటి ముందు పేలుడు పదార్థాల వాహనం, దాని యజమాని మన్​సుఖ్​ హిరేన్ హత్య కేసులో అరెస్టై ఎన్​ఐఏ కస్టడీలో ఉన్న పోలీస్ అధికారి సచిన్ వాజే మరో బాంబు పేల్చారు. ఇప్పటికే నెలకు రూ.100 కోట్లు వసూలు చేయమని పోలీసులను మాజీ హోంమంత్రి అనిల్ దేశ్​ముఖ్ ఆదేశించారంటూ ముంబయి మాజీ పోలీస్ కమిషనర్ పరమ్​బీర్ సింగ్ ఆరోపించారు. ఈ ఆరోపణలతో అనిల్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇప్పుడు వాజే.. ఎన్​ఐఏకు రాసిన 4 పేజీల లేఖ కలకలం రేపుతోంది. లేఖలో అనిల్​పై పరమ్​బీర్​ చేసిన ఆరోపణలు నిజమేనని వాజే ధ్రువీకరించారు. ఇంకో ఇద్దరు మంత్రులు ప్రమేయంపైనా సంచలన విషయాలు బయటపెట్టారు.

sachin waze letter bomb
వాజే సంచలన లేఖ

2004లో ఓ కేసుకు సంబంధించి వాజేను సస్పెండ్ చేశారు. 2020లో తిరిగి ఆయన్ను విధుల్లోకి తీసుకున్నారు. తన నియామకం.. ఎన్సీపీ అధినేత శరద్​పవార్​కు ఇష్టం లేదని వాజే పేర్కొన్నారు.

sachin waze letter bomb
సచిన్​ వాజే రాసిన లేఖ

"నన్ను తీసుకోవద్దని పవార్ చెప్పారు. సస్పెండ్ చేయమన్నారు. ఆ సమయంలో హోంమంత్రి అనిల్ దేశ్​ముఖ్.. రూ.2 కోట్లిస్తే శరద్​ పవార్​ను ఒప్పిస్తానన్నారు. అంత మొత్తం చెల్లించలేనని చెప్పాను. తర్వాత ఇవ్వమన్నారు. దక్షిణ ముంబయిలో ఓ అతిథి గృహంలో జరిగిన సమావేశంలో సైఫీ బుర్హానీ అప్​లిఫ్ట్​మెంట్ ట్రస్ట్​పై విచారణ గురించి నాతో హోంమంత్రి మాట్లాడారు. రూ. 50 కోట్లిస్తే విచారణ ముగిస్తామని చెప్పి.. ఆ ట్రస్ట్ నుంచి రూ.50 కోట్లు వసూలు చేయమన్నారు. ఆ ట్రస్టు సభ్యులెవరూ తెలియదని చెప్పాను. జనవరిలో మళ్లీ అధికారిక నివాసానికి పిలిపించుకుని, ముంబయిలోని 1650 బార్ల నుంచి రూ. 100 కోట్లు వసూలు చేయమని చెప్పారు. ఒక్కో బార్​ నుంచి 3 నుంచి 3.5 కోట్లు రాబట్టాలని అన్నారు. అది నా పరిధిలో లేదని చెప్పా. ఆ సమయంలోనే నన్ను ఉద్యోగంలో ఉంచినందుకు డిమాండ్ చేసిన రూ. 2 కోట్లు గురించి దేశ్​ముఖ్​ ప్రస్తావించారు. ఈ ఏడాది జనవరిలో (శివసేన) మంత్రి అనిల్ పరబ్ పిలిచి.. బృహన్ ముంబయి కార్పొరేషన్​లో 50 మంది కాంట్రాక్టర్ల నుంచి రూ.2 కోట్ల చొప్పున వసూలు చేయాలని ఆదేశించారు. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ సన్నిహితుడనంటూ దర్శన్ అనే ఓ వ్యక్తి కూడా నవంబర్​లో నన్ను కలిశారు. అక్రమ గుట్కా వ్యాపారస్తుల నుంచి రూ. 100 కోట్లు వసూలు చేయమని చెప్పారు. అలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేయనని చెప్పేసరికి, ఉద్యోగం వదులుకోవాల్సి వస్తుందని దర్శన్ హెచ్చరించారు" అని లేఖలో వాజే పేర్కొన్నారు.

sachin waze letter bomb
ఎన్​ఐఏకు లేఖ రాసిన సచిన్ వాజే

మరోవైపు వాజే.. ఎన్​ఐఏ కస్టడీని ఏప్రిల్​ 9 వరకు పొడిగించారు. బాంబే హైకోర్టు ఆదేశాల మేరకు అనిల్ దేశ్​ముఖ్​పై వచ్చిన ఆరోపణలపై విచారిస్తున్న సీబీఐ.. వాజేను కూడా ప్రశ్నించనుంది. వాజే ఆరోపణలను మంత్రి పరబ్ ఖండించారు. సచిన్​ వాజేపై ముంబయి పోలీసు విభాగం కూడా తన నివేదికను ప్రత్యేక ఎన్​ఐఏ కోర్టుకు సమర్పించింది. అందులో ముంబయి మాజీ పోలీసు కమిషనర్ పరమ్​బీర్- వాజే సంబంధాలను ప్రస్తావించింది.

ఇదీ చదవండి:వేర్వేరు ప్రమాదాల్లో 8మంది మృతి

ముకేశ్ అంబానీ ఇంటి ముందు పేలుడు పదార్థాల వాహనం, దాని యజమాని మన్​సుఖ్​ హిరేన్ హత్య కేసులో అరెస్టై ఎన్​ఐఏ కస్టడీలో ఉన్న పోలీస్ అధికారి సచిన్ వాజే మరో బాంబు పేల్చారు. ఇప్పటికే నెలకు రూ.100 కోట్లు వసూలు చేయమని పోలీసులను మాజీ హోంమంత్రి అనిల్ దేశ్​ముఖ్ ఆదేశించారంటూ ముంబయి మాజీ పోలీస్ కమిషనర్ పరమ్​బీర్ సింగ్ ఆరోపించారు. ఈ ఆరోపణలతో అనిల్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇప్పుడు వాజే.. ఎన్​ఐఏకు రాసిన 4 పేజీల లేఖ కలకలం రేపుతోంది. లేఖలో అనిల్​పై పరమ్​బీర్​ చేసిన ఆరోపణలు నిజమేనని వాజే ధ్రువీకరించారు. ఇంకో ఇద్దరు మంత్రులు ప్రమేయంపైనా సంచలన విషయాలు బయటపెట్టారు.

sachin waze letter bomb
వాజే సంచలన లేఖ

2004లో ఓ కేసుకు సంబంధించి వాజేను సస్పెండ్ చేశారు. 2020లో తిరిగి ఆయన్ను విధుల్లోకి తీసుకున్నారు. తన నియామకం.. ఎన్సీపీ అధినేత శరద్​పవార్​కు ఇష్టం లేదని వాజే పేర్కొన్నారు.

sachin waze letter bomb
సచిన్​ వాజే రాసిన లేఖ

"నన్ను తీసుకోవద్దని పవార్ చెప్పారు. సస్పెండ్ చేయమన్నారు. ఆ సమయంలో హోంమంత్రి అనిల్ దేశ్​ముఖ్.. రూ.2 కోట్లిస్తే శరద్​ పవార్​ను ఒప్పిస్తానన్నారు. అంత మొత్తం చెల్లించలేనని చెప్పాను. తర్వాత ఇవ్వమన్నారు. దక్షిణ ముంబయిలో ఓ అతిథి గృహంలో జరిగిన సమావేశంలో సైఫీ బుర్హానీ అప్​లిఫ్ట్​మెంట్ ట్రస్ట్​పై విచారణ గురించి నాతో హోంమంత్రి మాట్లాడారు. రూ. 50 కోట్లిస్తే విచారణ ముగిస్తామని చెప్పి.. ఆ ట్రస్ట్ నుంచి రూ.50 కోట్లు వసూలు చేయమన్నారు. ఆ ట్రస్టు సభ్యులెవరూ తెలియదని చెప్పాను. జనవరిలో మళ్లీ అధికారిక నివాసానికి పిలిపించుకుని, ముంబయిలోని 1650 బార్ల నుంచి రూ. 100 కోట్లు వసూలు చేయమని చెప్పారు. ఒక్కో బార్​ నుంచి 3 నుంచి 3.5 కోట్లు రాబట్టాలని అన్నారు. అది నా పరిధిలో లేదని చెప్పా. ఆ సమయంలోనే నన్ను ఉద్యోగంలో ఉంచినందుకు డిమాండ్ చేసిన రూ. 2 కోట్లు గురించి దేశ్​ముఖ్​ ప్రస్తావించారు. ఈ ఏడాది జనవరిలో (శివసేన) మంత్రి అనిల్ పరబ్ పిలిచి.. బృహన్ ముంబయి కార్పొరేషన్​లో 50 మంది కాంట్రాక్టర్ల నుంచి రూ.2 కోట్ల చొప్పున వసూలు చేయాలని ఆదేశించారు. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ సన్నిహితుడనంటూ దర్శన్ అనే ఓ వ్యక్తి కూడా నవంబర్​లో నన్ను కలిశారు. అక్రమ గుట్కా వ్యాపారస్తుల నుంచి రూ. 100 కోట్లు వసూలు చేయమని చెప్పారు. అలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేయనని చెప్పేసరికి, ఉద్యోగం వదులుకోవాల్సి వస్తుందని దర్శన్ హెచ్చరించారు" అని లేఖలో వాజే పేర్కొన్నారు.

sachin waze letter bomb
ఎన్​ఐఏకు లేఖ రాసిన సచిన్ వాజే

మరోవైపు వాజే.. ఎన్​ఐఏ కస్టడీని ఏప్రిల్​ 9 వరకు పొడిగించారు. బాంబే హైకోర్టు ఆదేశాల మేరకు అనిల్ దేశ్​ముఖ్​పై వచ్చిన ఆరోపణలపై విచారిస్తున్న సీబీఐ.. వాజేను కూడా ప్రశ్నించనుంది. వాజే ఆరోపణలను మంత్రి పరబ్ ఖండించారు. సచిన్​ వాజేపై ముంబయి పోలీసు విభాగం కూడా తన నివేదికను ప్రత్యేక ఎన్​ఐఏ కోర్టుకు సమర్పించింది. అందులో ముంబయి మాజీ పోలీసు కమిషనర్ పరమ్​బీర్- వాజే సంబంధాలను ప్రస్తావించింది.

ఇదీ చదవండి:వేర్వేరు ప్రమాదాల్లో 8మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.