ETV Bharat / bharat

అర్ధరాత్రి డ్రోన్ల కలకలం.. బలగాలు అప్రమత్తం

author img

By

Published : Jun 29, 2021, 10:04 AM IST

Updated : Jun 29, 2021, 10:44 AM IST

జమ్ముకశ్మీర్​లో వరుసగా డ్రోన్​లు సంచరిస్తుండటం కలకలం రేపుతోంది. తాజాగా సోమవారం అర్ధరాత్రి జమ్ములోని రత్నాచుక్​, కుంజ్వాని ప్రాంతంలో డ్రోన్​ సంచరించినట్లు బలగాలు తెలిపాయి. అయితే దీనికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు వెల్లడికాలేదు.

Suspected drone activity was seen late night
అర్ధరాత్రి డ్రోస్​ కలకలం

జమ్ముకశ్మీర్​లో మరోసారి డ్రోన్లు​ ప్రత్యక్షమయ్యాయి. సోమవారం అర్ధరాత్రి జమ్ములోని రత్నాచుక్​, కుంజ్వాని ప్రాంతంలో డ్రోన్​లు సంచరించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు.

జమ్ము వైమానిక స్థావరంపై జరిగిన దాడిని మరువక ముందే ఆదివారం అర్ధరాత్రి మరో రెండు డ్రోన్లు పాక్‌ నుంచి భారత్‌ వైపునకు దూసుకొచ్చాయి. తాజాగా మరోసారి.. డ్రోన్​లు సంచరించటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

ఎన్​ఐఏ రంగంలోకి..

జమ్ములోని వైమానిక స్థావరంపై డ్రోన్​ దాడిని కేంద్ర హోం శాఖ తీవ్రంగా పరిగణించింది. ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్​ఐఏ)కు అప్పగించింది. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు నిర్వహించాలని ఆదేశించింది.

మరోవైపు.. భవిష్యత్తులో ఇలాంటి డ్రోన్​ దాడులను అరికట్టాలంటే అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాల్సిందేనని నిపుణులు సూచిస్తున్నారు.

ఎన్​ఎస్​జీ బృందం పర్యటన

జమ్ములో డ్రోన్​ దాడి జరిగిన వైమానిక స్థావరంలో జాతీయ భద్రత దళం(ఎన్​ఎస్​జీ) పర్యటించింది. ప్రత్యేక డాగ్​ స్క్వాడ్ టీం.. ఘటనా స్థలిలో దర్యాప్తు చేపట్టింది. దాడిలో ఆర్​డీఎక్స్​​ లేదా టీఎన్​టీ పేలుడు పదార్థాన్ని వినియోగించినట్లు భద్రతా దళాలు అనుమానిస్తున్నాయి.


ఐరాసలో భారత్​ ఆందోళన..

జమ్ములోని వైమానిక స్థావరంపై జరిగిన డ్రోన్ దాడిని ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో భారత్ ప్రస్తావించింది. డ్రోన్​లతో ఉగ్రవాద కార్యకలాపాలను జరపటం ఆందోళనకర అంశం అని తెలిపింది. దేశంలోని కీలకమైన సైన్య స్థావరాలే లక్ష్యంగా దాడులు చేయటాన్ని తీవ్రంగా పరిగణించాలని పేర్కొంది.

" ప్రస్తుతం ఎక్కడ చూసినా సాంకేతికత దుర్వినియోగం జరుగుతోంది. ఇంటర్నెట్, సామాజిక మాధ్యమాలు వేదికగా ఉగ్రవాద కాల్యకలాపాలు జరుగుతున్నాయి. ఉగ్రదాడుల కోసం సాంకేతికతను ఉపయోగించటం తీవ్ర పరిణామంగా భావించాలి. తక్కువ ధరకే ఇలాంటి డ్రోన్​లు లభ్యం కావటం, సులభంగా మార్కెట్​లో అందుబాటులో ఉండటంతో ఈ దాడులను ఎంచుకున్నారు. కానీ ఇలాంటి దాడులు చాలా ప్రమాదం."

-- వీఎస్​కే కౌముది, కేంద్ర హోం శాఖ ప్రత్యేక కార్యదర్శి

ఇదీ చదవండి : జమ్ములో మళ్లీ డ్రోన్ల కలకలం​- సైన్యం అప్రమత్తం

అత్యాధునిక సాంకేతికతతోనే డ్రోనాసురులపై వేట!

డ్రోన్ల దాడిపై విచారణ- ఆర్డీఎక్స్ వాడారా​?

జమ్ముకశ్మీర్​లో మరోసారి డ్రోన్లు​ ప్రత్యక్షమయ్యాయి. సోమవారం అర్ధరాత్రి జమ్ములోని రత్నాచుక్​, కుంజ్వాని ప్రాంతంలో డ్రోన్​లు సంచరించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు.

జమ్ము వైమానిక స్థావరంపై జరిగిన దాడిని మరువక ముందే ఆదివారం అర్ధరాత్రి మరో రెండు డ్రోన్లు పాక్‌ నుంచి భారత్‌ వైపునకు దూసుకొచ్చాయి. తాజాగా మరోసారి.. డ్రోన్​లు సంచరించటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

ఎన్​ఐఏ రంగంలోకి..

జమ్ములోని వైమానిక స్థావరంపై డ్రోన్​ దాడిని కేంద్ర హోం శాఖ తీవ్రంగా పరిగణించింది. ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్​ఐఏ)కు అప్పగించింది. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు నిర్వహించాలని ఆదేశించింది.

మరోవైపు.. భవిష్యత్తులో ఇలాంటి డ్రోన్​ దాడులను అరికట్టాలంటే అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాల్సిందేనని నిపుణులు సూచిస్తున్నారు.

ఎన్​ఎస్​జీ బృందం పర్యటన

జమ్ములో డ్రోన్​ దాడి జరిగిన వైమానిక స్థావరంలో జాతీయ భద్రత దళం(ఎన్​ఎస్​జీ) పర్యటించింది. ప్రత్యేక డాగ్​ స్క్వాడ్ టీం.. ఘటనా స్థలిలో దర్యాప్తు చేపట్టింది. దాడిలో ఆర్​డీఎక్స్​​ లేదా టీఎన్​టీ పేలుడు పదార్థాన్ని వినియోగించినట్లు భద్రతా దళాలు అనుమానిస్తున్నాయి.


ఐరాసలో భారత్​ ఆందోళన..

జమ్ములోని వైమానిక స్థావరంపై జరిగిన డ్రోన్ దాడిని ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో భారత్ ప్రస్తావించింది. డ్రోన్​లతో ఉగ్రవాద కార్యకలాపాలను జరపటం ఆందోళనకర అంశం అని తెలిపింది. దేశంలోని కీలకమైన సైన్య స్థావరాలే లక్ష్యంగా దాడులు చేయటాన్ని తీవ్రంగా పరిగణించాలని పేర్కొంది.

" ప్రస్తుతం ఎక్కడ చూసినా సాంకేతికత దుర్వినియోగం జరుగుతోంది. ఇంటర్నెట్, సామాజిక మాధ్యమాలు వేదికగా ఉగ్రవాద కాల్యకలాపాలు జరుగుతున్నాయి. ఉగ్రదాడుల కోసం సాంకేతికతను ఉపయోగించటం తీవ్ర పరిణామంగా భావించాలి. తక్కువ ధరకే ఇలాంటి డ్రోన్​లు లభ్యం కావటం, సులభంగా మార్కెట్​లో అందుబాటులో ఉండటంతో ఈ దాడులను ఎంచుకున్నారు. కానీ ఇలాంటి దాడులు చాలా ప్రమాదం."

-- వీఎస్​కే కౌముది, కేంద్ర హోం శాఖ ప్రత్యేక కార్యదర్శి

ఇదీ చదవండి : జమ్ములో మళ్లీ డ్రోన్ల కలకలం​- సైన్యం అప్రమత్తం

అత్యాధునిక సాంకేతికతతోనే డ్రోనాసురులపై వేట!

డ్రోన్ల దాడిపై విచారణ- ఆర్డీఎక్స్ వాడారా​?

Last Updated : Jun 29, 2021, 10:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.