భారత ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ)గా సుశీల్చంద్ర నియామకం అయ్యారు. సంప్రదాయం ప్రకారం ఎన్నికల సంఘంలో సీనియర్ను సీఈసీగా నియమించటం ఆనవాయితీగా వస్తోంది. ఈ నెల 12న(సోమవారం) ప్రస్తుత సీఈసీ సునీల్ ఆరోడా పదవీ విరమణ చేసిన నేపథ్యంలో.. ఆ తర్వాత సీనియర్ అయిన సుశీల్ చంద్ర నియామకం లాంఛనమైంది.
ఈనెల 13న సీఈసీగా సుశీల్ చంద్ర బాధ్యతలు చేపట్టనున్నారు. పార్లమెంటు ఎన్నికలకు ముందు 2019 ఫిబ్రవరి 14న ఎన్నికల సంఘం కమిషనర్గా నియమితులైన సుశీల్ చంద్ర పదవీకాలం 2022 మే 14 వరకూ ఉంది. ఆయన ఆధ్వర్యంలో గోవా, మణిపుర్, ఉత్తరాఖండ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి.