ETV Bharat / bharat

జేపీ నడ్డా కాన్వాయ్​పై రాళ్ల దాడి

author img

By

Published : Dec 10, 2020, 1:18 PM IST

Updated : Dec 11, 2020, 12:44 AM IST

బంగాల్​ పర్యటనలో ఉన్న భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా వాహనశ్రేణిపై రాళ్ల దాడి జరిగింది. టీఎంసీ కార్యకర్తలే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని భాజపా ఆరోపించింది.

Stones hurled at J P Nadda's convoy
జేపీ నడ్డా కాన్వాయ్​పై రాళ్ల దాడి

భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా బంగాల్ పర్యటన ఉద్రిక్తకరంగా మారింది. కోల్​కతా నుంచి దక్షిణ 24 పరగణాల జిల్లాలోని డైమండ్ హార్బర్​ వైపు వెళ్తుండగా ఆయన వాహనశ్రేణిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాశ్​ విజయవర్గీయ, భాజపా నేత దీపాంజన్​ గుహ కార్లు కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి. మీడియా వాహనాలూ దెబ్బతిన్నాయి. రోడ్లను మూసివేసేందుకు ప్రయత్నించారు దుండగులు. వారిని చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు పోలీసులు.

జేపీ నడ్డా కాన్వాయ్​పై రాళ్ల దాడి

ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు భాజపా జాతీయ అధ్యక్షుడు నడ్డా. ఇది ప్రజాస్వామ్యానికి అవమానమని పేర్కొన్నారు.

Stones hurled at J P Nadda's convoy
ధ్వంసం అయిన కారు అద్దాలు

" మా కాన్వాయ్​లో దాడి జరగని కారు ఒక్కటి కూడా లేదు. నేను బులెట్​ప్రూఫ్​ కార్​లో వెళ్తున్న కారణంగా సురక్షితంగా బయటపడ్డాను. బంగాల్​లో ఈ అన్యాయమైన, అసహన స్థితి ముగియాలి. ముకుల్​ రాయ్​, కైలాశ్​ విజయవర్గీయ గాయపడ్డారు. ఇది ప్రజాస్వామ్యానికి అవమానం. 2021లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని నేను నమ్మకంగా చెప్పగలను. కమలం వికసిస్తుంది. "

- జేపీ నడ్డా, భాజపా జాతీయ అధ్యక్షుడు.

టీఎంసీ కార్యకర్తలే ఈ దాడి చేశారని బంగాల్​ భాజపా అధ్యక్షుడు దిలీప్​ ఘోష్​ ఆరోపించారు. భారత రాజకీయ చరిత్రలో ఇది చీకటి రోజుగా అభివర్ణించారు. బంగాల్​లో మీడియాకు కూడా భద్రత లేదన్నారు. 'ఈ దాడిలో నేను గాయపడ్డాను. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నా. పోలీసులు ఉన్న సమయంలోనే గూండాలు రేచ్చిపోయారు. సొంత దేశంలోనే ఉన్నామా అన్న భావన కలుగుతోంది.' అని పేర్కొన్నారు కైలాశ్ విజయవర్గీయ​.

Stones hurled at J P Nadda's convoy
ధ్వంసం అయిన కారు అద్దాలు
Stones hurled at J P Nadda's convoy
కారులోపల పడిన భారీ రాయి

కేంద్ర హోంశాఖ స్పందన

Stones hurled at J P Nadda's convoy
కారులో పడిన రాయి

నడ్డా పర్యటన సందర్భంగా భద్రతా లోపాలతో ఉద్రిక్త పరిస్థితులు చెలరేగటంపై నివేదిక సమర్పించాలని బంగాల్​ ప్రభుత్వాన్ని ఆదేశించింది కేంద్రం.

ఇదీ చూడండి: 'కుతుబ్​ మినార్'​లోని ఆలయాలపై వివాదమేంటి?

భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా బంగాల్ పర్యటన ఉద్రిక్తకరంగా మారింది. కోల్​కతా నుంచి దక్షిణ 24 పరగణాల జిల్లాలోని డైమండ్ హార్బర్​ వైపు వెళ్తుండగా ఆయన వాహనశ్రేణిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాశ్​ విజయవర్గీయ, భాజపా నేత దీపాంజన్​ గుహ కార్లు కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి. మీడియా వాహనాలూ దెబ్బతిన్నాయి. రోడ్లను మూసివేసేందుకు ప్రయత్నించారు దుండగులు. వారిని చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు పోలీసులు.

జేపీ నడ్డా కాన్వాయ్​పై రాళ్ల దాడి

ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు భాజపా జాతీయ అధ్యక్షుడు నడ్డా. ఇది ప్రజాస్వామ్యానికి అవమానమని పేర్కొన్నారు.

Stones hurled at J P Nadda's convoy
ధ్వంసం అయిన కారు అద్దాలు

" మా కాన్వాయ్​లో దాడి జరగని కారు ఒక్కటి కూడా లేదు. నేను బులెట్​ప్రూఫ్​ కార్​లో వెళ్తున్న కారణంగా సురక్షితంగా బయటపడ్డాను. బంగాల్​లో ఈ అన్యాయమైన, అసహన స్థితి ముగియాలి. ముకుల్​ రాయ్​, కైలాశ్​ విజయవర్గీయ గాయపడ్డారు. ఇది ప్రజాస్వామ్యానికి అవమానం. 2021లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని నేను నమ్మకంగా చెప్పగలను. కమలం వికసిస్తుంది. "

- జేపీ నడ్డా, భాజపా జాతీయ అధ్యక్షుడు.

టీఎంసీ కార్యకర్తలే ఈ దాడి చేశారని బంగాల్​ భాజపా అధ్యక్షుడు దిలీప్​ ఘోష్​ ఆరోపించారు. భారత రాజకీయ చరిత్రలో ఇది చీకటి రోజుగా అభివర్ణించారు. బంగాల్​లో మీడియాకు కూడా భద్రత లేదన్నారు. 'ఈ దాడిలో నేను గాయపడ్డాను. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నా. పోలీసులు ఉన్న సమయంలోనే గూండాలు రేచ్చిపోయారు. సొంత దేశంలోనే ఉన్నామా అన్న భావన కలుగుతోంది.' అని పేర్కొన్నారు కైలాశ్ విజయవర్గీయ​.

Stones hurled at J P Nadda's convoy
ధ్వంసం అయిన కారు అద్దాలు
Stones hurled at J P Nadda's convoy
కారులోపల పడిన భారీ రాయి

కేంద్ర హోంశాఖ స్పందన

Stones hurled at J P Nadda's convoy
కారులో పడిన రాయి

నడ్డా పర్యటన సందర్భంగా భద్రతా లోపాలతో ఉద్రిక్త పరిస్థితులు చెలరేగటంపై నివేదిక సమర్పించాలని బంగాల్​ ప్రభుత్వాన్ని ఆదేశించింది కేంద్రం.

ఇదీ చూడండి: 'కుతుబ్​ మినార్'​లోని ఆలయాలపై వివాదమేంటి?

Last Updated : Dec 11, 2020, 12:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.