ETV Bharat / bharat

ఒకే వేదికపై షా, గంగూలీ- ఆ సంగతి చర్చించారా?

author img

By

Published : Dec 28, 2020, 2:20 PM IST

బీసీసీఐ అధ్యక్షుడు, టీమ్​ఇండియా మాజీ కెప్టెన్​ సౌరవ్​ గంగూలీ.. రాజకీయాల్లోకి రావడంపై పలు వార్తలు వస్తున్నాయి. ఆయన భాజపాలో చేరనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కేంద్ర హోం మంత్రి అమిత్​ షాతో దాదా ఈరోజు వేదిక పంచుకోవడం ఈ వార్తలకు బలం చేకూర్చింది.

sourav
ఒకే వేదికపై షా, గంగూలీ- ఆ సంగతి చర్చించారా?

బంగాల్​లో దీదీ (మమతా బెనర్జీ)ని ఎదుర్కొనేందుకు దాదా (గంగూలీ)ని భాజపాలో చేర్చుకుంటున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దాదా ఆదివారం.. బంగాల్​ గవర్నర్​ను కలవడం చర్చనీయాంశమైంది. అయితే ఈరోజు దిల్లీలోని ఫిరోజ్​ షా కోట్ల మైదానంలో జరిగిన కార్యక్రమంలో గంగూలీ.. కేంద్ర హోంమంత్రి అమిత్​ షాతో వేదిక పంచుకున్నారు.

కేంద్ర మాజీ మంత్రి, డీడీసీఏ మాజీ అధ్యక్షుడు అరుణ్​ జైట్లీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం దిల్లీ ఫిరోజ్​ షా కోట్ల మైదానంలో జరిగింది. ఈ కార్యక్రమానికి గంగూలీ కూడా హాజరయ్యారు. రూ.15 లక్షల విలువైన 6 అడుగుల జైట్లీ విగ్రహాన్ని అమిత్​ షా ఆవిష్కరించారు. ఈ నేపథ్యంలో గంగూలీ-షా మధ్య రాజకీయంపై చర్చ జరిగిందా అన్నది ఉత్కంఠ రేకెత్తిస్తోంది.

ఖండించిన గంగూలీ..

అయితే అమిత్ షాతో భేటీ వార్తలను గంగూలీ ఖండించాడు. సదరు కార్యక్రమానికి దిల్లీ వెళ్లే సమయంలో విలేకరులు ప్రశ్నించగా అలాంటిదేం లేదని బదులిచ్చాడు.

సౌరవ్​ గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు

"దిల్లీ క్రికెట్ అసోసియేషన్​కు సంబంధించిన కార్యక్రమానికి నేను హాజరవుతున్నాను. అమిత్​ షాతో ఎలాంటి భేటీ లేదు."

- సౌరవ్​ గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు

గవర్నర్​ను కలవడంపై..

బంగాల్​ గవర్నర్​ను కలిసిన విషయంపైనా గంగూలీ స్పందిచాడు. భేటీని రాజకీయ కోణంలో చూడద్దని అన్నాడు.

"గవర్నర్​ మిమ్మల్ని కలవాలి అనుకుంటే మీరు వెళ్లాల్సిందే. కనుక ఈ విషయాన్ని అలానే వదిలేస్తే మంచిది."

- సౌరవ్​ గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు

2019లో గంగూలీ.. అమిత్​షాతో సమావేశం కావడంపై అప్పట్లో పెద్ద చర్చే నడిచింది. 2021 అసెంబ్లీ ఎన్నికల కోసం గంగూలీని పార్టీలోకి అమిత్​ షా ఆహ్వానించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలను అప్పుడే గంగూలీ ఖండించాడు. ప్రస్తుతం అమిత్​ షా కుమారుడు జై షా బీసీసీఐ కార్యదర్శిగా ఉండటం గమనార్హం. కేంద్ర మంత్రి అనురాగ్​ ఠాకూర్​ సోదరుడు అరుణ్​ ధుమాల్​ బీసీసీఐ కోశాధికారిగా ఉన్నారు.

గంగూలీ వస్తే స్వాగతిస్తాం..

గంగూలీ భాజపాలోకి వస్తే స్వాగతిస్తామని 2019లో ఆ పార్టీ బంగాల్​ అధ్యక్షుడు దిలీప్​ ఘోష్​ అన్నారు. ఆయన చేరిక పార్టీకి మరింత బలం తెస్తుందని చెప్పారు.

బంగాల్​లో దీదీ (మమతా బెనర్జీ)ని ఎదుర్కొనేందుకు దాదా (గంగూలీ)ని భాజపాలో చేర్చుకుంటున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దాదా ఆదివారం.. బంగాల్​ గవర్నర్​ను కలవడం చర్చనీయాంశమైంది. అయితే ఈరోజు దిల్లీలోని ఫిరోజ్​ షా కోట్ల మైదానంలో జరిగిన కార్యక్రమంలో గంగూలీ.. కేంద్ర హోంమంత్రి అమిత్​ షాతో వేదిక పంచుకున్నారు.

కేంద్ర మాజీ మంత్రి, డీడీసీఏ మాజీ అధ్యక్షుడు అరుణ్​ జైట్లీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం దిల్లీ ఫిరోజ్​ షా కోట్ల మైదానంలో జరిగింది. ఈ కార్యక్రమానికి గంగూలీ కూడా హాజరయ్యారు. రూ.15 లక్షల విలువైన 6 అడుగుల జైట్లీ విగ్రహాన్ని అమిత్​ షా ఆవిష్కరించారు. ఈ నేపథ్యంలో గంగూలీ-షా మధ్య రాజకీయంపై చర్చ జరిగిందా అన్నది ఉత్కంఠ రేకెత్తిస్తోంది.

ఖండించిన గంగూలీ..

అయితే అమిత్ షాతో భేటీ వార్తలను గంగూలీ ఖండించాడు. సదరు కార్యక్రమానికి దిల్లీ వెళ్లే సమయంలో విలేకరులు ప్రశ్నించగా అలాంటిదేం లేదని బదులిచ్చాడు.

సౌరవ్​ గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు

"దిల్లీ క్రికెట్ అసోసియేషన్​కు సంబంధించిన కార్యక్రమానికి నేను హాజరవుతున్నాను. అమిత్​ షాతో ఎలాంటి భేటీ లేదు."

- సౌరవ్​ గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు

గవర్నర్​ను కలవడంపై..

బంగాల్​ గవర్నర్​ను కలిసిన విషయంపైనా గంగూలీ స్పందిచాడు. భేటీని రాజకీయ కోణంలో చూడద్దని అన్నాడు.

"గవర్నర్​ మిమ్మల్ని కలవాలి అనుకుంటే మీరు వెళ్లాల్సిందే. కనుక ఈ విషయాన్ని అలానే వదిలేస్తే మంచిది."

- సౌరవ్​ గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు

2019లో గంగూలీ.. అమిత్​షాతో సమావేశం కావడంపై అప్పట్లో పెద్ద చర్చే నడిచింది. 2021 అసెంబ్లీ ఎన్నికల కోసం గంగూలీని పార్టీలోకి అమిత్​ షా ఆహ్వానించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలను అప్పుడే గంగూలీ ఖండించాడు. ప్రస్తుతం అమిత్​ షా కుమారుడు జై షా బీసీసీఐ కార్యదర్శిగా ఉండటం గమనార్హం. కేంద్ర మంత్రి అనురాగ్​ ఠాకూర్​ సోదరుడు అరుణ్​ ధుమాల్​ బీసీసీఐ కోశాధికారిగా ఉన్నారు.

గంగూలీ వస్తే స్వాగతిస్తాం..

గంగూలీ భాజపాలోకి వస్తే స్వాగతిస్తామని 2019లో ఆ పార్టీ బంగాల్​ అధ్యక్షుడు దిలీప్​ ఘోష్​ అన్నారు. ఆయన చేరిక పార్టీకి మరింత బలం తెస్తుందని చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.