ETV Bharat / bharat

అవిభక్త కవలలను విజయవంతంగా వేరు చేసిన వైద్యులు

author img

By

Published : Nov 11, 2020, 4:31 PM IST

లఖ్​నవూ కింగ్​ జార్జ్​ మెడికల్​ యూనివర్సిటీ వైద్యులు ఓ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. సయామీ కవలలను దిగ్విజయంగా విడదీశారు. ప్రస్తుతం వైద్య పర్యవేక్షణలో ఉన్న ఆ శిశువుల ఆరోగ్యం బాగుందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

Siamese twins separated in Lucknow hospital
అవిభక్త కవలలను విజయవంతంగా వేరు చేసిన వైద్యులు

ఉత్తర్​ప్రదేశ్​ లఖ్​నవూలోని కింగ్​ జార్జ్​ మెడికల్​ విశ్వ విద్యాలయం(కేజీఎంయూ) వైద్యులు 9 గంటల సుదీర్ఘ ఆపరేషన్​ అనంతరం.. అవిభక్త కవలను విజయవంతంగా వేరు చేశారు. కేజీఎంయూ చరిత్రలో ఇలాంటి శస్త్ర చికిత్స జరగడం ఇదే తొలిసారి.

అప్పుడే అసలు పరీక్ష!

శస్త్ర చికిత్స జరిగాక మంగళవారం ఉదయం ఇరువురు శిశువులూ బాగా స్పందిస్తున్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆ చిన్నారులు వైద్య పర్యవేక్షణలో ఉన్నారు. అయితే.. వారు ఆహారాన్ని తీసుకోవడం, జీర్ణించుకోవడం వంటి వాటితో వారికి అసలైన పరీక్ష ఎదురుకానున్నట్టు తెలుస్తోంది.

ఏడాది తర్వాత..

గతేడాది నవంబర్​లో ఖుషీనగర్​ జిల్లాలో ఓ జంటకు ఈ అవిభక్త కవలలు జన్మించారు. రెండు కాలేయాలతో సహా.. ఎపికార్డియం(గుండె వెలుపలి పొర), చాతీ, ఆహారనాళం వంటివి కూడా కొంతమేర కలిశాయి.

ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో సయామీ కవలలతో కొద్ది నెలల క్రితం కేజీఎంయూకు వచ్చారు తల్లిదండ్రులు. వారిని పరిశీలించిన ఆసుపత్రి పీడియాట్రిక్​ సర్జరీ విభాగం.. పిల్లలకు ఏడాది గడిచాకే శస్త్రచికిత్స సాధ్యపడుతుందని చెప్పారు. అనుకున్నట్టే సరిగ్గా సంవత్సరం తర్వాత సర్జరీ చేసి విజయవంతంగా విడదీశారు.

ఇదీ చదవండి: 'టీకా​ పంపిణీకి కార్యాచరణ ప్రణాళిక ఏంటి?'

ఉత్తర్​ప్రదేశ్​ లఖ్​నవూలోని కింగ్​ జార్జ్​ మెడికల్​ విశ్వ విద్యాలయం(కేజీఎంయూ) వైద్యులు 9 గంటల సుదీర్ఘ ఆపరేషన్​ అనంతరం.. అవిభక్త కవలను విజయవంతంగా వేరు చేశారు. కేజీఎంయూ చరిత్రలో ఇలాంటి శస్త్ర చికిత్స జరగడం ఇదే తొలిసారి.

అప్పుడే అసలు పరీక్ష!

శస్త్ర చికిత్స జరిగాక మంగళవారం ఉదయం ఇరువురు శిశువులూ బాగా స్పందిస్తున్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆ చిన్నారులు వైద్య పర్యవేక్షణలో ఉన్నారు. అయితే.. వారు ఆహారాన్ని తీసుకోవడం, జీర్ణించుకోవడం వంటి వాటితో వారికి అసలైన పరీక్ష ఎదురుకానున్నట్టు తెలుస్తోంది.

ఏడాది తర్వాత..

గతేడాది నవంబర్​లో ఖుషీనగర్​ జిల్లాలో ఓ జంటకు ఈ అవిభక్త కవలలు జన్మించారు. రెండు కాలేయాలతో సహా.. ఎపికార్డియం(గుండె వెలుపలి పొర), చాతీ, ఆహారనాళం వంటివి కూడా కొంతమేర కలిశాయి.

ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో సయామీ కవలలతో కొద్ది నెలల క్రితం కేజీఎంయూకు వచ్చారు తల్లిదండ్రులు. వారిని పరిశీలించిన ఆసుపత్రి పీడియాట్రిక్​ సర్జరీ విభాగం.. పిల్లలకు ఏడాది గడిచాకే శస్త్రచికిత్స సాధ్యపడుతుందని చెప్పారు. అనుకున్నట్టే సరిగ్గా సంవత్సరం తర్వాత సర్జరీ చేసి విజయవంతంగా విడదీశారు.

ఇదీ చదవండి: 'టీకా​ పంపిణీకి కార్యాచరణ ప్రణాళిక ఏంటి?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.