ETV Bharat / bharat

' 'నేషన్​ ఫస్ట్​.. ఆల్వేస్​ ఫస్ట్' మంత్రంతో ముందుకు'

author img

By

Published : Jul 25, 2021, 11:37 AM IST

Updated : Jul 25, 2021, 1:37 PM IST

టోక్యో ఒలింపిక్స్​లో భారత అథ్లెట్లకు సామాజిక మాధ్యమాల ద్వారా మద్దతు తెలపాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. మనసులో మాట 79వ ఎడిషన్​లో భాగంగా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు మోదీ. కార్గిల్​ యుద్ధంతో భారత సైన్యం శక్తిసామర్థ్యాలు ప్రపంచానికి తెలిశాయన్నారు.

PM Modi
ప్రధాని మోదీ

స్వాతంత్ర్యం సాధించి ఈ ఏడాది 75వ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్న తరుణంలో భారతీయులంతా 'నేషన్​ ఫస్ట్​.. ఆల్వేస్​ ఫస్ట్' అనే మంత్రంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. మనసులో మాట 79వ ఎడిషన్​లో భాగంగా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు మోదీ. సోమవారం జరగనున్న కార్గిల్‌ దినోత్సవాన్ని ప్రస్తావించారు.

ముప్పు ఇంకా తొలగలేదు..

కార్గిల్‌ విజయం భారత సైనికుల శౌర్య పరాక్రమాలకు ప్రతీకగా నిలుస్తుందని మోదీ అన్నారు. ప్రస్తుత పండుగలు, పర్వదినాల కాలంలో ప్రజలంతా.. కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదు అనే విషయాన్ని మరచిపోవద్దని సూచించారు. టోక్యో ఒలింపిక్స్‌ ప్రారంభ వేడుకల్లో భారత క్రీడాకారులు త్రివర్ణ పతకాన్ని చేత బూని నడుస్తూ ఉంటే తాను మాత్రమే కాకుండా ప్రతి ఒక్క భారతీయుడు ఉప్పొంగిపోయారని, వారికి విజయం లభించాలని అంతా కోరుకోవాలని ప్రధాని సూచించారు. భిన్న సంస్కృతులు, ఆచారాలకు నిలయమైన భారత్‌ను ఏకం చేసేందుకు జాతి పిత మహాత్మాగాంధీని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్క భారతీయుడు ముందుండి నాయకత్వం వహించాలని మోదీ పిలుపునిచ్చారు.

విక్టరీ పంచ్..

PM Modi at 'Mann Ki Baat'
విక్టరీ పంచ్ కార్యక్రమం

టోక్యో ఒలింపిక్స్​లో భారత అథ్లెట్లకు సామాజిక మాధ్యమాల ద్వారా మద్దతు తెలపాలని సూచించారు. ఆటగాళ్లకు మద్దతిచ్చేందుకు 'విక్టరీ పంచ్' కార్యక్రమం ఇప్పటికే ప్రారంభమైందన్నారు. అందరూ విక్టరీ పంచ్​​ను షేర్​ చేయాలని సూచించారు.

సోమవారం కార్గిల్ దివస్ సందర్భంగా.. జవాన్ల త్యాగాలను స్మరించుకోవాలన్నారు ప్రధాని. కార్గిల్​ యుద్ధంతో భారత సైన్యం శక్తిసామర్థ్యాలు ప్రపంచానికి తెలిశాయన్నారు. యుద్ధంలో వీరమరణం పొందిన జవాన్​లకు నివాళులు అర్పించారు. మన్​ కీ బాత్​ కార్యక్రమాన్ని అత్యధికంగా యువత వినటంపై హర్షం వ్యక్తం చేశారు.

"కార్గిల్​ యుద్ధంతో భారత సైన్యం శక్తిసామర్థ్యాలు ప్రపంచానికి తెలిశాయి. యుద్ధంలో వీరమరణం పొందిన జవాన్​లకు మనం నివాళులు అర్పించాలి. మన్​ కీ బాత్​ కార్యక్రమాన్ని అత్యధికంగా యువతే వింటున్నారు."

-- ప్రధాని నరేంద్ర మోదీ

వివిధ రంగాల్లో.. విశేష కృషి చేసిన సామాన్య ప్రజలను మోదీ ప్రశంసించారు.

ఇంజినీర్​ కం రైతు..

PM Modi at 'Mann Ki Baat'
ఆపిల్ సాగులో యువ ఇంజినీర్

మణిపుర్​కు చెందిన ఎరోనాటికల్ ఇంజినీర్​ టీఎస్ రింగ్​ఫమీ.. యాపిల్ సాగు చేస్తూ.. రైతులకు ఆ సేద్యంలో మెలకువలు నేర్పించటాన్ని మోదీ ప్రశంసించారు.

వ్యాక్సిన్​ తీసుకుంటే పూరీ ఫ్రీ..

PM Modi at 'Mann Ki Baat'
వ్యాక్సిన్ తీసుకుంటే పూరీ ఫ్రీ

చండీగఢ్​కు చెందిన ఓ చిరు వ్యాపారి.. కొవిడ్​ వ్యాక్సిన్​ తీసుకున్నవారికి సైకిల్​పై తిరుగుతూ.. ఉచితంగా పూరీలు ఇవ్వటాన్ని మోదీ కొనియాడారు.

కూలీ నుంచి యూట్యూబ్ స్టార్..

PM Modi at 'Mann Ki Baat'
కూలీ నుంచి యూట్యూబర్​ వరకు
PM Modi at 'Mann Ki Baat'
యూట్యూబ్ స్టార్

ఒడిశాకు చెందిన ఐసాక్ ముందా ఓ కూలీ. కానీ ఇప్పుడు యూట్యూబ్​లో స్టార్​గా మారాడు. వివిధ రకాల వంటలు, పల్లె జీవితంపై వీడియోలు తీస్తూ.. అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ క్రమంలో ముందాకు.. ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు.

సులభతరంగా ప్రయాణం..

PM Modi at 'Mann Ki Baat'
ఆరోగ్య సేవలో..

కొండ ప్రాంతాల్లోని ప్రజలు సులభంగా ఆస్పత్రులకు వెళ్లేందుకు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు తమిళనాడు, నీలగిరికి చెందిన రాధిక శాస్త్రి. బంధువుల నుంచి విరాళాలను సేకరించి.. చిన్న ఆటోల ద్వారా సేవలను ప్రారంభించారు. ఆమె సేవలను ప్రధాని మోదీ కొనియాడారు.

ఇదీ చదవండి: వయసే భారమా?.. నిష్కృమణ తప్పదా?

స్వాతంత్ర్యం సాధించి ఈ ఏడాది 75వ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్న తరుణంలో భారతీయులంతా 'నేషన్​ ఫస్ట్​.. ఆల్వేస్​ ఫస్ట్' అనే మంత్రంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. మనసులో మాట 79వ ఎడిషన్​లో భాగంగా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు మోదీ. సోమవారం జరగనున్న కార్గిల్‌ దినోత్సవాన్ని ప్రస్తావించారు.

ముప్పు ఇంకా తొలగలేదు..

కార్గిల్‌ విజయం భారత సైనికుల శౌర్య పరాక్రమాలకు ప్రతీకగా నిలుస్తుందని మోదీ అన్నారు. ప్రస్తుత పండుగలు, పర్వదినాల కాలంలో ప్రజలంతా.. కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదు అనే విషయాన్ని మరచిపోవద్దని సూచించారు. టోక్యో ఒలింపిక్స్‌ ప్రారంభ వేడుకల్లో భారత క్రీడాకారులు త్రివర్ణ పతకాన్ని చేత బూని నడుస్తూ ఉంటే తాను మాత్రమే కాకుండా ప్రతి ఒక్క భారతీయుడు ఉప్పొంగిపోయారని, వారికి విజయం లభించాలని అంతా కోరుకోవాలని ప్రధాని సూచించారు. భిన్న సంస్కృతులు, ఆచారాలకు నిలయమైన భారత్‌ను ఏకం చేసేందుకు జాతి పిత మహాత్మాగాంధీని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్క భారతీయుడు ముందుండి నాయకత్వం వహించాలని మోదీ పిలుపునిచ్చారు.

విక్టరీ పంచ్..

PM Modi at 'Mann Ki Baat'
విక్టరీ పంచ్ కార్యక్రమం

టోక్యో ఒలింపిక్స్​లో భారత అథ్లెట్లకు సామాజిక మాధ్యమాల ద్వారా మద్దతు తెలపాలని సూచించారు. ఆటగాళ్లకు మద్దతిచ్చేందుకు 'విక్టరీ పంచ్' కార్యక్రమం ఇప్పటికే ప్రారంభమైందన్నారు. అందరూ విక్టరీ పంచ్​​ను షేర్​ చేయాలని సూచించారు.

సోమవారం కార్గిల్ దివస్ సందర్భంగా.. జవాన్ల త్యాగాలను స్మరించుకోవాలన్నారు ప్రధాని. కార్గిల్​ యుద్ధంతో భారత సైన్యం శక్తిసామర్థ్యాలు ప్రపంచానికి తెలిశాయన్నారు. యుద్ధంలో వీరమరణం పొందిన జవాన్​లకు నివాళులు అర్పించారు. మన్​ కీ బాత్​ కార్యక్రమాన్ని అత్యధికంగా యువత వినటంపై హర్షం వ్యక్తం చేశారు.

"కార్గిల్​ యుద్ధంతో భారత సైన్యం శక్తిసామర్థ్యాలు ప్రపంచానికి తెలిశాయి. యుద్ధంలో వీరమరణం పొందిన జవాన్​లకు మనం నివాళులు అర్పించాలి. మన్​ కీ బాత్​ కార్యక్రమాన్ని అత్యధికంగా యువతే వింటున్నారు."

-- ప్రధాని నరేంద్ర మోదీ

వివిధ రంగాల్లో.. విశేష కృషి చేసిన సామాన్య ప్రజలను మోదీ ప్రశంసించారు.

ఇంజినీర్​ కం రైతు..

PM Modi at 'Mann Ki Baat'
ఆపిల్ సాగులో యువ ఇంజినీర్

మణిపుర్​కు చెందిన ఎరోనాటికల్ ఇంజినీర్​ టీఎస్ రింగ్​ఫమీ.. యాపిల్ సాగు చేస్తూ.. రైతులకు ఆ సేద్యంలో మెలకువలు నేర్పించటాన్ని మోదీ ప్రశంసించారు.

వ్యాక్సిన్​ తీసుకుంటే పూరీ ఫ్రీ..

PM Modi at 'Mann Ki Baat'
వ్యాక్సిన్ తీసుకుంటే పూరీ ఫ్రీ

చండీగఢ్​కు చెందిన ఓ చిరు వ్యాపారి.. కొవిడ్​ వ్యాక్సిన్​ తీసుకున్నవారికి సైకిల్​పై తిరుగుతూ.. ఉచితంగా పూరీలు ఇవ్వటాన్ని మోదీ కొనియాడారు.

కూలీ నుంచి యూట్యూబ్ స్టార్..

PM Modi at 'Mann Ki Baat'
కూలీ నుంచి యూట్యూబర్​ వరకు
PM Modi at 'Mann Ki Baat'
యూట్యూబ్ స్టార్

ఒడిశాకు చెందిన ఐసాక్ ముందా ఓ కూలీ. కానీ ఇప్పుడు యూట్యూబ్​లో స్టార్​గా మారాడు. వివిధ రకాల వంటలు, పల్లె జీవితంపై వీడియోలు తీస్తూ.. అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ క్రమంలో ముందాకు.. ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు.

సులభతరంగా ప్రయాణం..

PM Modi at 'Mann Ki Baat'
ఆరోగ్య సేవలో..

కొండ ప్రాంతాల్లోని ప్రజలు సులభంగా ఆస్పత్రులకు వెళ్లేందుకు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు తమిళనాడు, నీలగిరికి చెందిన రాధిక శాస్త్రి. బంధువుల నుంచి విరాళాలను సేకరించి.. చిన్న ఆటోల ద్వారా సేవలను ప్రారంభించారు. ఆమె సేవలను ప్రధాని మోదీ కొనియాడారు.

ఇదీ చదవండి: వయసే భారమా?.. నిష్కృమణ తప్పదా?

Last Updated : Jul 25, 2021, 1:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.