ETV Bharat / bharat

బద్రీనాథ్​, కేదార్​నాథ్​ ఆలయాలు తెరిచేందుకు సర్వం సిద్ధం

ఉత్తర భారతదేశంలోని ప్రముఖ ఆలయాలైన బద్రీనాథ్​, కేదార్​నాథ్​ ఆలయాల తలుపులు తెరిచేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. వేదమంత్రాలు, ప్రత్యేక పూజల నడుమ సోమవారం(ఈ నెల 17న) ఉదయం కేదార్​నాథ్​ ఆలయం తెరుచుకోనుండగా.. బద్రీనాథ్​లో ఒకరోజు ఆలస్యంగా(ఈ నెల 18 నుంచి) పూజలు ప్రారంభం కానున్నాయి.

author img

By

Published : May 16, 2021, 9:43 PM IST

Badrinath Temple
బద్రీనాథ్​ ఆలయం

ఉత్తరాఖండ్​లోని బద్రీనాథ్​ ధామ్​ పుణ్యక్షేత్రాన్ని ఈ నెల 18న పునఃప్రారంభించనున్నారు అధికారులు. వేద మంత్రాలు, ఆచార సంప్రదాయాల నడుమ మంగళవారం (18న) సాయంత్రం 4:15 గంటలకు ప్రధాన ఆలయ తలుపులు తెరుచుకోనున్నాయి. ఈ మేరకు సోమవారం ఉదయం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు.

Badrinath Temple
బద్రీనాథ్​ ఆలయం
Badrinath
బద్రీనాథ్​లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న పండితులు

ప్రధాన ఆలయ తలుపులు తెరుచుకోనున్న సందర్భంగా.. కరోనా నేపథ్యంలో కేవలం 50 మందికి మాత్రమే ప్రవేశం ఉంది. దేశంలో కొవిడ్​ మహమ్మారిని అంతమొందించాలని కోరుతూ.. స్వామివారికి ప్రార్థనలు చేయనున్నట్టు బద్రీనాథ్​ ధామ్ పూజారి భువన చంద్ర ఉనియల్​ తెలిపారు.

కేదార్​నాథ్​లోనూ..

రుద్రప్రయాగ్​లోని కేదార్​నాథ్​ ఆలయాన్ని తెరిచేందుకు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. వేద మంత్రాలు, ప్రత్యేక పూజల మధ్య.. సోమవారం ఉదయం 5 గంటలకు ఆలయ తలుపులు తెరవనున్నట్టు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా.. స్వామి వారిని సుమారు 11 క్వింటాళ్ల పూలతో అలంకరించారు. ఆలయ ప్రముఖులు రావల్​ భీమాశంకర్​ లింగ్​, జిల్లా మేజిస్ట్రేట్​ మనుజ్​ గోయల్ తదితరులు​ పూజలో పాల్గొననున్నారు.

Kedaranath
కేదార్​నాథ్​ ఆలయం

కరోనా వ్యాప్తి నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే పూజారులు, యాత్రికులకు అవకాశం కల్పిస్తున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి: వెంబడించిన పోలీసులు- నదిలో దూకి పరార్​!

ఉత్తరాఖండ్​లోని బద్రీనాథ్​ ధామ్​ పుణ్యక్షేత్రాన్ని ఈ నెల 18న పునఃప్రారంభించనున్నారు అధికారులు. వేద మంత్రాలు, ఆచార సంప్రదాయాల నడుమ మంగళవారం (18న) సాయంత్రం 4:15 గంటలకు ప్రధాన ఆలయ తలుపులు తెరుచుకోనున్నాయి. ఈ మేరకు సోమవారం ఉదయం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు.

Badrinath Temple
బద్రీనాథ్​ ఆలయం
Badrinath
బద్రీనాథ్​లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న పండితులు

ప్రధాన ఆలయ తలుపులు తెరుచుకోనున్న సందర్భంగా.. కరోనా నేపథ్యంలో కేవలం 50 మందికి మాత్రమే ప్రవేశం ఉంది. దేశంలో కొవిడ్​ మహమ్మారిని అంతమొందించాలని కోరుతూ.. స్వామివారికి ప్రార్థనలు చేయనున్నట్టు బద్రీనాథ్​ ధామ్ పూజారి భువన చంద్ర ఉనియల్​ తెలిపారు.

కేదార్​నాథ్​లోనూ..

రుద్రప్రయాగ్​లోని కేదార్​నాథ్​ ఆలయాన్ని తెరిచేందుకు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. వేద మంత్రాలు, ప్రత్యేక పూజల మధ్య.. సోమవారం ఉదయం 5 గంటలకు ఆలయ తలుపులు తెరవనున్నట్టు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా.. స్వామి వారిని సుమారు 11 క్వింటాళ్ల పూలతో అలంకరించారు. ఆలయ ప్రముఖులు రావల్​ భీమాశంకర్​ లింగ్​, జిల్లా మేజిస్ట్రేట్​ మనుజ్​ గోయల్ తదితరులు​ పూజలో పాల్గొననున్నారు.

Kedaranath
కేదార్​నాథ్​ ఆలయం

కరోనా వ్యాప్తి నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే పూజారులు, యాత్రికులకు అవకాశం కల్పిస్తున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి: వెంబడించిన పోలీసులు- నదిలో దూకి పరార్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.