ETV Bharat / bharat

నేడు తమిళనాడు, పుదుచ్చేరిలో అమిత్​ షా పర్యటన

author img

By

Published : Feb 28, 2021, 5:20 AM IST

నేడు తమిళనాడు, పుదుచ్చేరిలో కేంద్ర హోం మంత్రి అమిత్​ షా పర్యటించనున్నారు. అక్కడి ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. మండల స్థాయి భాజపా కార్యకర్తలతోనూ ఆయన సమావేశమవనున్నారు.

Shah to visit poll-bound Puducherry, Tamil Nadu on Sunday
నేడు తమిళనాడు, పుదుచ్చేరిలో అమిత్​ షా పర్యటన

త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తమిళనాడు, పుదుచ్చేరిలో కేంద్ర హోం మంత్రి, భాజపా సీనియర్​ నేత అమిత్​ షా.. ఆదివారం పర్యటించనున్నారు. భాజపా ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

శనివారం రాత్రి 10:45 గంటలకు చెన్నై చేరుకున్న అమిత్​ షా.. ఆదివారం వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారని భాజపా ఎంపీ, మీడియా ఇన్​ఛార్జ్​ అనిల్​ బలౌనీ తెలిపారు. పుదుచ్చేరిలోని కరైకల్​లో భాజపా కోర్​ కమిటీ సమావేశానికి షా హాజరవుతారని చెప్పారు.

"పుదుచ్చేరి కోర్​ కమిటీ సమావేశం అనంతరం కరైకల్​లో బహిరంగ సభకు అమిత్​ షా హాజరవుతారు. మధ్యాహ్నం అక్కడి మండల స్థాయి పార్టీ కార్యకర్తలతో షా సమావేశమవుతారు. పుదుచ్చేరి నుంచి తమిళనాడులోని విల్లాపురానికి షా చేరుకుని, తీవనై మహిళా కళాశాల వద్ద భాజపా కోర్ కమిటీ సమావేశంలో పాల్గొంటారు.​"

--అనిల్​ బలౌనీ, తమిళనాడు భాజపా మీడియా ఇన్​ఛార్జ్​

సాయంత్రం విల్లాపురం, జానకీపురంలో 'విజయ్​ సంకల్ప్ యాత్ర'లో షా పాల్గొననున్నారు. అనంతరం.. తమిళనాడు భాజపా మండల స్థాయి కార్యకర్తలతో షా సమావేశమవుతారని బలౌనీ చెప్పారు.

ఇదీ చదవండి:ప్రధాని సొంతూరిలో స్థానిక​ సమరానికి సై

త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తమిళనాడు, పుదుచ్చేరిలో కేంద్ర హోం మంత్రి, భాజపా సీనియర్​ నేత అమిత్​ షా.. ఆదివారం పర్యటించనున్నారు. భాజపా ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

శనివారం రాత్రి 10:45 గంటలకు చెన్నై చేరుకున్న అమిత్​ షా.. ఆదివారం వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారని భాజపా ఎంపీ, మీడియా ఇన్​ఛార్జ్​ అనిల్​ బలౌనీ తెలిపారు. పుదుచ్చేరిలోని కరైకల్​లో భాజపా కోర్​ కమిటీ సమావేశానికి షా హాజరవుతారని చెప్పారు.

"పుదుచ్చేరి కోర్​ కమిటీ సమావేశం అనంతరం కరైకల్​లో బహిరంగ సభకు అమిత్​ షా హాజరవుతారు. మధ్యాహ్నం అక్కడి మండల స్థాయి పార్టీ కార్యకర్తలతో షా సమావేశమవుతారు. పుదుచ్చేరి నుంచి తమిళనాడులోని విల్లాపురానికి షా చేరుకుని, తీవనై మహిళా కళాశాల వద్ద భాజపా కోర్ కమిటీ సమావేశంలో పాల్గొంటారు.​"

--అనిల్​ బలౌనీ, తమిళనాడు భాజపా మీడియా ఇన్​ఛార్జ్​

సాయంత్రం విల్లాపురం, జానకీపురంలో 'విజయ్​ సంకల్ప్ యాత్ర'లో షా పాల్గొననున్నారు. అనంతరం.. తమిళనాడు భాజపా మండల స్థాయి కార్యకర్తలతో షా సమావేశమవుతారని బలౌనీ చెప్పారు.

ఇదీ చదవండి:ప్రధాని సొంతూరిలో స్థానిక​ సమరానికి సై

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.