ETV Bharat / bharat

పెగాసస్​పై నయా రాజకీయం- కాంగ్రెస్​ దూరం!

వివాదాస్పద రైతు చట్టాలు, పెగాసస్​ ఫోన్​ ట్యాపింగ్​ వ్యవహారంపై పార్లమెంట్​లో చర్చ జరిగేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​కు విపక్షాలు లేఖ రాశాయి.

author img

By

Published : Jul 27, 2021, 6:35 PM IST

Updated : Jul 27, 2021, 7:09 PM IST

letter to president
రాష్ట్రపతికి విపక్షాల లేఖ

రైతుల సమస్యలు, పెగాసస్ ఫోన్ ట్యాపింగ్ వంటి వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాలని కాంగ్రెస్​ మినహా ఏడు విపక్ష పార్టీలు రాష్ట్రపతిని కోరాయి. ఆయా అంశాలపై పార్లమెంటులో చర్చించాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించాలని విజ్ఞప్తి చేస్తూ రామ్​నాథ్​ కోవింద్​కు లేఖ రాశాయి. పార్లమెంటు నియమనిబంధనలు, భారత రాజ్యాంగం గౌరవాన్ని కాపాడేందుకు ఈమేరకు చొరవ చూపాలని అభ్యర్థించాయి.

బీఎస్​పీ, ఆర్​ఎల్​పీ, ఎస్​ఏడీ, నేషనల్​ కాన్ఫరెన్స్​, సీపీఐ, సీపీఎంతో పాటు ఎన్​సీపీకి సంబంధించిన నేతలు లేఖపై సంతకాలు చేశారు. అయితే పార్లమెంట్​లో కీలక పార్టీలైన కాంగ్రెస్​, తృణమూల్​ కాంగ్రెస్​ ఈ కూటమికి దూరంగా ఉండడం గమనార్హం.

"కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు మరణించడం చాలా దురదృష్టకరం. అయినా కేంద్రం వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై చర్చించకపోవడం దారుణం. వాటిని వెంటనే వెనక్కి తీసుకోవాలని రాష్ట్రపతిని కోరాం"

- హర్​ సిమ్రత్ కౌర్ బాదల్, శిరోమణి అకాలీ దళ్​ నాయకురాలు

ఇదీ చూడండి : 'పెగాసస్​ను కేంద్రం ఉపయోగించిందా? లేదా?'

రైతుల సమస్యలు, పెగాసస్ ఫోన్ ట్యాపింగ్ వంటి వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాలని కాంగ్రెస్​ మినహా ఏడు విపక్ష పార్టీలు రాష్ట్రపతిని కోరాయి. ఆయా అంశాలపై పార్లమెంటులో చర్చించాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించాలని విజ్ఞప్తి చేస్తూ రామ్​నాథ్​ కోవింద్​కు లేఖ రాశాయి. పార్లమెంటు నియమనిబంధనలు, భారత రాజ్యాంగం గౌరవాన్ని కాపాడేందుకు ఈమేరకు చొరవ చూపాలని అభ్యర్థించాయి.

బీఎస్​పీ, ఆర్​ఎల్​పీ, ఎస్​ఏడీ, నేషనల్​ కాన్ఫరెన్స్​, సీపీఐ, సీపీఎంతో పాటు ఎన్​సీపీకి సంబంధించిన నేతలు లేఖపై సంతకాలు చేశారు. అయితే పార్లమెంట్​లో కీలక పార్టీలైన కాంగ్రెస్​, తృణమూల్​ కాంగ్రెస్​ ఈ కూటమికి దూరంగా ఉండడం గమనార్హం.

"కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు మరణించడం చాలా దురదృష్టకరం. అయినా కేంద్రం వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై చర్చించకపోవడం దారుణం. వాటిని వెంటనే వెనక్కి తీసుకోవాలని రాష్ట్రపతిని కోరాం"

- హర్​ సిమ్రత్ కౌర్ బాదల్, శిరోమణి అకాలీ దళ్​ నాయకురాలు

ఇదీ చూడండి : 'పెగాసస్​ను కేంద్రం ఉపయోగించిందా? లేదా?'

Last Updated : Jul 27, 2021, 7:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.