ETV Bharat / bharat

'సీబీఐని ఇన్​ఛార్జితో నడపలేరు'

author img

By

Published : Apr 6, 2021, 5:13 AM IST

సీబీఐ డైరెక్టర్ నియామకం కోసం మే 2 లోగా అత్యున్నతస్థాయి సంఘం సమావేశం కావాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది సుప్రీంకోర్టు. అయితే మే రెండు తర్వాత ఈ సంఘం భేటీ అవుతుందని కేంద్రం తెలిపింది.

meeting of committee for appointing CBI Director
సీబీఐని ఇన్​ఛార్జితో నడపలేరు: సుప్రీంకోర్టు

కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) డైరెక్టర్​ను నియమించే విషయమై మే 2 లోపు అత్యున్నతస్థాయి సంఘం సమావేశం నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది. ఈ సంస్థను ఇన్​ఛార్జి డైరెక్టరుతో నడిపించలేరని వ్యాఖ్యానించింది.

సీబీఐకి పూర్తికాల డైరెక్టర్​ను నియమించకపోవడంపై 'కామన్​ కాజ్' అనే సంస్థ దావా వేసింది. దీనిని జస్టిస్ ఎల్. నాగేశ్వరరావు, జస్టిస్ వినీత్​ శరణ్​లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్​ తరఫు న్యాయవాది ప్రశాంత్ భూషణ్​ వాదనలు వినిపించారు.

మే 2 తర్వాతే..

ప్రధాన మంత్రి, ప్రతిపక్ష నేత, ప్రధాన న్యాయమూర్తి లేదా సుప్రీంకోర్టు జడ్జితో కూడిన అత్యున్నతస్థాయి సంఘం సీబీఐ డైరెక్టర్​ను ఎంపిక చేస్తుంది. మే 2 తర్వాత ఈ కమిటీ సమావేశమవుతుందని ధర్మాసనానికి కేంద్రం తెలిపింది.

ఉద్దేశ్వపూర్వకంగానే..

జస్టిస్ ఎస్​.ఏ బోబ్డే ఈ నెల 23న పదవీ విరమణ చేయనున్నారని, ఆయన ఉండగా భేటీ జరగకూడదన్న ఉద్దేశంతోనే ఆలస్యం చేస్తున్నారని ప్రశాంత్ భూషణ్ ఆరోపించారు. దీన్ని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఖండించారు.

ఈ కేసుపై తదుపరి విచారణను ధర్మాసనం ఈ నెల 16కు వాయిదా వేసింది.

ఇదీ చదవండి: మావోయిస్టులపై పోరులో జవాన్లకు అండగా ఉంటాం: షా

కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) డైరెక్టర్​ను నియమించే విషయమై మే 2 లోపు అత్యున్నతస్థాయి సంఘం సమావేశం నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది. ఈ సంస్థను ఇన్​ఛార్జి డైరెక్టరుతో నడిపించలేరని వ్యాఖ్యానించింది.

సీబీఐకి పూర్తికాల డైరెక్టర్​ను నియమించకపోవడంపై 'కామన్​ కాజ్' అనే సంస్థ దావా వేసింది. దీనిని జస్టిస్ ఎల్. నాగేశ్వరరావు, జస్టిస్ వినీత్​ శరణ్​లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్​ తరఫు న్యాయవాది ప్రశాంత్ భూషణ్​ వాదనలు వినిపించారు.

మే 2 తర్వాతే..

ప్రధాన మంత్రి, ప్రతిపక్ష నేత, ప్రధాన న్యాయమూర్తి లేదా సుప్రీంకోర్టు జడ్జితో కూడిన అత్యున్నతస్థాయి సంఘం సీబీఐ డైరెక్టర్​ను ఎంపిక చేస్తుంది. మే 2 తర్వాత ఈ కమిటీ సమావేశమవుతుందని ధర్మాసనానికి కేంద్రం తెలిపింది.

ఉద్దేశ్వపూర్వకంగానే..

జస్టిస్ ఎస్​.ఏ బోబ్డే ఈ నెల 23న పదవీ విరమణ చేయనున్నారని, ఆయన ఉండగా భేటీ జరగకూడదన్న ఉద్దేశంతోనే ఆలస్యం చేస్తున్నారని ప్రశాంత్ భూషణ్ ఆరోపించారు. దీన్ని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఖండించారు.

ఈ కేసుపై తదుపరి విచారణను ధర్మాసనం ఈ నెల 16కు వాయిదా వేసింది.

ఇదీ చదవండి: మావోయిస్టులపై పోరులో జవాన్లకు అండగా ఉంటాం: షా

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.