ETV Bharat / bharat

కుమారుడి పెళ్లికి కార్మికులకు గోల్డ్​ రింగ్​ గిఫ్ట్​ - Mahaveer sawmill owner

కర్ణాటకలో మహావీర్ సామిల్​ యజమాని తన ఉద్యోగులు ఒక్కొక్కరికి 15 గ్రాముల బంగార ఉంగరాన్ని కానుకగా ఇచ్చారు. తన కుమారుడి వివాహ వేడుక సందర్భంగా.. పాతికేళ్లుగా తన వద్దే పని చేస్తున్న నాలుగు జంటలకు ఈ కానుక ఇచ్చారు మిల్​ యజమాని.

Sawmill Owner Gifts 15gram Gold Ring to Their Workers, On the occasion of Son's Marriage
కుమారుడి పెళ్లికి కార్మికులకు గోల్డ్​ రింగ్​ గిఫ్ట్​!
author img

By

Published : Jan 5, 2021, 3:38 PM IST

యజమానుల ఇళ్లల్లో ఏదైనా వేడుక జరిగితే తమ పనోళ్లు లేదా ఉద్యోగులకు ఖరీదైన దుస్తులు కొంటారు. చిన్న కానుకలు ఇస్తారు. అయితే కర్ణాటక కొప్పల్​లోని మహావీర్​ సామిల్​ యజమాని శాంతరాజ్​ గోగి తన కుమారుడి పెళ్లి వేడుక సందర్భంగా.. మిల్​లో పని చేస్తున్న కార్మికులు ఒక్కొక్కరికి 15 గ్రాముల బంగారు ఉంగరాన్ని కానుకగా ఇచ్చారు.

జనవరి 6న గోగి కుమారుడి వివాహ వేడుకలు జరగనున్నాయి. ఈ క్రమంలో పాతికేళ్లుగా తన మిల్​లోనే పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న నాలుగు జంటలకు ఈ నెల 4న పసిడి రింగులను కానుకగా ఇచ్చారు గోగి.

"మా కార్మికులు నా కుటుంబంలో భాగం. వారి వల్లే నేను ఏడాదిలో లక్షల ఆదాయాన్ని పొందుతున్నాను. వారు లేకుండా నేను లేను. లాక్​డౌన్​ సమయంలోనూ వారి కష్టసుఖాలను నాతో పంచుకున్నారు. ఈ శ్రామికులు వెలకట్టలేని ఆస్తి. ఈ కారణంగానే నేను వారిని నా సొంత కుటుంబ సభ్యులుగా, మాలో ఒకరుగా భావిస్తాను. అందుకే వారికి ఈ విధంగా గౌరవించాను."

- శాంతరాజ్​ గోగి, మహావీర్​ సామిల్​ యజమాని

పాతికేళ్లుగా ఎంతో నమ్మకంగా తన వద్దే పని చేస్తున్న వారి బాగోగులను గోగి చూసుకుంటున్నట్లు శ్రామికులు చెప్పారు.

ఇదీ చూడండి: బాలీవుడ్​ సినిమాను తలపించేలా.. స్ట్రెచర్​పైనే ఆ పెళ్లి!

యజమానుల ఇళ్లల్లో ఏదైనా వేడుక జరిగితే తమ పనోళ్లు లేదా ఉద్యోగులకు ఖరీదైన దుస్తులు కొంటారు. చిన్న కానుకలు ఇస్తారు. అయితే కర్ణాటక కొప్పల్​లోని మహావీర్​ సామిల్​ యజమాని శాంతరాజ్​ గోగి తన కుమారుడి పెళ్లి వేడుక సందర్భంగా.. మిల్​లో పని చేస్తున్న కార్మికులు ఒక్కొక్కరికి 15 గ్రాముల బంగారు ఉంగరాన్ని కానుకగా ఇచ్చారు.

జనవరి 6న గోగి కుమారుడి వివాహ వేడుకలు జరగనున్నాయి. ఈ క్రమంలో పాతికేళ్లుగా తన మిల్​లోనే పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న నాలుగు జంటలకు ఈ నెల 4న పసిడి రింగులను కానుకగా ఇచ్చారు గోగి.

"మా కార్మికులు నా కుటుంబంలో భాగం. వారి వల్లే నేను ఏడాదిలో లక్షల ఆదాయాన్ని పొందుతున్నాను. వారు లేకుండా నేను లేను. లాక్​డౌన్​ సమయంలోనూ వారి కష్టసుఖాలను నాతో పంచుకున్నారు. ఈ శ్రామికులు వెలకట్టలేని ఆస్తి. ఈ కారణంగానే నేను వారిని నా సొంత కుటుంబ సభ్యులుగా, మాలో ఒకరుగా భావిస్తాను. అందుకే వారికి ఈ విధంగా గౌరవించాను."

- శాంతరాజ్​ గోగి, మహావీర్​ సామిల్​ యజమాని

పాతికేళ్లుగా ఎంతో నమ్మకంగా తన వద్దే పని చేస్తున్న వారి బాగోగులను గోగి చూసుకుంటున్నట్లు శ్రామికులు చెప్పారు.

ఇదీ చూడండి: బాలీవుడ్​ సినిమాను తలపించేలా.. స్ట్రెచర్​పైనే ఆ పెళ్లి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.