మహారాష్ట్ర యావత్మాల్ జిల్లాలో పల్స్ పోలియో పంపిణీ కార్యక్రమంలో అపశ్రుతి జరిగింది. ఘటాంజి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 12 మంది పిల్లలకు పోలియో చుక్కలకు బదులు శానిటైజర్ వేసినట్లు తేలింది. ప్రస్తుతం వారు.. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో చికిత్స పొందుతున్నారు.
![Sanitizer administered as a dose of polio in Yavatmal of Maharashtra](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/mh-ytl-01-jilhadhikri-gmc-vis-byte-mh-10049_01022021141033_0102f_1612168833_374.jpg)
ఆ పిల్లలు తొలుత వాంతులు చేసుకోవడం వల్ల చికిత్స కోసం రాత్రికి రాత్రే ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. ఈ ఘటనపై స్పందించిన జిల్లా కలెక్టర్ ఎం.దేవేందర్ సింగ్ ఆసుపత్రిని సందర్శించారు. ఘటనపై ఆరా తీశారు. దీనిపై పూర్తి విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు.
ఇదీ చూడండి: '2021లో సాధారణ స్థాయిలోనే నైరుతి రుతుపనాలు!