ETV Bharat / bharat

Sabarimala Rush: శబరిమలలో భక్తుల రద్దీ- ఒక్కరోజే 42 వేల మంది..

author img

By

Published : Dec 5, 2021, 10:45 AM IST

Sabarimala Rush Today: శబరిమలలో భక్తులరద్దీ కొనసాగుతోంది. శనివారం రికార్డు స్థాయిలో 42వేలమందికి పైగా భక్తులు దర్శనానికి వచ్చారు. డిసెంబరు 26 వరకు ఆలయం తెరిచే ఉంటుందని రాష్ట్రప్రభుత్వం తెలిపింది.

sabarimala rush
శబరిమలలో పోటెత్తిన భక్తులు

శబరిమలలో పోటెత్తిన భక్తులు

Sabarimala Rush Today: ఓవైపు దేశంలో ఒమిక్రాన్ వైరస్​ వ్యాప్తి నెలకొన్న క్రమంలో.. శబరిమలలో భక్తులు పోటెత్తారు. శనివారం రికార్డు స్థాయిలో 42,354 మంది దర్శనం చేసుకున్నట్లు రాష్ట్రప్రభుత్వం తెలిపింది. శుక్రవారం 27,840 మంది దర్శనం చేసుకున్నారని పేర్కొంది. ఆలయంలోకి ప్రవేశించే భక్తులకు పోలీసులు.. శానిటైజ్​ చేసి, మాస్కులు అందిస్తున్నారని వివరించింది.

sabarimala rush
శబరిమలలో పోటెత్తిన భక్తులు

డిసెంబరు 9 నుంచి వర్చువల్ క్యూ పద్ధతిలో బుకింగ్ చేసుకునే విధానం పూర్తవుతుందని స్పష్టం చేసింది. వర్చువల్ బుకింగ్​తో పాటు రోజూ దాదాపు 5వేల మంది భక్తులకు స్పాట్​ బుకింగ్ అనుమతిస్తున్నట్లు పేర్కొంది.

sabarimala rush
శబరిమలలో భక్తుల రద్దీ

మండల- మహావిరక్కు కోసం శబరిమల ఆలయాన్ని తెరిచారు. డిసెంబరు 26 వరకు ఆలయం తెరిచే ఉంటుంది. సంక్రాంతి సందర్భంగా డిసెంబరు 30న మళ్లీ శబరిమల ఆలయం తెరుచుకుంటుంది. జనవరి 20 వరకు భక్తులను అనుమతిస్తారు.

ఇదీ చూడండి: టీకా తీసుకోమన్నందుకు రాయితో కొట్టబోయిన వృద్ధుడు- వీడియో వైరల్​

శబరిమలలో పోటెత్తిన భక్తులు

Sabarimala Rush Today: ఓవైపు దేశంలో ఒమిక్రాన్ వైరస్​ వ్యాప్తి నెలకొన్న క్రమంలో.. శబరిమలలో భక్తులు పోటెత్తారు. శనివారం రికార్డు స్థాయిలో 42,354 మంది దర్శనం చేసుకున్నట్లు రాష్ట్రప్రభుత్వం తెలిపింది. శుక్రవారం 27,840 మంది దర్శనం చేసుకున్నారని పేర్కొంది. ఆలయంలోకి ప్రవేశించే భక్తులకు పోలీసులు.. శానిటైజ్​ చేసి, మాస్కులు అందిస్తున్నారని వివరించింది.

sabarimala rush
శబరిమలలో పోటెత్తిన భక్తులు

డిసెంబరు 9 నుంచి వర్చువల్ క్యూ పద్ధతిలో బుకింగ్ చేసుకునే విధానం పూర్తవుతుందని స్పష్టం చేసింది. వర్చువల్ బుకింగ్​తో పాటు రోజూ దాదాపు 5వేల మంది భక్తులకు స్పాట్​ బుకింగ్ అనుమతిస్తున్నట్లు పేర్కొంది.

sabarimala rush
శబరిమలలో భక్తుల రద్దీ

మండల- మహావిరక్కు కోసం శబరిమల ఆలయాన్ని తెరిచారు. డిసెంబరు 26 వరకు ఆలయం తెరిచే ఉంటుంది. సంక్రాంతి సందర్భంగా డిసెంబరు 30న మళ్లీ శబరిమల ఆలయం తెరుచుకుంటుంది. జనవరి 20 వరకు భక్తులను అనుమతిస్తారు.

ఇదీ చూడండి: టీకా తీసుకోమన్నందుకు రాయితో కొట్టబోయిన వృద్ధుడు- వీడియో వైరల్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.