ETV Bharat / bharat

'శబరిమలలో పరిస్థితులు ఘోరం- రద్దీ ఉంటుందని తెలిసినా చర్యలెక్కడ?'- పినరయి సర్కార్​పై విపక్షాల సీరియస్!

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 14, 2023, 4:54 PM IST

Sabarimala Pilgrims Problems :శబరిమలకు భక్తుల తాకిడి భారీగా పెరిగి గందరగోళ పరిస్థితులు నెలకొన్న వేళ అక్కడి ఏర్పాట్లపై కేరళ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. మౌలిక వసతుల లేమిపై భక్తులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ తీరుతో అయ్యప్ప దర్శనం కాకుండానే వెనుతిరుగుతున్నామని మండిపడుతున్నారు. అటు బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు వామపక్ష ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి. అయితే విపక్షాలు కావాలనే ఈ సమస్యను పెద్దది చేస్తున్నాయని భక్తులు రాక భారీగా పెరగడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని పినరయి సర్కార్‌ వివరణ ఇస్తోంది.

Sabarimala Pilgrims Problems
Sabarimala Pilgrims Problems

Sabarimala Pilgrims Problems : శబరిమలలో రద్దీ నిర్వహణ సమస్యపై వేళ్లన్నీ పినరయి విజయన్‌ సర్కార్‌ వైపే చూపిస్తున్నాయి. ప్రభుత్వం కావాలనే శబరిమల సమస్యలపై అలసత్వం వహిస్తోందని విపక్షాలు, భక్తులు ఆరోపిస్తున్నారు. శబరిమలలో ఘోరమైన పరిస్థితులు ఉన్నాయనీ అయినా జాతీయ మీడియా దీనిని పట్టించుకోవట్లేదని కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ ఎక్స్(అప్పటి ట్విట్టర్) వేదికగా విమర్శలు గుప్పించారు. ఇది దిల్లీకి సమీపంలో జరిగి ఉంటే కథ వేరేలా ఉండేదని మండిపడ్డారు. రద్దీ నిర్వహణకు పోలీసులను మోహరించడం, రవాణా సేవల విస్తరణ, వైద్యం, ఆహారం, మంచినీరు అందించుడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ధ్వజమెత్తారు.

కేరళ ప్రభుత్వంపై బీజేపీ విమర్శలు
శబరిమల పరిసరాల్లో ప్రస్తుత పరిస్థితిపై బీజేపీ కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. నిలక్కల్‌లోని పార్కింగ్ గ్రౌండ్‌ను సందర్శించిన బీజేపీ నేత కుమ్మనం రాజశేఖరన్‌ భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడమనేది రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వ బాధ్యతన్నారు. భక్తులు గతంలో కన్నా ఎక్కువగా తరలివస్తుండటం వల్లనే ఇలా జరిగిందన్న దేవస్థానం బోర్డు వివరణలను ఖండించారు. ఏటా 30 శాతం భక్తుల రద్దీ పెరుగుతుందని తెలిసినప్పుడు చర్యలెందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. పంబాలో నిరుపయోగంగా ఉన్న 50 ఎకరాలను ఎందుకు వసతీ ఏర్పాట్లకు వినియోగించలేదన్నారు. 20 ఏళ్లుగా నిలక్కల్ నుంచి రహదారి మార్గాన్ని ప్రభుత్వం ఎందుకు విస్తరించలేదని నిలదీశారు.

'భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరగడమే కారణం'
Kerala CM On Sabarimala Temple Rush : శబరిమల అంశంపై ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్‌ మాట్లాడారు. భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరగడమే ప్రస్తుత పరిస్థితికి కారణమన్నారు. శబరిమలకు లక్షలాదిగా భక్తులు తరలిరావడం వల్ల తీవ్ర గందరగోళం నెలకొంది. ఆలయానికి వెళ్లే రహదారులపై ట్రాఫిక్‌ స్తంభించిపోతోంది. ఇతర రాష్ట్రాల భక్తులు అయ్యప్ప దర్శనం కాకుండానే పందళం వలియకోయికల్ ధర్మశాస్త్ర ఆలయాన్ని దర్శించుకుని వెనుదిరిగారు. వాహనాలను పంబా వరకు అనుమతించకపోవడం వల్ల ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రైవేటు వాహనాలను బోలక్కల్ వరకే అనుమతిస్తున్న అధికారులు అక్కడి నుంచి 22 కిలోమీటర్ల దూరంలోని పంబకు ప్రభుత్వ బస్సుల్లో వెళ్లాలని సూచించారు.

శబరిమలలో భారీగా పెరిగిన భక్తుల తాకిడి
మరోవైపు, శబరిమలలో భక్తుల తాకిడి భారీగా పెరిగింది. గంటల తరబడి క్యూలో వేచి ఉన్నా దర్శనం పూర్తి కాకపోవడం వల్ల భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొందరు భక్తులు దర్శనం కాకుండానే కొండ దిగిపోతున్నట్లు తెలుస్తోంది. పందళంలోని అయ్యప్ప ఆలయాన్ని దర్శించుకుని అక్కడే ఇరుముడి సమర్పిస్తున్నారు. పూర్తి వార్తను చదివేందుకు ఈ లింక్​పై క్లిక్ చేయండి.

శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్​న్యూస్​- వారి కోసం 'అయ్యన్​' యాప్​, ఇక మరింత ఈజీగా దర్శనం!

శబరిమల భక్తులకు గుడ్​న్యూస్​- అయ్యప్ప స్వామి దర్శన సమయం పెంపు

Sabarimala Pilgrims Problems : శబరిమలలో రద్దీ నిర్వహణ సమస్యపై వేళ్లన్నీ పినరయి విజయన్‌ సర్కార్‌ వైపే చూపిస్తున్నాయి. ప్రభుత్వం కావాలనే శబరిమల సమస్యలపై అలసత్వం వహిస్తోందని విపక్షాలు, భక్తులు ఆరోపిస్తున్నారు. శబరిమలలో ఘోరమైన పరిస్థితులు ఉన్నాయనీ అయినా జాతీయ మీడియా దీనిని పట్టించుకోవట్లేదని కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ ఎక్స్(అప్పటి ట్విట్టర్) వేదికగా విమర్శలు గుప్పించారు. ఇది దిల్లీకి సమీపంలో జరిగి ఉంటే కథ వేరేలా ఉండేదని మండిపడ్డారు. రద్దీ నిర్వహణకు పోలీసులను మోహరించడం, రవాణా సేవల విస్తరణ, వైద్యం, ఆహారం, మంచినీరు అందించుడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ధ్వజమెత్తారు.

కేరళ ప్రభుత్వంపై బీజేపీ విమర్శలు
శబరిమల పరిసరాల్లో ప్రస్తుత పరిస్థితిపై బీజేపీ కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. నిలక్కల్‌లోని పార్కింగ్ గ్రౌండ్‌ను సందర్శించిన బీజేపీ నేత కుమ్మనం రాజశేఖరన్‌ భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడమనేది రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వ బాధ్యతన్నారు. భక్తులు గతంలో కన్నా ఎక్కువగా తరలివస్తుండటం వల్లనే ఇలా జరిగిందన్న దేవస్థానం బోర్డు వివరణలను ఖండించారు. ఏటా 30 శాతం భక్తుల రద్దీ పెరుగుతుందని తెలిసినప్పుడు చర్యలెందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. పంబాలో నిరుపయోగంగా ఉన్న 50 ఎకరాలను ఎందుకు వసతీ ఏర్పాట్లకు వినియోగించలేదన్నారు. 20 ఏళ్లుగా నిలక్కల్ నుంచి రహదారి మార్గాన్ని ప్రభుత్వం ఎందుకు విస్తరించలేదని నిలదీశారు.

'భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరగడమే కారణం'
Kerala CM On Sabarimala Temple Rush : శబరిమల అంశంపై ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్‌ మాట్లాడారు. భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరగడమే ప్రస్తుత పరిస్థితికి కారణమన్నారు. శబరిమలకు లక్షలాదిగా భక్తులు తరలిరావడం వల్ల తీవ్ర గందరగోళం నెలకొంది. ఆలయానికి వెళ్లే రహదారులపై ట్రాఫిక్‌ స్తంభించిపోతోంది. ఇతర రాష్ట్రాల భక్తులు అయ్యప్ప దర్శనం కాకుండానే పందళం వలియకోయికల్ ధర్మశాస్త్ర ఆలయాన్ని దర్శించుకుని వెనుదిరిగారు. వాహనాలను పంబా వరకు అనుమతించకపోవడం వల్ల ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రైవేటు వాహనాలను బోలక్కల్ వరకే అనుమతిస్తున్న అధికారులు అక్కడి నుంచి 22 కిలోమీటర్ల దూరంలోని పంబకు ప్రభుత్వ బస్సుల్లో వెళ్లాలని సూచించారు.

శబరిమలలో భారీగా పెరిగిన భక్తుల తాకిడి
మరోవైపు, శబరిమలలో భక్తుల తాకిడి భారీగా పెరిగింది. గంటల తరబడి క్యూలో వేచి ఉన్నా దర్శనం పూర్తి కాకపోవడం వల్ల భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొందరు భక్తులు దర్శనం కాకుండానే కొండ దిగిపోతున్నట్లు తెలుస్తోంది. పందళంలోని అయ్యప్ప ఆలయాన్ని దర్శించుకుని అక్కడే ఇరుముడి సమర్పిస్తున్నారు. పూర్తి వార్తను చదివేందుకు ఈ లింక్​పై క్లిక్ చేయండి.

శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్​న్యూస్​- వారి కోసం 'అయ్యన్​' యాప్​, ఇక మరింత ఈజీగా దర్శనం!

శబరిమల భక్తులకు గుడ్​న్యూస్​- అయ్యప్ప స్వామి దర్శన సమయం పెంపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.