ETV Bharat / bharat

కేసీఆర్ ఓటమి భయంతో రైతుబంధు నిధులను కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపునకు మళ్లిస్తున్నారు : రేవంత్ రెడ్డి

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 1, 2023, 8:14 PM IST

Revanth Reddy Chit Chat : సీఎం కేసీఆర్ ఓటమి భయంతో రైతుబంధు నిధులను ఇతర కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపునకు మళ్లిస్తున్నారని రేవంత్​ రెడ్డి ఆరోపించారు. కమీషన్​ల కోసం రైతుబంధు నిధులను కాంట్రాక్టర్లకు ఇస్తున్నారని మండిపడ్డారు. దీనిపై రేపు తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్​ను కలిసి ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు.

Revanth Reddy Chit Chat
Revanth Reddy

Revanth Reddy Chit Chat : సీఎం కేసీఆర్ ఓటమి భయంతో రైతుబంధు (Rythu Bandhu) నిధులను ఇతర కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపునకు మళ్లిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) ధ్వజమెత్తారు. కమీషన్‌ల కోసం రైతుబంధు నిధులు కాంట్రాక్టర్లకు ఇస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంలో రేపు తెలంగాణ ఛీప్ ఎలక్షన్ అధికారి వికాస్ రాజ్‌ను కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ మేరకు రేవంత్​ రెడ్డి హైదరాబాద్​లోని తన నివాసంలో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు.

ప్రభుత్వ అన్ని లావాదేవీలపై నిఘా పెట్టాలి : హైదరాబాద్‌ చుట్టుపక్కల ఉన్న అసైన్డ్‌ భూములను ఇతరుల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసే ప్రక్రియ జరుగుతుందని, ప్రభుత్వ అన్ని లావాదేవీలపై నిఘా పెట్టాలని ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేస్తామని రేవంత్ తెలిపారు. ప్రభుత్వ లావాదేవీలపై విజిలెన్స్‌ నిఘా పెట్టాలని ఇటు హైదరాబాద్​లో అటు దిల్లీలోనూ ఎన్నికల సంఘం, ఎన్నికల కమీషన్‌ను ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. ఇదే అంశాన్ని జూమ్‌ మీటింగ్‌లో తాము చర్చించి నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. తనతో పాటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మహేశ్​ కుమార్ గౌడ్‌ తదితరులతో ఈసీని కలుస్తామన్నారు.

Revanth Reddy on Telangana Exit Polls Results 2023 : మరోవైపు రాష్ట్రంలో ఎగ్జిట్​ పోల్స్(Exit Polls 2023)​ సర్వేలు అధికారం దక్కించుకునేది కాంగ్రెస్​ పార్టీయే అని ముక్తకంఠంతో చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ ​రెడ్డి ఎక్స్(ట్విటర్)​ వేదికగా కాంగ్రెస్​ శ్రేణులను ఉద్దేశిస్తూ ధన్యవాదాలు తెలిపారు.

ఎగ్జిట్​ పోల్స్​ ఎప్పుడూ అంతే - అసలైన ఫలితాలు మాకు శుభవార్త చెబుతాయి : కేటీఆర్

'ధన్యవాదాలు.. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం శ్రమించిన, సహకరించిన నాయకులు, కార్యకర్తలు, మిత్రులు, అభిమానులు, శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు. గడచిన పదేళ్లుగా అడుగడుగునా అణచివేతలు, దాడులు, కేసులకు వెరవకుండా కాంగ్రెస్ చేసిన పోరాటంలో మీరంతా ప్రజల పక్షాన నిటారుగా, నికార్సుగా నిలబడ్డారు. మీ కష్టం, మీ శ్రమ వృథా కాలేదు. తెలంగాణలో ప్రజాస్వామ్య పునరుద్ధరణలో మీ అందరి పాత్ర మరువలేనిది. ప్రతి ఒక్కరికీ అభినందనలు.' అని రేవంత్​రెడ్డి ట్వీట్ చేశారు.

రేవంత్​రెడ్డిని కలిసిన కాంగ్రెస్​ నేతలు : మరోవైపు జూబ్లీహిల్స్​లోని రేవంత్​ రెడ్డి నివాసం వద్ద.. కాంగ్రెస్​ నేతలు సందడి చేస్తున్నారు. ఆయనను కలవడానికి పోటీ చేసిన అభ్యర్థులు పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి, ఏ.చంద్రశేఖర్​, మల్​రెడ్డి రంగారెడ్డి, బండి రమేశ్​ మొదలగు నాయకులు ఆయన నివాసానికి వచ్చారు. తమ తమ నియోజకవర్గాల్లో జరిగిన ఓటింగ్​ సరళిపై రేవంత్ ​రెడ్డితో కాసేపు చర్చించారు. అలాగే టీపీసీసీ సీనియర్​ ఉపాధ్యక్షుడు మల్లు రవి సైతం రేవంత్​ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు.

  • ధన్యవాదాలు..

    తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం శ్రమించిన, సహకరించిన నాయకులు, కార్యకర్తలు, మిత్రులు, అభిమానులు, శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు.

    గడచిన పదేళ్లుగా అడుగడుగునా అణచివేతలు, దాడులు, కేసులకు వెరవకుండా కాంగ్రెస్ చేసిన పోరాటంలో మీరంతా… pic.twitter.com/4VPl4X5uCW

    — Revanth Reddy (@revanth_anumula) December 1, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

కాంగ్రెస్ గెలుపు కోసం శ్రమించిన, సహకరించిన అందరికీ ధన్యవాదాలు : రేవంత్ ​రెడ్డి

తెలంగాణ సెంటిమెంట్‌తో- ఎన్నికల్లో లబ్ధికి కేసీఆర్‌ పన్నాగాలు : రేవంత్‌

Revanth Reddy Chit Chat : సీఎం కేసీఆర్ ఓటమి భయంతో రైతుబంధు (Rythu Bandhu) నిధులను ఇతర కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపునకు మళ్లిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) ధ్వజమెత్తారు. కమీషన్‌ల కోసం రైతుబంధు నిధులు కాంట్రాక్టర్లకు ఇస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంలో రేపు తెలంగాణ ఛీప్ ఎలక్షన్ అధికారి వికాస్ రాజ్‌ను కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ మేరకు రేవంత్​ రెడ్డి హైదరాబాద్​లోని తన నివాసంలో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు.

ప్రభుత్వ అన్ని లావాదేవీలపై నిఘా పెట్టాలి : హైదరాబాద్‌ చుట్టుపక్కల ఉన్న అసైన్డ్‌ భూములను ఇతరుల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసే ప్రక్రియ జరుగుతుందని, ప్రభుత్వ అన్ని లావాదేవీలపై నిఘా పెట్టాలని ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేస్తామని రేవంత్ తెలిపారు. ప్రభుత్వ లావాదేవీలపై విజిలెన్స్‌ నిఘా పెట్టాలని ఇటు హైదరాబాద్​లో అటు దిల్లీలోనూ ఎన్నికల సంఘం, ఎన్నికల కమీషన్‌ను ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. ఇదే అంశాన్ని జూమ్‌ మీటింగ్‌లో తాము చర్చించి నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. తనతో పాటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మహేశ్​ కుమార్ గౌడ్‌ తదితరులతో ఈసీని కలుస్తామన్నారు.

Revanth Reddy on Telangana Exit Polls Results 2023 : మరోవైపు రాష్ట్రంలో ఎగ్జిట్​ పోల్స్(Exit Polls 2023)​ సర్వేలు అధికారం దక్కించుకునేది కాంగ్రెస్​ పార్టీయే అని ముక్తకంఠంతో చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ ​రెడ్డి ఎక్స్(ట్విటర్)​ వేదికగా కాంగ్రెస్​ శ్రేణులను ఉద్దేశిస్తూ ధన్యవాదాలు తెలిపారు.

ఎగ్జిట్​ పోల్స్​ ఎప్పుడూ అంతే - అసలైన ఫలితాలు మాకు శుభవార్త చెబుతాయి : కేటీఆర్

'ధన్యవాదాలు.. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం శ్రమించిన, సహకరించిన నాయకులు, కార్యకర్తలు, మిత్రులు, అభిమానులు, శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు. గడచిన పదేళ్లుగా అడుగడుగునా అణచివేతలు, దాడులు, కేసులకు వెరవకుండా కాంగ్రెస్ చేసిన పోరాటంలో మీరంతా ప్రజల పక్షాన నిటారుగా, నికార్సుగా నిలబడ్డారు. మీ కష్టం, మీ శ్రమ వృథా కాలేదు. తెలంగాణలో ప్రజాస్వామ్య పునరుద్ధరణలో మీ అందరి పాత్ర మరువలేనిది. ప్రతి ఒక్కరికీ అభినందనలు.' అని రేవంత్​రెడ్డి ట్వీట్ చేశారు.

రేవంత్​రెడ్డిని కలిసిన కాంగ్రెస్​ నేతలు : మరోవైపు జూబ్లీహిల్స్​లోని రేవంత్​ రెడ్డి నివాసం వద్ద.. కాంగ్రెస్​ నేతలు సందడి చేస్తున్నారు. ఆయనను కలవడానికి పోటీ చేసిన అభ్యర్థులు పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి, ఏ.చంద్రశేఖర్​, మల్​రెడ్డి రంగారెడ్డి, బండి రమేశ్​ మొదలగు నాయకులు ఆయన నివాసానికి వచ్చారు. తమ తమ నియోజకవర్గాల్లో జరిగిన ఓటింగ్​ సరళిపై రేవంత్ ​రెడ్డితో కాసేపు చర్చించారు. అలాగే టీపీసీసీ సీనియర్​ ఉపాధ్యక్షుడు మల్లు రవి సైతం రేవంత్​ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు.

  • ధన్యవాదాలు..

    తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం శ్రమించిన, సహకరించిన నాయకులు, కార్యకర్తలు, మిత్రులు, అభిమానులు, శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు.

    గడచిన పదేళ్లుగా అడుగడుగునా అణచివేతలు, దాడులు, కేసులకు వెరవకుండా కాంగ్రెస్ చేసిన పోరాటంలో మీరంతా… pic.twitter.com/4VPl4X5uCW

    — Revanth Reddy (@revanth_anumula) December 1, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

కాంగ్రెస్ గెలుపు కోసం శ్రమించిన, సహకరించిన అందరికీ ధన్యవాదాలు : రేవంత్ ​రెడ్డి

తెలంగాణ సెంటిమెంట్‌తో- ఎన్నికల్లో లబ్ధికి కేసీఆర్‌ పన్నాగాలు : రేవంత్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.