ETV Bharat / bharat

నేటి నుంచి అమర్​నాథ్​ యాత్ర రిజిస్ట్రేషన్ షురూ​

author img

By

Published : Apr 1, 2021, 5:25 AM IST

జూన్​ 28 నుంచి మొదలవనున్న అమర్​నాథ్​ యాత్రకు నేటి నుంచి రిజిస్ట్రేషన్​లు ప్రారంభంకానున్నాయి. అమర్​నాథ్​ బోర్డు అధికారిక వెబ్​సైట్​లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా ఉన్న పీఎన్​బీ, జమ్ముకశ్మీర్​, ఎస్​ బ్యాంకుల శాఖల్లో రిజిస్ట్రేషన్​కు అవకాశం కల్పించారు.

Amarnath yatra
అమర్​నాథ్​ యాత్ర రిజిస్ట్రేషన్​

అమర్​నాథ్​ యాత్రలో పాల్గొనే భక్తుల నమోదు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. మొత్తం 56 రోజుల పాటు సాగే ఈ యాత్రలో పాల్గొనేందుకు అమర్​నాథ్​ బోర్డు అధికారిక వెబ్​సైట్​లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. జూన్​ 28 నుంచి ప్రారంభమై ఆగస్టు 2తో యాత్ర ముగుస్తుంది.

పూర్తిస్థాయి కొవిడ్​ నిబంధనలతో ఈ యాత్ర కొనసాగుతుందని బోర్డు గతంలోనే వెల్లడించింది. ఈసారి యాత్ర రెండు మార్గాల ద్వారా ప్రారంభం కానుంది. 13 ఏళ్లలోపు పిల్లలను, 75 ఏళ్లు పైబడిన వృద్ధులను యాత్రకు అనుమతించబోమని బోర్డు తెలిపింది.

దాదాపు రెండేళ్ల విరామం తరువాత ప్రారంభమయ్యే అమర్​నాథ్​ యాత్రకు.. 6 లక్షల మంది భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు.

3 బ్యాంకుల శాఖల్లో..

దేశవ్యాప్తంగా ఉన్న.. పంజాబ్​ నేషనల్​ బ్యాంకు, జమ్ముకశ్మీర్​ బ్యాంకు, ఎస్​ బ్యాంకులకు సంబంధించిన 446 శాఖల్లో రిజిస్ట్రేషన్​లు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. ఈ బ్యాంకు శాఖల వివరాలు తమ వెబ్​సైట్​లో అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. మార్చి 15 తర్వాత మంజూరు చేసిన ఆరోగ్య ధ్రువపత్రాలు మాత్రమే చెల్లుతాయని అధికారులు స్పష్టం చేశారు. హెలికాప్టర్​​లో ప్రయాణించాలనుకునేవారికి ఎలాంటి ముందస్తు నమోదు అవసరం లేదని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: ఆ రాష్ట్ర మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం

అమర్​నాథ్​ యాత్రలో పాల్గొనే భక్తుల నమోదు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. మొత్తం 56 రోజుల పాటు సాగే ఈ యాత్రలో పాల్గొనేందుకు అమర్​నాథ్​ బోర్డు అధికారిక వెబ్​సైట్​లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. జూన్​ 28 నుంచి ప్రారంభమై ఆగస్టు 2తో యాత్ర ముగుస్తుంది.

పూర్తిస్థాయి కొవిడ్​ నిబంధనలతో ఈ యాత్ర కొనసాగుతుందని బోర్డు గతంలోనే వెల్లడించింది. ఈసారి యాత్ర రెండు మార్గాల ద్వారా ప్రారంభం కానుంది. 13 ఏళ్లలోపు పిల్లలను, 75 ఏళ్లు పైబడిన వృద్ధులను యాత్రకు అనుమతించబోమని బోర్డు తెలిపింది.

దాదాపు రెండేళ్ల విరామం తరువాత ప్రారంభమయ్యే అమర్​నాథ్​ యాత్రకు.. 6 లక్షల మంది భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు.

3 బ్యాంకుల శాఖల్లో..

దేశవ్యాప్తంగా ఉన్న.. పంజాబ్​ నేషనల్​ బ్యాంకు, జమ్ముకశ్మీర్​ బ్యాంకు, ఎస్​ బ్యాంకులకు సంబంధించిన 446 శాఖల్లో రిజిస్ట్రేషన్​లు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. ఈ బ్యాంకు శాఖల వివరాలు తమ వెబ్​సైట్​లో అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. మార్చి 15 తర్వాత మంజూరు చేసిన ఆరోగ్య ధ్రువపత్రాలు మాత్రమే చెల్లుతాయని అధికారులు స్పష్టం చేశారు. హెలికాప్టర్​​లో ప్రయాణించాలనుకునేవారికి ఎలాంటి ముందస్తు నమోదు అవసరం లేదని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: ఆ రాష్ట్ర మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.