Rare Surgery in Bengal: అరుదైన శస్త్రచికిత్స చేసి ఓ చిన్నారిని రక్షించారు బంగాల్ వైద్యులు. ఛాతిలో మేకు ఇరుక్కుని తీవ్ర శ్వాస సమస్యతో బాధపడుతున్న బాలుడి ప్రాణాలు నిలిపారు.

సిలిగుడికి చెందిన మూడేళ్ల మహమ్మద్ అరిస్ ప్రమాదవశాత్తు మేకును మింగాడు. ఛాతిలో మేకు ఇరుక్కోగా.. శ్వాస తీసుకోవడం కష్టమైంది. దీంతో బుధవారం రాత్రి నార్త్ బంగాల్ వైద్య కళాశాల ఆస్పత్రిలో చేరాడు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్య బృందం.. శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించింది. ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించి బాలుడి ప్రాణాలు నిలిపింది.

ఆపరేషన్ చాలా కష్టతరమైందని డాక్టర్ బంధోపాధ్యాయ చెప్పారు. ప్రస్తుతం బాలుని ఆరోగ్యం నిలకడగానే ఉందని వెల్లడించారు. గత నెలలోనూ ఇలాంటి ఓ ఆపరేషన్ నిర్వహించినట్లు తెలిపారు. గొంతులో వెదురు కర్ర ఇరుక్కున్న ఓ మహిళకు శస్త్రచికిత్స చేసినట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: పుట్టిన బిడ్డను భూమిలో పాతేసిన తల్లి... శిశువు ఏడుపు విని..