సాధారణంగా ఆలయాల్లో అమ్మవారికి పండ్లు, తీపి పదార్థాలు ప్రసాదంగా ఇస్తుంటారు. కానీ, ఛత్తీస్గఢ్ రాయ్పుర్కు చెందిన ఓ ఆలయంలో స్పైసీ పదార్థాలు ప్రసాదంగా సమర్పిస్తారు. ఇంతకీ ఇలా ఎందుకు చేస్తున్నారంటే..
దేశంలోనే మొదటి ఆలయం..
దుర్గామాత అవతారమైన ధూమావతి అమ్మవారి ఆలయానికి చాలా ప్రత్యేకతలున్నాయి. ఇది రాయ్పుర్ పాతబస్తీ ప్రాంతంలోని శీత్లా మందిర్ సమీపంలో ఉంది. ఈ ఆలయాన్ని నీరజ్ సాయిని అనే పూజారి పదేళ్ల క్రితమే నిర్మించారు.
![samosa](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/cg-rpr-04-dhumaavati-mata-spl-cg10001_18062021212101_1806f_1624031461_349.jpg)
అయితే.. ధూమావతి అమ్మవారికి.. సమోసాలు, కచోరీ, మిర్చి భజ్జీ, ఆలూబొండా వంటి స్పైసీ పిండివంటకాలు ప్రసాదంలా సమర్పిస్తుంటారు అక్కడి ప్రజలు. ఈ విధంగా అమ్మవారిని ఆరాధించడం మరెక్కడా లేదని, దేశంలో పీఠం ఏర్పాటు చేసిన మొదటి ధూమావతి అమ్మవారి ఆలయమిదే అని పూజారి నీరజ్ చెబుతున్నారు. అమ్మవారికి స్పైసీ ఫుడ్ అంటేనే ఇష్టం అని ప్రజలు నమ్ముతారని అన్నారు.
![prasad samosa](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/cg-rpr-04-dhumaavati-mata-spl-cg10001_18062021212101_1806f_1624031461_806.jpg)
జ్యోతి బిందు రూపంలో అమ్మవారిని ఆరాధిస్తామని నీరజ్ చెప్పారు. విగ్రహానికి ఓ ప్రత్యేక రూపం అంటూ లేదని పేర్కొన్నారు.
![dhumavathi maa](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/cg-rpr-04-dhumaavati-mata-spl-cg10001_18062021212101_1806f_1624031461_500.jpg)
శుక్రవారం జ్యేష్ఠ శుక్ల అష్టమి సందర్భంగా.. అమ్మవారికి ఘనంగా పూజలు నిర్వహించారు. పండ్లు, స్వీట్లతో పాటు సమోసాలు ప్రసాదంగా ఉంచారు. అయితే.. కరోనా కారణంగా ఈ ఏడాది అతి తక్కువ మంది సమక్షంలో పూజలు నిర్వహించినట్లు పూజారి నీరజ్ సాయిని వెల్లడించారు.
ఇదీ చదవండి:'కరోనా మాత' ఆలయం కూల్చివేత