ETV Bharat / bharat

'ఆ బఫర్​జోన్​ ప్రకటనతో ప్రజల జీవనోపాధికి ఆటంకం' - రాహుల్ సాగు చట్టాలు

వయనాడ్​ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం చుట్టూ ఉన్న ప్రాంతాన్ని బఫర్​ జోన్​గా ప్రకటించడంపై కాంగ్రెస్​ నేత రాహుల్ గాంధీ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వైఖరి చెప్పాలని పట్టుబట్టారు. ఈ మేరకు ట్వీట్​ చేశారు.

Rahul targets Left Front govt over buffer zone around Kerala's Wayanad wildlife sanctuary
'ప్రజల ఉపాధికి సంబంధించిన విషయం..మీ వైఖరి చెప్పడం'
author img

By

Published : Feb 23, 2021, 9:15 PM IST

కేరళలో అధికారంలో ఉన్న ఎల్​డీఎఫ్​ ప్రభుత్వంపై కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. వయనాడ్​ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం చుట్టూ ఉన్న ప్రాంతాన్ని బఫర్​ జోన్​గా ప్రకటించడంపై రాష్ట్ర సర్కార్​ వైఖరి ఏంటో స్పష్టం చేయాలన్నారు. ఈ నిర్ణయం స్థానిక ప్రజల ఉపాధికి సంబంధించిన విషయమన్న రాహుల్.. వారి జీవనోపాధికి ఆటంకం కలుగుతుందని మండిపడ్డారు. ఈ మేరకు ట్వీట్​ చేశారు.

"వయనాడ్ వన్యప్రాణుల అభయారణ్యం పరిసర ప్రాంతాలను బఫర్ జోన్​గా ప్రకటించడంపై రాష్ట్ర ప్రభుత్వం వైఖరి ప్రకటించాలి. ఇది స్థానిక ప్రజల జీవనోపాధిని ప్రమాదంలో పడేస్తోంది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం అక్కడి ప్రజల భవిష్యత్తుని అంధకారంలోకి తోస్తుంది. ఇప్పటికైనా మేలుకొని దిద్దుబాటు చర్యలను ప్రారంభించాలి."

-రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ నేత

దిల్లీలో చెప్పండి..

రాహుల్​ గాంధీ విమర్శలపై కేరళ అటవీశాఖ మంత్రి స్పందించారు. బఫర్​జోన్​గా ప్రకటించడం కేంద్రం తీసుకున్న నిర్ణయం అని అన్నారు. రాహుల్​ గాంధీ దిల్లీలోనే ఉంటారన్న ఆయన.. అక్కడ ఉండే కేంద్ర అటవీ శాఖకు తగు సూచనలు చేయాలని ట్వీట్​ చేశారు.

మద్దతు ధర అనుమానమే..

కేంద్రం తీసుకువచ్చిన సాగు చట్టాలపై రాహుల్ విరుచుకుపడ్డారు. వ్యవసాయ మార్కెట్లను నాశనం చేయడమే భాజపా ప్రభుత్వ లక్ష్యమన్నారు. రైతులు పండించిన పంటకు సరైన మద్దతు ధర లభించకపోవచ్చని అభిప్రాయపడ్డారు.

ఇదీ చూడండి: రైతు సంఘం ప్రతినిధులతో సుప్రీం ప్యానెల్​ భేటీ

కేరళలో అధికారంలో ఉన్న ఎల్​డీఎఫ్​ ప్రభుత్వంపై కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. వయనాడ్​ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం చుట్టూ ఉన్న ప్రాంతాన్ని బఫర్​ జోన్​గా ప్రకటించడంపై రాష్ట్ర సర్కార్​ వైఖరి ఏంటో స్పష్టం చేయాలన్నారు. ఈ నిర్ణయం స్థానిక ప్రజల ఉపాధికి సంబంధించిన విషయమన్న రాహుల్.. వారి జీవనోపాధికి ఆటంకం కలుగుతుందని మండిపడ్డారు. ఈ మేరకు ట్వీట్​ చేశారు.

"వయనాడ్ వన్యప్రాణుల అభయారణ్యం పరిసర ప్రాంతాలను బఫర్ జోన్​గా ప్రకటించడంపై రాష్ట్ర ప్రభుత్వం వైఖరి ప్రకటించాలి. ఇది స్థానిక ప్రజల జీవనోపాధిని ప్రమాదంలో పడేస్తోంది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం అక్కడి ప్రజల భవిష్యత్తుని అంధకారంలోకి తోస్తుంది. ఇప్పటికైనా మేలుకొని దిద్దుబాటు చర్యలను ప్రారంభించాలి."

-రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ నేత

దిల్లీలో చెప్పండి..

రాహుల్​ గాంధీ విమర్శలపై కేరళ అటవీశాఖ మంత్రి స్పందించారు. బఫర్​జోన్​గా ప్రకటించడం కేంద్రం తీసుకున్న నిర్ణయం అని అన్నారు. రాహుల్​ గాంధీ దిల్లీలోనే ఉంటారన్న ఆయన.. అక్కడ ఉండే కేంద్ర అటవీ శాఖకు తగు సూచనలు చేయాలని ట్వీట్​ చేశారు.

మద్దతు ధర అనుమానమే..

కేంద్రం తీసుకువచ్చిన సాగు చట్టాలపై రాహుల్ విరుచుకుపడ్డారు. వ్యవసాయ మార్కెట్లను నాశనం చేయడమే భాజపా ప్రభుత్వ లక్ష్యమన్నారు. రైతులు పండించిన పంటకు సరైన మద్దతు ధర లభించకపోవచ్చని అభిప్రాయపడ్డారు.

ఇదీ చూడండి: రైతు సంఘం ప్రతినిధులతో సుప్రీం ప్యానెల్​ భేటీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.