ETV Bharat / bharat

'మోదీ సర్కార్ అంటేనే 'ప్రచారం''.. రాహుల్ ధ్వజం

author img

By

Published : Mar 7, 2022, 6:58 PM IST

Rahul Gandhi tweet: మోదీ సర్కారుపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి విమర్శలు కురిపించారు. ప్రచార ఆర్భాటాలు తప్ప.. ప్రధాన సమస్యలపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించడం లేదని మండిపడ్డారు. ఉక్రెయిన్ నుంచి పౌరుల తరలింపుపై కేంద్రం వద్ద ఎలాంటి ప్రణాళికలు లేవని చెప్పారు.

GOVT PR RAHUL GANDHI
GOVT PR RAHUL GANDHI

Rahul Gandhi tweet: కేంద్ర ప్రభుత్వం కేవలం ప్రచారాలపైనే దృష్టి పెట్టిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఉక్రెయిన్ నుంచి భారత పౌరుల్ని తరలించడంపై కేంద్రం వద్ద ఎలాంటి ప్రణాళికలు లేవని ఆరోపించారు. చైనా సమస్య, నిరుద్యోగం, ధరల పెరుగుదల, రూపాయి పతనంపైనా ప్రభుత్వానికి శ్రద్ధలేదని దుయ్యబట్టారు. ఈ మేరకు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ట్విట్టర్​లో పోస్టు పెట్టారు.

Modi Govt PR Rahul Gandhi

రూపాయి జీవితకాల కనిష్ఠానికి పడిపోయిందని గుర్తు చేసిన రాహుల్.. దానికి విరుగుడుగా ప్రభుత్వం వద్ద ఎలాంటి ప్రణాళికలు లేవన్నారు. ఉక్రెయిన్​లో విద్యార్థులు చిక్కుకుపోయారని అన్నారు. భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందని ఆరోపించారు. మోదీ సర్కారు అంటే పీఆర్ మాత్రమేనని చెప్పుకొచ్చారు.

Rupee falling Congress

మరో కాంగ్రెస్ నేత షామా మహమ్మద్ సైతం రూపాయి పతనంపై ఆందోళన వ్యక్తం చేశారు. డాలర్​తో పోలిస్తే రూపాయి విలువ 76.96కు చేరిందని అన్నారు. యూపీఏ అధికారంలో ఉన్న సమయంలో.. రూపాయి ఐసీయూలో ఉందని మోదీ ఆందోళన వ్యక్తం చేశారని.. ఇప్పుడు రూపాయి వెంటిలేటర్​పై ఉండి ఆక్సిజన్ కోసం వేచిచూస్తోందని ట్వీట్ చేశారు.

గతేడాది అక్టోబర్ నుంచి విదేశీ సంస్థాగత మదుపర్లు రూ.2 లక్షల కోట్లను భారత మార్కెట్ల నుంచి ఉపసంహరించుకున్నారని మరో ట్వీట్​లో చెప్పారు. ఇన్వెస్టర్లందరూ ఎగ్జిట్ డోర్​ను చూస్తుంటే మోదీ మాత్రం.. ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారని ధ్వజమెత్తారు. పెట్టుబడిదారులను ఆందోళనకు గురిచేస్తున్న ఈ అంశంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తారా? అని ప్రశ్నించారు.

ఇదీ చదవండి: 'జెలెన్‌స్కీతో నేరుగా మాట్లాడండి'- పుతిన్​కు మోదీ సూచన

Rahul Gandhi tweet: కేంద్ర ప్రభుత్వం కేవలం ప్రచారాలపైనే దృష్టి పెట్టిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఉక్రెయిన్ నుంచి భారత పౌరుల్ని తరలించడంపై కేంద్రం వద్ద ఎలాంటి ప్రణాళికలు లేవని ఆరోపించారు. చైనా సమస్య, నిరుద్యోగం, ధరల పెరుగుదల, రూపాయి పతనంపైనా ప్రభుత్వానికి శ్రద్ధలేదని దుయ్యబట్టారు. ఈ మేరకు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ట్విట్టర్​లో పోస్టు పెట్టారు.

Modi Govt PR Rahul Gandhi

రూపాయి జీవితకాల కనిష్ఠానికి పడిపోయిందని గుర్తు చేసిన రాహుల్.. దానికి విరుగుడుగా ప్రభుత్వం వద్ద ఎలాంటి ప్రణాళికలు లేవన్నారు. ఉక్రెయిన్​లో విద్యార్థులు చిక్కుకుపోయారని అన్నారు. భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందని ఆరోపించారు. మోదీ సర్కారు అంటే పీఆర్ మాత్రమేనని చెప్పుకొచ్చారు.

Rupee falling Congress

మరో కాంగ్రెస్ నేత షామా మహమ్మద్ సైతం రూపాయి పతనంపై ఆందోళన వ్యక్తం చేశారు. డాలర్​తో పోలిస్తే రూపాయి విలువ 76.96కు చేరిందని అన్నారు. యూపీఏ అధికారంలో ఉన్న సమయంలో.. రూపాయి ఐసీయూలో ఉందని మోదీ ఆందోళన వ్యక్తం చేశారని.. ఇప్పుడు రూపాయి వెంటిలేటర్​పై ఉండి ఆక్సిజన్ కోసం వేచిచూస్తోందని ట్వీట్ చేశారు.

గతేడాది అక్టోబర్ నుంచి విదేశీ సంస్థాగత మదుపర్లు రూ.2 లక్షల కోట్లను భారత మార్కెట్ల నుంచి ఉపసంహరించుకున్నారని మరో ట్వీట్​లో చెప్పారు. ఇన్వెస్టర్లందరూ ఎగ్జిట్ డోర్​ను చూస్తుంటే మోదీ మాత్రం.. ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారని ధ్వజమెత్తారు. పెట్టుబడిదారులను ఆందోళనకు గురిచేస్తున్న ఈ అంశంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తారా? అని ప్రశ్నించారు.

ఇదీ చదవండి: 'జెలెన్‌స్కీతో నేరుగా మాట్లాడండి'- పుతిన్​కు మోదీ సూచన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.