ETV Bharat / bharat

Rahul gandhi: నెహ్రూ వర్ధంతి- రాహుల్​ నివాళులు

author img

By

Published : May 27, 2021, 12:46 PM IST

భారత మాజీ ప్రధాన మంత్రి పండిట్​ జవహర్​లాల్​ నెహ్రూ 57వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయనకు కాంగ్రెస్(congress)​ అగ్రనేత రాహుల్​ గాంధీ(rahul gandhi) నివాళులు అర్పించారు. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్(arvind kejriwal)​ కూడా నెహ్రూకు ట్విట్టర్(twitter)​ వేదికగా నివాళులు అర్పించారు.

Rahul Gandhi
నెహ్రూకు రాహుల్ నివాళులు

భారత మాజీ ప్రధాన మంత్రి పండిట్​ జవహర్​లాల్ నెహ్రూ 57వ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్(congress)​ అగ్రనేత రాహుల్​ గాంధీ(rahul gandhi) దిల్లీలోని శాంతివన్​లో గురువారం ఆయనకు నివాళులు అర్పించారు. అనంతరం.. నెహ్రూ చెప్పిన మాటలను ట్విట్టర్(twitter)​ వేదికగా స్మరించుకున్నారు.

"'విచ్చలవిడిగా చెడు విజృంభిస్తే.. అది మొత్తం వ్యవస్థనే విషపూరితం చేస్తుంది.' అని నెహ్రూ చెప్పిన మాటలను ఆయన వర్ధంతి సందర్భంగా స్మరించుకుందాం."

-రాహుల్ గాంధీ(rahul gandhi), కాంగ్రెస్ అగ్రనేత

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​(arvind kejriwal) కూడా నెహ్రూకు నివాళులు అర్పించారు. "భారత తొలి ప్రధాన మంత్రి జవహర్​లాల్​ నెహ్రూ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు." అని హిందీలో ట్వీట్​ చేశారు.

1889 నవంబర్​ 14న నెహ్రూ జన్మించారు. 1919 ఇండియన్​ నేషనల్​ కాంగ్రెస్(congress)​లో చేరిన ఆయన.. మహాత్మాగాంధీతో కలిసి స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. 1923లో ఐఎన్​సీ(కాంగ్రెస్​) ప్రధాన కార్యదర్శిగా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం.. 1947 ఆగస్టు 15న భారత తొలి ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1964 మే 27న మరణించేవరకు ఆయన ఆ పదవిలో కొనసాగారు.

ఇదీ చూడండి: 'కొవిడ్​ను నియంత్రించాలంటే టీకా పంపిణీ పెరగాలి'

ఇదీ చూడండి: vaccination: 20 కోట్లు దాటిన వ్యాక్సిన్​ డోసుల పంపిణీ

భారత మాజీ ప్రధాన మంత్రి పండిట్​ జవహర్​లాల్ నెహ్రూ 57వ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్(congress)​ అగ్రనేత రాహుల్​ గాంధీ(rahul gandhi) దిల్లీలోని శాంతివన్​లో గురువారం ఆయనకు నివాళులు అర్పించారు. అనంతరం.. నెహ్రూ చెప్పిన మాటలను ట్విట్టర్(twitter)​ వేదికగా స్మరించుకున్నారు.

"'విచ్చలవిడిగా చెడు విజృంభిస్తే.. అది మొత్తం వ్యవస్థనే విషపూరితం చేస్తుంది.' అని నెహ్రూ చెప్పిన మాటలను ఆయన వర్ధంతి సందర్భంగా స్మరించుకుందాం."

-రాహుల్ గాంధీ(rahul gandhi), కాంగ్రెస్ అగ్రనేత

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​(arvind kejriwal) కూడా నెహ్రూకు నివాళులు అర్పించారు. "భారత తొలి ప్రధాన మంత్రి జవహర్​లాల్​ నెహ్రూ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు." అని హిందీలో ట్వీట్​ చేశారు.

1889 నవంబర్​ 14న నెహ్రూ జన్మించారు. 1919 ఇండియన్​ నేషనల్​ కాంగ్రెస్(congress)​లో చేరిన ఆయన.. మహాత్మాగాంధీతో కలిసి స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. 1923లో ఐఎన్​సీ(కాంగ్రెస్​) ప్రధాన కార్యదర్శిగా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం.. 1947 ఆగస్టు 15న భారత తొలి ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1964 మే 27న మరణించేవరకు ఆయన ఆ పదవిలో కొనసాగారు.

ఇదీ చూడండి: 'కొవిడ్​ను నియంత్రించాలంటే టీకా పంపిణీ పెరగాలి'

ఇదీ చూడండి: vaccination: 20 కోట్లు దాటిన వ్యాక్సిన్​ డోసుల పంపిణీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.