ETV Bharat / bharat

ఆగని పోరాటం- రైతన్నకు సర్వత్రా మద్దతు

author img

By

Published : Dec 11, 2020, 10:54 AM IST

దిల్లీలో రైతుల అందోళన 16వ రోజుకు చేరింది. కేంద్రం దిగొచ్చి నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని తేల్చిచెబుతున్నారు రైతులు. త్వరలోనే రైల్వే ట్రాక్​లను దిగ్బంధిస్తామని హెచ్చరిస్తున్నారు. మరోవైపు రైతులకు సర్వత్రా మద్దతు లభిస్తోంది. దిల్లీలో కొందరు వారికి ఉచితంగా భోజన వసతులు కల్పిస్తున్నారు.

Protesting farmers threaten to block railway tracks if demands not met by govt
ఆగని పోరాటం- రైతన్నకు సర్వత్రా మద్దతు
16వ రోజుకు రైతన్నల ఆందోళన

నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని దిల్లీలో రైతుల నిరసనలు 16వ రోజుకు చేరాయి. కేంద్రం దిగొచ్చి చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్​ చేస్తున్నారు కర్షకులు. అయితే చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెబుతున్న ప్రభుత్వం.. చట్టాలను మాత్రం వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని మరోమారు తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో ఆందోళనను ఉద్ధృతం చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు అన్నదాతలు.

కరోనా కల్లోలం...

రైతులు నిరసనలు చేపట్టిన టిక్రి, సింఘు, ఘాజిపూర్​, నోయిడా సరిహద్దు ప్రాంతాల్లో బలగాలను భారీగా మోహరించింది కేంద్రం. అయితే సింఘు సరిహద్దులో కరోనా కలకలం సృష్టించింది. ఆ ప్రాంతంలో మోహరించిన పోలీసు సిబ్బందిలో ఇద్దరికి కరోనా పాజిటివ్​గా తేలింది.

Protesting farmers threaten to block railway tracks if demands not met by govt
సింఘు సరిహద్దు వద్ద బలగాలు
Protesting farmers threaten to block railway tracks if demands not met by govt
సింఘు సరిహద్దు వద్ద రైతుల నిరసనలు

ఎన్ని అడ్డంకులు వచ్చినా తాము మాత్రం వెనక్కి తగ్గేది లేదని రోడ్ల మీద బైఠాయించి నిరసనలు తెలుపుతున్నారు అన్నదాతలు. ఆందోళనల్లో భాగంగా శనివారం దిల్లీ-జైపుర్, దిల్లీ-ఆగ్రా రహదారులను దిగ్బంధిస్తామని వెల్లడించారు. టోల్​ గేట్ల వద్ద రుసుము కట్టకుండా నిరసన తెలపాలని యావత్​ దేశానికి పిలుపునిచ్చారు. త్వరలో రైల్వే ట్రాక్​లు ముట్టిడిస్తామని స్పష్టం చేశారు.

Protesting farmers threaten to block railway tracks if demands not met by govt
టిక్రి సరిహద్దులో పరిస్థితి
Protesting farmers threaten to block railway tracks if demands not met by govt
ఆందోళనలకు సన్నద్ధం

సర్వత్రా మద్దతు...

దేశవ్యాప్తంగా రైతుల ఆందోళనలకు మద్దతు లభిస్తోంది. అమృత్​సర్​లోని కిసాన్​ మజ్​దూర్​ సంఘర్ష్​ కమిటీ సభ్యులు.. 700 ట్రాక్టర్లతో దిల్లీకి బయలుదేరారు. కుండ్లి సరిహద్దులో ఆందోళనలు చేపట్టేందుకు వెళుతున్నట్టు కమిటీ సభ్యులు వెల్లడించారు.

Protesting farmers threaten to block railway tracks if demands not met by govt
దిల్లీకి తరలిన మజ్​దూర్​ సంఘర్ష్​ కమిటీ
Protesting farmers threaten to block railway tracks if demands not met by govt
700 ట్రాక్టర్లతో దిల్లీకి రైతులు

16 రోజులుగా నిర్విరామంగా పోరాడుతున్న రైతులకు స్వచ్ఛంద సంస్థలు అండగా నిలుస్తున్నాయి. అమృత్​సర్​కు చెందిన ఓ బృందం.. ఘాజీపుర్​ సరిహద్దు వద్ద ఉన్న రైతులకు భోజనం ఏర్పాట్లు చేస్తోంది. లెక్కలేనంత మందికి ఆహారం కల్పిస్తోంది. ప్రభుత్వం అన్నదాతల మాట వినేంతవరకు కొనసాగిస్తామని స్పష్టం చేసింది.

Protesting farmers threaten to block railway tracks if demands not met by govt
రైతులకు భోజన వసతులు కల్పిస్తున్న పంజాబ్​ బృందం
Protesting farmers threaten to block railway tracks if demands not met by govt
ఉచితంగా ఆహార పంపిణీ

ఇదీ చూడండి:- సాగు చట్టాల రద్దుకై రాష్ట్రపతికి విపక్షాల వినతి

16వ రోజుకు రైతన్నల ఆందోళన

నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని దిల్లీలో రైతుల నిరసనలు 16వ రోజుకు చేరాయి. కేంద్రం దిగొచ్చి చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్​ చేస్తున్నారు కర్షకులు. అయితే చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెబుతున్న ప్రభుత్వం.. చట్టాలను మాత్రం వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని మరోమారు తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో ఆందోళనను ఉద్ధృతం చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు అన్నదాతలు.

కరోనా కల్లోలం...

రైతులు నిరసనలు చేపట్టిన టిక్రి, సింఘు, ఘాజిపూర్​, నోయిడా సరిహద్దు ప్రాంతాల్లో బలగాలను భారీగా మోహరించింది కేంద్రం. అయితే సింఘు సరిహద్దులో కరోనా కలకలం సృష్టించింది. ఆ ప్రాంతంలో మోహరించిన పోలీసు సిబ్బందిలో ఇద్దరికి కరోనా పాజిటివ్​గా తేలింది.

Protesting farmers threaten to block railway tracks if demands not met by govt
సింఘు సరిహద్దు వద్ద బలగాలు
Protesting farmers threaten to block railway tracks if demands not met by govt
సింఘు సరిహద్దు వద్ద రైతుల నిరసనలు

ఎన్ని అడ్డంకులు వచ్చినా తాము మాత్రం వెనక్కి తగ్గేది లేదని రోడ్ల మీద బైఠాయించి నిరసనలు తెలుపుతున్నారు అన్నదాతలు. ఆందోళనల్లో భాగంగా శనివారం దిల్లీ-జైపుర్, దిల్లీ-ఆగ్రా రహదారులను దిగ్బంధిస్తామని వెల్లడించారు. టోల్​ గేట్ల వద్ద రుసుము కట్టకుండా నిరసన తెలపాలని యావత్​ దేశానికి పిలుపునిచ్చారు. త్వరలో రైల్వే ట్రాక్​లు ముట్టిడిస్తామని స్పష్టం చేశారు.

Protesting farmers threaten to block railway tracks if demands not met by govt
టిక్రి సరిహద్దులో పరిస్థితి
Protesting farmers threaten to block railway tracks if demands not met by govt
ఆందోళనలకు సన్నద్ధం

సర్వత్రా మద్దతు...

దేశవ్యాప్తంగా రైతుల ఆందోళనలకు మద్దతు లభిస్తోంది. అమృత్​సర్​లోని కిసాన్​ మజ్​దూర్​ సంఘర్ష్​ కమిటీ సభ్యులు.. 700 ట్రాక్టర్లతో దిల్లీకి బయలుదేరారు. కుండ్లి సరిహద్దులో ఆందోళనలు చేపట్టేందుకు వెళుతున్నట్టు కమిటీ సభ్యులు వెల్లడించారు.

Protesting farmers threaten to block railway tracks if demands not met by govt
దిల్లీకి తరలిన మజ్​దూర్​ సంఘర్ష్​ కమిటీ
Protesting farmers threaten to block railway tracks if demands not met by govt
700 ట్రాక్టర్లతో దిల్లీకి రైతులు

16 రోజులుగా నిర్విరామంగా పోరాడుతున్న రైతులకు స్వచ్ఛంద సంస్థలు అండగా నిలుస్తున్నాయి. అమృత్​సర్​కు చెందిన ఓ బృందం.. ఘాజీపుర్​ సరిహద్దు వద్ద ఉన్న రైతులకు భోజనం ఏర్పాట్లు చేస్తోంది. లెక్కలేనంత మందికి ఆహారం కల్పిస్తోంది. ప్రభుత్వం అన్నదాతల మాట వినేంతవరకు కొనసాగిస్తామని స్పష్టం చేసింది.

Protesting farmers threaten to block railway tracks if demands not met by govt
రైతులకు భోజన వసతులు కల్పిస్తున్న పంజాబ్​ బృందం
Protesting farmers threaten to block railway tracks if demands not met by govt
ఉచితంగా ఆహార పంపిణీ

ఇదీ చూడండి:- సాగు చట్టాల రద్దుకై రాష్ట్రపతికి విపక్షాల వినతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.