ETV Bharat / bharat

కర్ణాటక బంద్​ ఉద్రిక్తం.. పలువురి అరెస్ట్​!

మరాఠా అభివృద్ధి ప్రాధికార సంస్థ ఏర్పాటును నిరసిస్తూ కర్ణాటకలో బంద్​ చేపట్టాయి కన్నడ అనుకూల సంఘాలు. బెంగళూరులోని టౌన్​హాల్​ వద్ద పెద్ద ఎత్తన కార్యకర్తల చేరి నిరసన తెలిపారు. ఈ క్రమంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పలువురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోనూ ఆందోళనలు చేశారు కన్నడీగులు.

author img

By

Published : Dec 5, 2020, 11:06 AM IST

Updated : Dec 5, 2020, 11:22 AM IST

karnataka bandh
కర్ణాటకలో 'మరాఠా' బంద్​ ఉద్రిక్తం

కర్ణాటకలో మరాఠా అభివృద్ధి ప్రాధికార (డెవలప్​మెంట్​ కార్పొరేషన్) సంస్థ​ ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కర్ణాటకలో బంద్​ చేపట్టాయి కన్నడ అనుకూల సంఘాలు. బెంగళూరుతో పాటు పలు ప్రాంతాల్లో నిరసనలకు దిగాయి. ప్రభుత్వ నిర్ణయం కన్నడ ఐక్యతకు గొడ్డలిపెట్టు లాంటిదని కర్ణాటక రక్షణ వేదిక, కన్నడ చలువళి, కన్నడ ఒక్కూటా వంటి సంఘాలు మండిపడ్డాయి.

బెంగళూరు టౌన్​హాల్​ వద్ద పెద్ద సంఖ్యలో కన్నడీగులు చేరి ఆందోళనలు చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారిని పోలీసులు అడ్డుకోగా.. ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పలువురు కార్యకర్తలను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు పోలీసులు. అలాగే.. చామరాజనగర్​, బెంగళూరు రూరల్​, గదగ్​, కొప్పా, హస్సాన్​, రామనగర్​, చిత్రదుర్గా, దవాంజెర్​, బగల్కోట్​, చిక్కమగలూరు, మాండ్య సహా ఇతర జిల్లాల్లో ఆందోళనలు చేపట్టారు. కన్నడ ఆర్గనైజేషన్స్​లోని భాగస్వామ్య సంస్థలు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా శనివారం సాయంత్రం బెంగళూరులోని టౌన్​ హాల్​ నుంచి ప్రీడమ్​ పార్క్​ వరకు ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించాయి.

karnataka bandh
కార్యకర్తలను బస్సులోకి ఎక్కిస్తున్న పోలీసులు
karnataka bandh
కన్నడ అనుకూల నేతలను బలవంతంగా తరలిస్తున్న పోలీసులు
karnataka bandh
కార్యకర్తలను బస్సులో తరలిస్తున్న పోలీసులు

ఈ క్రమంలో భారీ బందోబస్త్​ ఏర్పాటు చేశారు పోలీసులు. బెంగళూరుతో పాటు ఇతర ప్రాంతాల్లో బలగాలను మోహరించారు.

karnataka bandh
బంద్​ నేపథ్యంలో బలగాల మోహరింపు

బంద్​ నేపథ్యంలో బెంగళూరులోని శివాజీ నగర్​లో నిర్మానుష్య దృశ్యాలు కనిపించాయి. నగరంలోని బాలగంగాధరనాథ స్వామీజీ, మగాడి రోడ్​ మెట్రో స్టేషన్లలో జనసంచారం కనిపించలేదు. హుబ్లీ నగరంలో బంద్​ ప్రభావం పాక్షికంగానే ఉంది. రోడ్లపై ప్రజారవాణా సాధారణంగానే కనిపించినప్పటికీ.. జనాల తాకిడి లేదు.

karnataka bandh
మెట్రోలో కనిపించని జనం

సీఎం వినతి..

మరాఠా అభివృద్ధి సంస్థ ఏర్పాటును వ్యతిరేకిస్తూ పిలుపునిచ్చిన బంద్​ను విరమించుకోవాలని శుక్రవారం కన్నడ అనుకూల సంఘాలను కోరారు రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప, హోంమంత్రి బసవరాజ్​ బొమ్మాయ్​. బలవంతంగా వాణిజ్య సముదాయాలను మూసివేయాలని చూస్తే.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇదీ చూడండి:సీఎం ప్రకటనతో కర్ణాటకలో 'మరాఠా' చిచ్చు

కర్ణాటకలో మరాఠా అభివృద్ధి ప్రాధికార (డెవలప్​మెంట్​ కార్పొరేషన్) సంస్థ​ ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కర్ణాటకలో బంద్​ చేపట్టాయి కన్నడ అనుకూల సంఘాలు. బెంగళూరుతో పాటు పలు ప్రాంతాల్లో నిరసనలకు దిగాయి. ప్రభుత్వ నిర్ణయం కన్నడ ఐక్యతకు గొడ్డలిపెట్టు లాంటిదని కర్ణాటక రక్షణ వేదిక, కన్నడ చలువళి, కన్నడ ఒక్కూటా వంటి సంఘాలు మండిపడ్డాయి.

బెంగళూరు టౌన్​హాల్​ వద్ద పెద్ద సంఖ్యలో కన్నడీగులు చేరి ఆందోళనలు చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారిని పోలీసులు అడ్డుకోగా.. ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పలువురు కార్యకర్తలను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు పోలీసులు. అలాగే.. చామరాజనగర్​, బెంగళూరు రూరల్​, గదగ్​, కొప్పా, హస్సాన్​, రామనగర్​, చిత్రదుర్గా, దవాంజెర్​, బగల్కోట్​, చిక్కమగలూరు, మాండ్య సహా ఇతర జిల్లాల్లో ఆందోళనలు చేపట్టారు. కన్నడ ఆర్గనైజేషన్స్​లోని భాగస్వామ్య సంస్థలు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా శనివారం సాయంత్రం బెంగళూరులోని టౌన్​ హాల్​ నుంచి ప్రీడమ్​ పార్క్​ వరకు ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించాయి.

karnataka bandh
కార్యకర్తలను బస్సులోకి ఎక్కిస్తున్న పోలీసులు
karnataka bandh
కన్నడ అనుకూల నేతలను బలవంతంగా తరలిస్తున్న పోలీసులు
karnataka bandh
కార్యకర్తలను బస్సులో తరలిస్తున్న పోలీసులు

ఈ క్రమంలో భారీ బందోబస్త్​ ఏర్పాటు చేశారు పోలీసులు. బెంగళూరుతో పాటు ఇతర ప్రాంతాల్లో బలగాలను మోహరించారు.

karnataka bandh
బంద్​ నేపథ్యంలో బలగాల మోహరింపు

బంద్​ నేపథ్యంలో బెంగళూరులోని శివాజీ నగర్​లో నిర్మానుష్య దృశ్యాలు కనిపించాయి. నగరంలోని బాలగంగాధరనాథ స్వామీజీ, మగాడి రోడ్​ మెట్రో స్టేషన్లలో జనసంచారం కనిపించలేదు. హుబ్లీ నగరంలో బంద్​ ప్రభావం పాక్షికంగానే ఉంది. రోడ్లపై ప్రజారవాణా సాధారణంగానే కనిపించినప్పటికీ.. జనాల తాకిడి లేదు.

karnataka bandh
మెట్రోలో కనిపించని జనం

సీఎం వినతి..

మరాఠా అభివృద్ధి సంస్థ ఏర్పాటును వ్యతిరేకిస్తూ పిలుపునిచ్చిన బంద్​ను విరమించుకోవాలని శుక్రవారం కన్నడ అనుకూల సంఘాలను కోరారు రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప, హోంమంత్రి బసవరాజ్​ బొమ్మాయ్​. బలవంతంగా వాణిజ్య సముదాయాలను మూసివేయాలని చూస్తే.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇదీ చూడండి:సీఎం ప్రకటనతో కర్ణాటకలో 'మరాఠా' చిచ్చు

Last Updated : Dec 5, 2020, 11:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.