ETV Bharat / bharat

అఫ్గాన్​ సిక్కు- హిందూ ప్రతినిధులతో మోదీ భేటీ

author img

By

Published : Feb 19, 2022, 4:39 PM IST

Updated : Feb 19, 2022, 4:56 PM IST

PM Modi: అఫ్గానిస్థాన్​కు చెందిన సిక్కు- హిందూ సమాజ ప్రతినిధులతో తన నివాసంలో భేటీ అయ్యారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అఫ్గాన్​ నుంచి సిక్కులు, హిందువులను సురక్షితంగా భారత్​కు తీసుకురావటంపై ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు సిక్కు ప్రముఖులు. ఓ జ్ఞాపికను అందజేశారు.

Prime Minister Narendra Modi
అఫ్గాన్​ సిక్కు-హిందూ ప్రతినిధుల మోదీ భేటీ

PM Modi: అఫ్గానిస్థాన్​లోని సిక్కు-హిందూ సమాజానికి చెందిన పలువురు ప్రముఖులు.. దిల్లీ 7 లోక్​ కల్యాణ్​ మార్గ్​లోని నివాసంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జ్ఞాపికను అందించారు. అఫ్గాన్​ నుంచి సిక్కులు, హిందువులను సురక్షితంగా భారత్​కు తీసుకురావటంపై కృతజ్ఞతలు తెలిపారని పీఎంఓ వెల్లడించింది. ఈ క్రమంలో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) ప్రాముఖ్యత, దాని ప్రయోజనాలపై ప్రధాని మాట్లాడారని పేర్కొంది. సిక్కు సమాజానికి తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని, వారి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపింది.

అలాగే.. గురు గ్రాంత్​ సాహిబ్​ను గౌరవించుకునే సంప్రదాయం ప్రాముఖ్యతను మోదీ గుర్తు చేసుకున్నట్లు చెప్పింది పీఎంఓ. అందులో భాగంగానే అఫ్గాన్​ నుంచి గురు గ్రాంత్​ సాహిబ్​ స్వరూప్​ను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు పేర్కొంది. కొన్నేళ్లుగా అఫ్గాన్లు తమ పట్ల చూపిస్తున్న ప్రేమను, తాను కాబుల్​ వెళ్లిన సందర్భాన్ని మోదీ గుర్తు చేసుకున్నట్లు చెప్పింది.

గత ఏడాది అఫ్గానిస్థాన్​ నుంచి భారత్​కు వచ్చిన నిదాన్​ సింగ్​ సచ్​దేవ్ ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు​.

" గురుద్వారా నుంచి తాలిబన్లు నన్ను కిడ్నాప్​ చేశారు. భారత గూఢచారులుగా వారు భావించారు. మమ్మల్ని మతం మార్చాలనుకున్నారు. ప్రధాని మోదీకి మా కృతజ్ఞతలు. భారత ప్రభుత్వం చేసిన సాయానికి చాలా సంతోషంగా ఉంది. మాకు కేవలం ఆవాసం, పౌరసత్వం కావాలి. "

- నిదాన్​ సింగ్​ సచ్​దేవ్​, అఫ్గాన్​ సిక్కు

కాబుల్​లోని పరిస్థితులను ప్రధానికి వివరించినట్లు చెప్పారు తరేంద్ర సింగ్. ఆయన 1989లో అఫ్గాన్​ నుంచి భారత్​ వచ్చి స్థిరపడ్డారు. పౌరసత్వం కోసం ఎదురుచూస్తున్నామని, సీఏఏ, పౌరసత్వాన్ని ఒకే విండో కిందకు తీసుకురావాలనుకుంటున్న మోదీకి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు సింగ్​. ​

ఇదీ చూడండి: Russia-Ukraine Crisis: 'రష్యా- ఉక్రెయిన్​ మధ్య యుద్ధం వస్తే విపత్తే'!

PM Modi: అఫ్గానిస్థాన్​లోని సిక్కు-హిందూ సమాజానికి చెందిన పలువురు ప్రముఖులు.. దిల్లీ 7 లోక్​ కల్యాణ్​ మార్గ్​లోని నివాసంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జ్ఞాపికను అందించారు. అఫ్గాన్​ నుంచి సిక్కులు, హిందువులను సురక్షితంగా భారత్​కు తీసుకురావటంపై కృతజ్ఞతలు తెలిపారని పీఎంఓ వెల్లడించింది. ఈ క్రమంలో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) ప్రాముఖ్యత, దాని ప్రయోజనాలపై ప్రధాని మాట్లాడారని పేర్కొంది. సిక్కు సమాజానికి తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని, వారి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపింది.

అలాగే.. గురు గ్రాంత్​ సాహిబ్​ను గౌరవించుకునే సంప్రదాయం ప్రాముఖ్యతను మోదీ గుర్తు చేసుకున్నట్లు చెప్పింది పీఎంఓ. అందులో భాగంగానే అఫ్గాన్​ నుంచి గురు గ్రాంత్​ సాహిబ్​ స్వరూప్​ను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు పేర్కొంది. కొన్నేళ్లుగా అఫ్గాన్లు తమ పట్ల చూపిస్తున్న ప్రేమను, తాను కాబుల్​ వెళ్లిన సందర్భాన్ని మోదీ గుర్తు చేసుకున్నట్లు చెప్పింది.

గత ఏడాది అఫ్గానిస్థాన్​ నుంచి భారత్​కు వచ్చిన నిదాన్​ సింగ్​ సచ్​దేవ్ ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు​.

" గురుద్వారా నుంచి తాలిబన్లు నన్ను కిడ్నాప్​ చేశారు. భారత గూఢచారులుగా వారు భావించారు. మమ్మల్ని మతం మార్చాలనుకున్నారు. ప్రధాని మోదీకి మా కృతజ్ఞతలు. భారత ప్రభుత్వం చేసిన సాయానికి చాలా సంతోషంగా ఉంది. మాకు కేవలం ఆవాసం, పౌరసత్వం కావాలి. "

- నిదాన్​ సింగ్​ సచ్​దేవ్​, అఫ్గాన్​ సిక్కు

కాబుల్​లోని పరిస్థితులను ప్రధానికి వివరించినట్లు చెప్పారు తరేంద్ర సింగ్. ఆయన 1989లో అఫ్గాన్​ నుంచి భారత్​ వచ్చి స్థిరపడ్డారు. పౌరసత్వం కోసం ఎదురుచూస్తున్నామని, సీఏఏ, పౌరసత్వాన్ని ఒకే విండో కిందకు తీసుకురావాలనుకుంటున్న మోదీకి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు సింగ్​. ​

ఇదీ చూడండి: Russia-Ukraine Crisis: 'రష్యా- ఉక్రెయిన్​ మధ్య యుద్ధం వస్తే విపత్తే'!

Last Updated : Feb 19, 2022, 4:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.