ETV Bharat / bharat

'నేటి అంకుర సంస్థలే.. రేపటి బహుళజాతి కంపెనీలు'

ఒడిశాలోని ఐఐఎం-సంబల్​పుర్​ శాశ్వత క్యాంపస్​కు శంకుస్థాపన చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు మోదీ.

author img

By

Published : Jan 2, 2021, 11:27 AM IST

Updated : Jan 2, 2021, 11:55 AM IST

PM Modi
ఐఐఎం-సంబల్​పుర్​ శాశ్వత క్యాంపస్​కు మోదీ శంకుస్థాపన

ఒడిశాలోని ఐఐఎం-సంబల్​పుర్​ శాశ్వత క్యాంపస్​కు వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా శంకుస్థాపన చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. నేటి అంకుర పరిశ్రమలే రేపటి మల్టీనేషనల్​ కంపెనీలుగా మారతాయని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపడుతోన్న సంస్కరణలు అంకుర సంస్థలకు కొత్త మార్గాలను చూపుతాయన్నారు.

" నేటి అంకుర పరిశ్రమలే రేపటి మల్టీనేషనల్​ కంపెనీలు. దేశంలోని టైర్​ 2, 3 నగరాల్లోనే ఎక్కువ అంకుర పరిశ్రమలు వెలువడ్డాయి. వ్యవసాయ రంగం నుంచి అంతరిక్ష రంగం వరకు చేపట్టిన సంస్కరణలు స్టార్టప్​లకు కొత్త మార్గాలను చూపుతాయి. 2014 వరకు భారత్​లో 13 ఐఐఎంలు ఉన్నాయి. ఇప్పుడు 20కి చేరుకున్నాయి. అంత భారీ సంఖ్యలో నైపుణ్యవంతులతో ఆత్మనిర్భర్​ భారత్​ కార్యక్రమానికి బలం చేకూరనుంది. మేనేజ్​మెంట్​ రంగంలో కీలక మంత్రాలుగా ఆవిష్కరణ, సమగ్రతలు ఉన్నాయి. పని తీరులో మార్పుతో మేనేజ్​మెంట్​ విధానంలోనే మార్పు వచ్చింది. ప్రస్తుతం సహకార, వినూత్న, రూపాంతర మేనేజ్​మెంట్​పై దృష్టి పెట్టాలి. "

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

ఈ కార్యక్రమంలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్​ పట్నాయక్​, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈశాన్య భారతంలో రాష్ట్రం విద్యకు కేంద్రంగా మారుతోందన్నారు సీఎం. విద్యా రంగం అభివృద్ధి కోసం రాష్ట్రం కృషి చేయటం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.

ఒడిశాలోని ఐఐఎం-సంబల్​పుర్​ శాశ్వత క్యాంపస్​కు వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా శంకుస్థాపన చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. నేటి అంకుర పరిశ్రమలే రేపటి మల్టీనేషనల్​ కంపెనీలుగా మారతాయని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపడుతోన్న సంస్కరణలు అంకుర సంస్థలకు కొత్త మార్గాలను చూపుతాయన్నారు.

" నేటి అంకుర పరిశ్రమలే రేపటి మల్టీనేషనల్​ కంపెనీలు. దేశంలోని టైర్​ 2, 3 నగరాల్లోనే ఎక్కువ అంకుర పరిశ్రమలు వెలువడ్డాయి. వ్యవసాయ రంగం నుంచి అంతరిక్ష రంగం వరకు చేపట్టిన సంస్కరణలు స్టార్టప్​లకు కొత్త మార్గాలను చూపుతాయి. 2014 వరకు భారత్​లో 13 ఐఐఎంలు ఉన్నాయి. ఇప్పుడు 20కి చేరుకున్నాయి. అంత భారీ సంఖ్యలో నైపుణ్యవంతులతో ఆత్మనిర్భర్​ భారత్​ కార్యక్రమానికి బలం చేకూరనుంది. మేనేజ్​మెంట్​ రంగంలో కీలక మంత్రాలుగా ఆవిష్కరణ, సమగ్రతలు ఉన్నాయి. పని తీరులో మార్పుతో మేనేజ్​మెంట్​ విధానంలోనే మార్పు వచ్చింది. ప్రస్తుతం సహకార, వినూత్న, రూపాంతర మేనేజ్​మెంట్​పై దృష్టి పెట్టాలి. "

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

ఈ కార్యక్రమంలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్​ పట్నాయక్​, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈశాన్య భారతంలో రాష్ట్రం విద్యకు కేంద్రంగా మారుతోందన్నారు సీఎం. విద్యా రంగం అభివృద్ధి కోసం రాష్ట్రం కృషి చేయటం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.

Last Updated : Jan 2, 2021, 11:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.